logo

వసంతవాడలో వ్యక్తి దారుణ హత్య

వసంతవాడలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పెదపాడు ఎస్సై బి.నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం..

Updated : 10 Aug 2022 10:28 IST

పెదపాడు : పెదపాడు మండలం వసంతవాడలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పెదపాడు ఎస్సై బి.నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. వసంతవాడ గ్రామానికి చెందిన దిరిసిన వీర్రాజు(35) అనే వ్యక్తి వసంతవాడ- గోగుంట గ్రామాల మధ్య ఉన్న పంటపొలాల్లో దారుణ హత్యకు గురయ్యాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎస్సై మృతదేహాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీంను రప్పించి ఆధారాలను సేకరిస్తున్నామని,  హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని