రాక్షస పాలనకు త్వరలో తెర
రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలనకు త్వరలోనే తెరపడనుందని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.
ఆకివీడు, న్యూస్టుడే: రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలనకు త్వరలోనే తెరపడనుందని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ఆకివీడు మండల పరిధిలో ఆయన శుక్రవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. పెదకాపవరం గ్రామంలో ప్రారంభించిన ప్రచార యాత్ర చినకాపవరం, అప్పారావుపేట, గుమ్ములూరు, తరటావ, కోళ్లపర్రు, రాజులపేట, చినమిల్లిపాడు, కళింగగూడెం, సిద్ధాపురం వరకు కొనసాగింది. ఎమ్మెల్యే మంతెన రామరాజు, జనసేన నాయకులు ముత్యాల వెంకటేశ్వరరావు (రత్నం), జుత్తిగ నాగరాజు పాల్గొన్నారు. ప్రచార రథం, ద్విచక్ర వాహనంపై, కాలినడకన ప్రయాణిస్తూ పలు గ్రామాల్లో ప్రజలను కలిసి మాట్లాడారు. కూటమి నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులిచ్చారు. గుమ్ములూరులో కోపల్లె సాయిబాబా నివాసం ఆవరణలో కూటమి నాయకుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ‘జగనాసుర రక్త చరిత్ర’ కరపత్రాలను ఆవిష్కరించి పంపిణీ చేశారు.
ఉండి, న్యూస్టుడే: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా కృషి చేస్తామని తెదేపా అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు సతీమణి రమాదేవి అన్నారు. ఉండిలో నిమ్మనపేట, బాలాజీరావుపేట, కొత్తపేట, కళింగపేటల్లో పార్టీ అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, కాగిత బుజ్జిల నేతృత్వంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
ఆకివీడు, న్యూస్టుడే: ఆకివీడు ఎస్ కూడలి వద్ద ఉన్న పార్టీ భవనంలో ఎన్నికల కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దీనిని కూటమి అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు సతీమణి రమాదేవి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల ఆశీర్వాదం పొందారు. తెదేపా ఆకివీడు పట్టణ అధ్యక్షుడు బొల్లా వెంకట్రావు, నాయకులు కిమిడి నాగరాజు, మహిళా కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలకేయులను రాష్ట్రం నుంచి తరిమికొడదాం
[ 07-05-2024]
రాష్ట్రాన్ని అడ్డుగోలుగా దోచుకునే కాలకేయులను తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ రచయిత కేవీ విజయేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. -
మత్స్య విలాపం
[ 07-05-2024]
నాలుగు దశాబ్దాలుగా దేశానికి పోషకాహారం అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆక్వారంగం జగన్ ఏలుబడిలో చతికిలబడింది. డెల్టా ప్రాంతంలో నీలివిప్లవంతో మొదలైన చేపల పరిశ్రమ అయిదేళ్లుగా ఎన్నడూ లేనంత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. -
అణచివేతలతో అరాచక పర్వం
[ 07-05-2024]
-
ఉద్యోగుల ఓట్లకూ గేలం
[ 07-05-2024]
సాధ్యమైనంత వరకు ఉద్యోగులు ఓటేయకుండా చూడాలనే ప్రభుత్వ పన్నాగంలో భాగంగా జిల్లాలో పోలింగ్ కేంద్రాల వద్ద కనీస ఏర్పాట్లకు మోకాలడ్డారన్న విమర్శలున్నాయి. -
తొలి రోజు ఓటేసిన 7,540 మంది
[ 07-05-2024]
జిల్లాలో తపాలా బ్యాలెట్ పోలింగ్ సోమవారం ప్రారంభమైంది. మొత్తం 13,854 మంది ఓటర్లు ఉండగా తొలిరోజు 7,540 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు -
జగన్ వస్తే పెట్రోలు సరఫరా ఉండదట!
[ 07-05-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మంగళవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటన సందర్భంగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిపివేయనున్నారు. -
మావయ్యా.. మా బాల్యంతో ఆడుకున్నావ్!
[ 07-05-2024]
ప్రతి అక్కచెల్లెమ్మల బిడ్డలకు నేను మేనమామ లెక్క. ఆ హోదాలో వారి చదువులు సాగించేందుకు అండగా నిలబడి నేను తోడుంటా.. అంటూ ప్రతి సభలోను ఊదరగొట్టే సీఎం జగన్ పురిటి బిడ్డ మొదలుకుని 15 ఏళ్ల బాలబాలికల బాల్యం కోసం చేసిందేమీలేదు. -
రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్డీయేను గెలిపించండి
[ 07-05-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో రాష్ట్రం అవినీతిమయంగా తయారైందని, భావితరాల భవిష్యత్తు కోసం కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని సినీ హీరో నారా రోహిత్ అన్నారు -
కాలువ కన్నీరు పెడుతోంది
[ 07-05-2024]
పదిహేను వేల ఎకరాలకు నీరందించాల్సిన ఎర్రకాలువ ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ ఇది. సుమారు 20 కిలోమీటర్ల మేర గుర్రపుడెక్కతో నిండిపోయింది. -
వైద్యం బహుభారం
[ 07-05-2024]
నూజివీడు డిపోకు చెందిన ఒక మెకానిక్ భార్యకు ఏడాదిన్నర కిందట జబ్బు చేసింది. ఈహెచ్ఎస్ సదుపాయంతో ఆమెకు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించాలని ఆయన భావించారు. -
ఓటర్లకు తాయిలాలు..నాయకులకు ప్యాకేజీలు!
[ 07-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో అధికార పార్టీ అభ్యర్థులు ప్రలోభాల పర్వానికి తెరతీశారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇప్పటికే నగదు, చీరలు పంపిణీ చేసిన అభ్యర్థులు ఓటర్లకు నగదు పంపిణీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. -
పేద విద్యార్థులకు ఉచిత విద్య
[ 07-05-2024]
ప్రతిభ కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ-సీ కేటగిరీకి చెందిన పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించనున్నట్లు స్పృహ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ ట్రస్ట్ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు ఎ.సర్వేశ్వరరావు తెలిపారు. -
ఆసరా సొమ్ము కోసం రోడ్డెక్కిన మహిళలు
[ 07-05-2024]
వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత సొమ్ములు వెంటనే చెల్లించాలని కోరుతూ స్వయం సహాయక సంఘాల సభ్యులు సోమవారం మొగల్తూరు క్రాంతి పథం కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
ఏపీలో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు