‘భీమ్లీ’ ఖల్ నాయక్!
‘‘నాయక్ నహీ.. ఖల్ నాయక్ మై హూ..!’’ అంటూ ఆయన చేసే హడావుడి అంతాఇంతా కాదు. ‘‘ఏం చేస్తున్నావ్? యూనిఫామ్ తీసేయ్..!’’ అంటూ పోలీసులపైనే రుసరుసలాడతారు.
పోలీసులు, అధికారులు, నేతలపై రుసరుస
వారి కష్టాలు ఆ శ్రీనివాసుడికే ఎరుక
అక్రమాలు, భూదందాలు ఆయన ‘అవ’ లక్షణాలు
తన వంతుగా కొండలు, ఇసుక, మట్టి భోజ్యం
విశాఖ సముద్ర తీరాన అవినీతి తిమింగలం
ఈనాడు, విశాఖపట్నం, అమరావతి
‘‘నాయక్ నహీ.. ఖల్ నాయక్ మై హూ..!’’
అంటూ ఆయన చేసే హడావుడి అంతాఇంతా కాదు.
‘‘ఏం చేస్తున్నావ్? యూనిఫామ్ తీసేయ్..!’’ అంటూ పోలీసులపైనే రుసరుసలాడతారు.
అధికారులైనా... ఎవరైనా సరే.. ‘‘అరేయ్.. ఒరేయ్ అంటూ..’’ సంబోధిస్తారు
ఆయన ముందు నిలబడాలంటే ఎవరికైనా ఇబ్బందే!
వైకాపా సర్కారు అధికారం చేపట్టిన మొదట్లో ఆయన రాష్ట్రస్థాయిలో కీలకస్థానంలో ఉన్నారు. ఓ జిల్లాకు పార్టీ సారథిగానూ కొనసాగారు. ఆయన పేరు, ప్రఖ్యాతలు ఈ సముద్ర తీరప్రాంతానికే పరిమితం కాలేదు. ఇంతులతో సాగించిన ‘సంభాషణల చాతుర్యం’ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం రేపింది. సొంత పార్టీ మహిళా అధ్యక్షులు, నేతలతో ఆయన వివాదాలు జోకులుగా పేలుతూ సోషల్ మీడియాలో ఇప్పటికీ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. విశాఖలోని ఎంతో సుందరమైన బీచ్కు ఈ ప్రాంతం పెట్టింది పేరు. అంతటి అందమైన తీరప్రాంతం అంతుచూసే దాకా వదిలి పెట్టలేదు ఈ ‘భీమ్లీ’ నాయక్! పచ్చనైన కొండలను గుండు చేయించారు. నదీ గర్భంలో ఇసుకను కొల్లగొట్టారు. ప్రభుత్వ శాఖల్లోని ‘పొరుగు’ పోస్టులకు బేరం పెట్టారు. ఓ ఫార్మా కంపెనీలో కాసులు దండుకోవడాన్నే ప్రధాన పనిగా పెట్టుకున్నారు. తనకు అనుకూలంగా లేకపోతే ప్రతిపక్ష నేతలే కాదు.. సొంత పార్టీ నాయకులపైనా ప్రతాపం చూపారు. అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేశారు. సంపదను ‘శ్రీ’నివాసంగా మార్చుకునే క్రమంలో ప్రభుత్వ భూములను కబ్జా చేశారు. ఈయన అక్రమాలకు తన బంధుగణం వంత పాడుతుంది. ఆ బంధుగణమే ఈ నేత అవినీతి తంతుకు నేతృత్వం వహిస్తుంటుంది.
గెడ్డలు పూడ్చి.. భూములు ఆక్రమించి
ఈ నాయకుడి ప్రోద్బలంతోనే తన సోదరులు, బంధువులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. 2015లో అడవివరంలో దేవస్థానానికి చెందిన సుమారు 13 ఎకరాల భూమిని 33 ఏళ్లకు లీజుకు తీసుకున్నారు. లీజుదారుడు ఈ నాయకుడికి స్వయానా సోదరుడు. ఆ భూమిలో ఓ స్కూలు నిర్మించిన లీజుదారుడు.. ఆ పక్కనే ఉన్న 7-8 ఎకరాల భూమిని సైతం ఆక్రమించారన్న ఆరోపణలున్నాయి. స్కూలుకు రహదారి వేయడం కోసం రామన్నచెరువుకు వెళ్లే గెడ్డను పూడ్చేశారు. దీని పూడ్చివేతను వ్యతిరేకిస్తూ స్థానికులు ధర్నాలు సైతం చేశారు. దేవస్థానానికి డబ్బులు చెల్లించకపోవడంతో ఇటీవల లీజుదారుడికి నోటీసులు జారీ చేశారు.
నోటి దురుసెక్కువ..
ప్రతిపక్ష నేతలే కాదు.. ఆయన ధాటికి సొంత పార్టీ(వైకాపా) ద్వితీయశ్రేణి నాయకులు కూడా విలవిల్లాడుతున్నారు. నోటిదురుసు ఎక్కువ అని అధికారవర్గాల్లో ఆయనకు పేరు ఉంది. ‘‘నీకు ఎవడు ఉద్యోగం ఇచ్చాడు’’ అంటూ అధికారులను కించపరుస్తూ జనాల మధ్యనే అవమానాలకు గురిచేస్తారు. కలెక్టరు సమక్షంలోనే ఓ ఎస్సైని పట్టుకుని ‘ఏం డ్యూటీ చేస్తావయ్యా’’ అంటూ ఎగతాళిగా మాట్లాడారు. ఉత్సవాల్లో నృత్యాలకు అనుమతివ్వలేదని ఓ సీఐని బదిలీ చేయించారు. మత్స్యశాఖ అధికారిణి గురించి ఈ నాయకుడు మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అయ్యప్ప మాలధారణలో ఉన్న ఒక ఎంపీడీవోను కూడా ఇటీవల తిడుతూ విరుచుకుపడటం వివాదాస్పదమైంది. అధికారులతోపాటు పార్టీ మండల స్థాయి నాయకులు కూడా ఈ నేత వ్యవహార శైలిపై అసంతృప్తిగా ఉన్నారు. అందరూ ఉండగానే ‘అరేయ్.. ఒరేయ్’ అని చులకనగా మాట్లాడతారని మండల స్థాయి నేతలు వాపోతున్నారు.
ఒక్కో పోస్టుకు రూ.లక్షల్లో వసూలు
నియోజకవర్గంలోని ఓ భారీ ఫార్మా కంపెనీని గుప్పిట్లో పెట్టుకున్నారు. ఆ కంపెనీ వ్యర్థాలు సముద్రంలో కలుస్తుండటం ఆయనకు బాగానే కలిసొస్తోంది! ‘వ్యర్థాలు సముద్రంలో కలిస్తే జలచరాలు ఏమవ్వాలి..? కాలుష్యం పెరిగిపోయి మానవాళి ఆరోగ్యం దెబ్బతినదూ..?’ అని బెదిరిస్తూ ఫార్మా కంపెనీని మొదట ఇరకాటంలో పడేస్తారు. తర్వాత నిబంధనల ‘వల’ను తెరపైకి తీసుకొచ్చి ఆ కంపెనీ నుంచి డబ్బు గుంజుతున్నారు. అంతేకాదు.. తాను సూచించిన వారికే కొలువులు ఇవ్వాలంటూ ఆ కంపెనీకి షరతు విధించారు. కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తూ నిరుద్యోగుల నుంచి భారీ వసూళ్లకు తెగబడుతున్నారు. విద్యుత్ సబ్స్టేషన్ షిఫ్టు ఆపరేటర్ల్ల పోస్టు కోసం ఒక్కొక్కరి నుంచి రూ.5-7 లక్షల వరకు వసూలు చేశారు. కొత్త అంగన్వాడీ పోస్టులకు సైతం ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షల చొప్పున వసూలు చేసి జేబులు నింపుకొన్నారు. జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికుల పోస్టులనూ వదలకుండా అమ్ముకొన్నారు!
కొండలు ‘మట్టి’ కొట్టుకుపోయాయి
ఈ ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే ఎర్రమట్టి తవ్వకాలు దర్జాగా సాగిపోతుంటాయి. ఆయన అనుచరులు తొలుత గనుల శాఖ నుంచి ఆయా గ్రామాల్లోని వైకాపా నేతల పేరుతో నిర్ణీత ప్రాంతాల్లో తవ్వకాలకు అనుమతులు పొందుతారు. తర్వాత అనుమతుల హద్దులను దాటేసి అడ్డగోలుగా తవ్వకాలు సాగిస్తారు. భీమిలి ప్రాంతంలోని కాపులుప్పాడ, కె.నగరపాలెం, దాకమర్రి, కొత్తవలస, నేర్లవలస, అమనాం, చిప్పాడ కొండలు ఆ కీలక నేత ధాటికి ‘మట్టి’ కొట్టుకుపోయాయి. ప్రైవేటు లే-అవుట్లలోని లోతట్టు ప్రాంతాలను పూడ్చడానికి రాత్రిళ్లు యంత్రాలతో కొండలకు కొండలనే పిండిచేస్తున్నారు. ఆనందపురం పరిధిలోని 52 కొండల్లో ప్రతి రోజూ ఎర్రమట్టి యథేచ్ఛగా తరలిపోతోంది. పద్మనాభం పరిధిలో బాంధేవీపురం పల్లికొండ ప్రాంతంలో నిత్యం గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. కృష్ణాపురం, పాండ్రంగి పంచాయతీల్లో విస్తరించి ఉన్న సూది కొండలోనూ అడ్డగోలు తవ్వకాలు సాగిస్తున్నారు. నేరెళ్లవలస శివారులో మెట్ట నుంచి రాత్రి సమయాల్లో మట్టి తవ్వి తరలిస్తున్నారు. ట్రాక్టరు ఇసుకకు రూ.6-8 వేలు, లారీకి రూ.25-50 వేల వరకు వసూలు చేస్తున్నారు. అన్నవరం సముద్ర తీరం నుంచి నల్ల ఇసుక కాకినాడ, ఒడిశాకు ఆయన అండదండలతోనే ఎగుమతి అవుతోంది.
భూ వివాదాల్లో తలదూర్చి..
జగనన్న స్మార్ట్సిటీ పేరుతో పేదలకు సెంటు స్థలం ఇచ్చేందుకు భీమిలి ప్రాంతంలో 135 ఎకరాలు గుర్తించారు. ఇందులో నిడిగట్టు, రామజోగి అగ్రహారం, నేరెళ్లవలస, కాపులుప్పాడ పరిధిలో డి-పట్టా కలిగిన రైతుల నుంచి ఈ నేత బలవంతంగా భూములు లాక్కొన్నారు. ఆ ప్రాంతంలో ఎకరాకు రూ.10 లక్షల చొప్పున సుమారు 40 ఎకరాలు తన బంధువు పేరుతో తీసుకున్నట్లు సమాచారం. భూ సేకరణ నేపథ్యంలో వీఎంఆర్డీఏ ఎకరాకు 900 చ.అ. చొప్పున కేటాయిస్తుంది. ఇలా ఆ నాయకుడు 36 వేల చ.అ. భూమిని దక్కించుకుని అందులో వైద్య కళాశాల నిర్మించాలని పావులు కదిపారు. నేరేళ్ల వలసలోని 30 ఏళ్లనాటి ప్రైవేటు వెంచర్లలో నెలకొన్న భూ వివాదాల్లో తలదూర్చి పంచాయితీలు చేస్తున్నారు. ఆ వివాదాలను పరిష్కరిస్తూ పెద్ద ఎత్తున దండుకుంటున్నారు. భీమిలి ప్రాంతంలో ఎక్కడ లే-అవుట్ వేసినా భూమి ధరను బట్టి ఆ నేతకు కమీషన్ ఇవ్వాల్సిందే. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఈయన తరఫున వసూళ్ల పర్వం సాగుతోంది. వరుసకు సోదరుడైన వ్యక్తి ఈ వ్యవహారాలన్నింటినీ చూస్తుంటారు.
ఆయన వేధిస్తే పార్టీ మారతారంతే..!
తన నియోజకవర్గంలోని రాజకీయ వ్యవహారాల పర్యవేక్షణ, సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, మండల అధ్యక్షుల సమన్వయ బాధ్యతను వరుసకు సోదరుడు అయ్యే వ్యక్తికి ఇచ్చారు. ఆయనను తెరపై ఉంచి నియోజకవర్గంలో తెదేపా నాయకుల బలహీనతలపై ఆరా తీయడం, వారినే లక్ష్యంగా చేసుకుని వేధించి, భయపెట్టి పార్టీని మార్పిస్తారు. గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఉమ్మడి విశాఖ జిల్లా పశు సంవర్థక విభాగానికి సంబంధించిన కీలక పోస్టులో ఉన్న నాయకుడికి పార్టీ మారే పరిస్థితి కల్పించారు. భీమిలి మున్సిపాలిటీలోనూ ఓ మహిళా నాయకురాలికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. అధికార పార్టీ తీరుపై ఒక మాజీ ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. దీన్ని జీర్ణించుకోలేని ఈ ప్రజాప్రతినిధి.. ఆ మాజీ ఎమ్మెల్యే వద్ద ఉన్న భూములను లాక్కునేందుకు ప్రయత్నించారు. పార్టీ పుట్టినప్పటి నుంచి తెదేపాలోనే ఉండి, గ్రంథాలయ సంస్థలో కీలకపాత్ర పోషించిన ఓ నేత.. వీరి వేధింపులను తాళలేక ఆ పార్టీని వదిలేయాల్సి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
జూన్ తొలి వారంలో రాష్ట్రానికి ‘నైరుతి’
నైరుతి రుతుపవనాలు జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 31 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది. -
సెకితో ‘మిగులు’ భారం రూ.8,291 కోట్లు!
సెకి నుంచి విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై భారం పడదు. ఆ విద్యుత్తు వ్యవసాయం కోసమే. దీని ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. -
ఫాగింగ్ దూరం.. జ్వరాల జోరు
గ్రామాల్లో దోమల బెడద తీవ్రమై ఏటా ప్రజలు పెద్ద సంఖ్యలో జ్వరాల బారిన పడుతున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 13,716 మలేరియా జ్వరాల కేసులు నమోదయ్యాయి. -
మెరుగుపడని పట్టణ వైద్యం!
రాష్ట్రంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నట్లు చెబుతున్నా.. మధ్యాహ్నం తరువాత చాలాచోట్ల వైద్యులు అందుబాటులో ఉండటంలేదు. -
జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. -
సీసీఎల్ఏలో అవినీతి ఆరోపణలున్న అధికారులకు అప్రాధాన్య పోస్టులు
రాష్ట్ర భూ పరిపాలనశాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఉన్న పలువురు అధికారులను అప్రాధాన్య పోస్టులకు మార్చారు. -
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కార్యాచరణ ప్రణాళిక!
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇటీవల వాతావరణంలో వస్తున్న మార్పులు.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. -
బీసీ నేతల్ని వైకాపా అణగదొక్కే ప్రయత్నం
జరిగిన ఎన్నికల్లో బీసీలు వైకాపాకు ఓటేయలేదనే అనుమానంతోనే కక్షతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారని.. ఇది బీసీ నేతల్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి నూకానమ్మ మండిపడ్డారు. -
24న డీఈడీ ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షను ఈనెల 24న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. -
రోడ్డుపైనే సీపీఆర్.. వందనమమ్మా డాక్టర్ రవళి
చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కన్నా లేవరా అని తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
అక్రమ తవ్వకాలు నిజం
ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా ఆంధప్రదేశ్లో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. -
మీడియాపై బెదిరింపులు తగవు
మీడియాలో వచ్చే వార్తలపై అభ్యంతరాలుంటే ఖండిచవచ్చని, పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించాయని భావిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని.. ఈ విషయాలు విస్మరించి పాత్రికేయుల పేర్లు చెప్పి మరీ తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం తగదని ప్రజాసంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం విఫలం
ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని చంద్రగిరి, మాచర్ల, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ(సీఎఫ్డీ) సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. -
రామతీర్థంలో అతిసారం.. యువతి మృతి
నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన విజయమ్మ (30) వాంతులు, విరేచనాలతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. -
మన చరిత్రేంటో లోకమంతా చూసింది
ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్ర ప్రజలకే కాదు.. మన చరిత్ర ఏంటో ప్రపంచానికే చూపామని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
కొనకళ్లకు స్వల్ప గుండెపోటు
మాజీ ఎంపీ, కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారు జామున గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
అందరి కళ్లూ అటువైపే.. నాలుగో ప్లేఆఫ్స్ బెర్తు వారిదేనంటున్న లారా
-
‘అమ్మ’ అంతిమయాత్ర అయినా.. ఆస్తి పంచాకే !
-
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస