కాలకేయులను రాష్ట్రం నుంచి తరిమికొడదాం
రాష్ట్రాన్ని అడ్డుగోలుగా దోచుకునే కాలకేయులను తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ రచయిత కేవీ విజయేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు.
ఓటుహక్కుతోనే బుద్ధి చెబుదాం
కైకలూరు సభలో ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్
ప్రచారం చేస్తున్న విజయేంద్రప్రసాద్, పక్కన కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివాస్
మండవల్లి, కైకలూరు, న్యూస్టుడే: రాష్ట్రాన్ని అడ్డుగోలుగా దోచుకునే కాలకేయులను తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ రచయిత కేవీ విజయేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా కైకలూరులో కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివాస్, ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి పుట్టా మహేశ్కుమార్ యాదవ్కు మద్దతుగా ఆటపాక నుంచి లోకుమూడి వరకు సోమవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం కైకలూరులోని సీఎన్ఆర్ కల్యాణ వేదికలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. పదునైన, పవిత్రమైన ఓటు అనే ఆయుధంతో ఎవరైతే కష్టపడి పని చేసి రాష్ట్రాన్ని, దేశాన్ని ముందుకు తీసుకు వెళ్తారో వాళ్లను ఎన్నుకోవాలన్నారు. మోదీ, చంద్రబాబు, పవన్కల్యాణ్లు ఎంతో అద్భుతమైన పాలనను అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న అయిదేళ్లలో కైకలూరుకు కామినేని నాయకత్వంలో మహర్దశ పట్టనున్నట్లు జోస్యం చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు