అర్ధరాత్రి ఇసుక దందా
అనుమతులు ఉన్నాయంటూ ఒకలా, లేకుంటే మరోలా జిల్లాలో ఇసుక దందా సాగుతోంది. ఆచంట మండలం కరుగోరుమిల్లిలో ఇటీవల ఇసుక ర్యాంపు ఏర్పాటు చేశారు.
సుప్రీం వద్దన్నా.. ఆగని అక్రమార్కులు
కరుగోరుమిల్లిలో గ్రామస్థులు అడ్డుకున్న ట్రాక్టర్లు(పాత చిత్రం)
ఆచంట, న్యూస్టుడే: అనుమతులు ఉన్నాయంటూ ఒకలా, లేకుంటే మరోలా జిల్లాలో ఇసుక దందా సాగుతోంది. ఆచంట మండలం కరుగోరుమిల్లిలో ఇటీవల ఇసుక ర్యాంపు ఏర్పాటు చేశారు. గ్రామస్థులు గండి కొట్టిన దారి పూడ్చినా పదిహేను రోజులపాటు యంత్రాలతో ఇసుక ఎగుమతి చేశారు. 20 టన్నుల పైగా సామర్థ్యం గల లారీల్లో ఇసుక తరలించారు. సుప్రీం కోర్టు తీర్పుతో కరుగోరుమిల్లిలో పగటివేళ ఇసుక రవాణా తాత్కాలికంగా ఆగింది. మళ్లీ రెండు రోజులుగా రాత్రి పూట ట్రాక్టర్లతో దొంగచాటుగా ఇసుక రవాణా సాగిస్తున్నారు.
వరదల నుంచి ఇప్పటి వరకూ..
గత ఏడాది వరదలకు ముందే అధికారికంగా అన్ని ర్యాంపుల్లో తవ్వకాలు నిలిపివేశారు. అయితే అయిదారు నెలలుగా అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారం చీకటి వ్యాపారం సాగించారు. ఆచంట నియోజకవర్గంలో అన్ని ర్యాంపుల్లో ఇసుక దోపిడీ సాగింది. ఇటీవల నడిపూడి ర్యాంపునకు అనుమతి లభించిందంటూ పట్టపగలే వారం రోజుల పాటు భారీ యంత్రాలతో ఇసుక తవ్వి తరలించారు. గ్రామస్థులు ఎదురు తిరగడంతో అక్కడ నిలిపి వేశారు. గోదావరి తీరంలోని సిద్ధాంతం, నడిపూడి, కరుగోరుమిల్లి ర్యాంపుల ద్వారా వీలు చిక్కినప్పుడల్లా రాత్రిపూట ఇసుక రవాణా చేస్తున్నారు. కరుగోరుమిల్లి గ్రామంలో ఉగాది రోజు ఇసుక అక్రమ రవాణాను గ్రామస్థులు అడ్డుకుని వాహనాలు అధికారులకు అప్పగించి, ర్యాంపునకు గండి కొట్టారు. కానీ ఎలాంటి కేసులు నమోదు కాలేదు.
ఇసుక ఇష్టానుసారం తవ్వకంతో కరుగోరుమిల్లి వద్ద తీరం
ట్రాక్టర్ రూ.3500
అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్కు రూ.3,000 నుంచి 3,500 వసూలు చేస్తున్నారని సమాచారం. ఇక్కడ పది పదిహేను మంది కార్మికులతో ఒకటి రెండు ట్రాక్టర్లు ఎగుమతి చేయించి, తర్వాత పొక్లెయిన్ సాయంతో ఎగుమతి చేసి, కూలీలకు కొంత ముట్టచెబుతున్నారని స్థానికులు తెలిపారు. గోదావరి తీరంలో అనుమతి లేని సమయంలో ఇసుక అక్రమ రవాణాపై సిద్ధాంతం, నడిపూడి, కరగోరుమిల్లిలో ఇప్పటికే ఫిర్యాదులు ఉన్నాయి. రాత్రి పూట నిఘా వేయాలని స్థానిక అధికారులకు సూచించారు. ఈ విషయమై ఆచంట తహసీల్దార్ ఐపీˆ శెట్టిని సంప్రదించగా క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తం చేస్తామని తెలిపారు. మైనింగ్ అధికారులు చరవాణికి అందుబాటులోకి రాలేదు.
రాత్రిపూట రవాణా..
ఆచంట మండలంలో ఇసుక తవ్వకాలకు అనుమతి లభించిందని చెబుతున్న కరుగోరుమిల్లిలో పరిశీలిస్తే పోలింగ్ తేదీ నాటికి ఇసుక రవాణా నిలిపి వేశారు. పోలింగ్ తేదీకి రెండు రోజుల ముందు ఇసుక అక్రమ తవ్వకాలు నిలిపి వేయాలని, అనుమతులు ఉన్నా నిబంధనలు పాటించకుంటే కేసులు నమోదు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. కరుగోరుమిల్లిలో రెండు రోజులుగా రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకూ ట్రాక్టర్ల ద్వారా ఇసుక దందా సాగుతోంది. మేనెల తర్వాత వర్షాలు పడితే గోదావరిలోకి నీరు చేరి రవాణా నిలిచిపోతుంది. ఈలోపే అందినంత దండుకోవాలని రాత్రిపూట ఇసుక దందా కొనసాగిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమ్మ రక్తం పంచుతోంది!
[ 14-06-2024]
రక్తదానం చేయడం అంటే.. ఓ ప్రాణం నిలపడమే. ఆ సమయంలో రక్తమిచ్చిన వ్యక్తి బాధిత కుటుంబానికి దైవంగా కనిపిస్తారు. జీవితంలో ఇలాంటి సందర్భం రావడం అదృష్టంగా భావించాలి -
జనం ప్రాణాలతో ఆటలా?
[ 14-06-2024]
పామర్రు-దిగమర్రు జాతీయ రహదారి 165 విస్తరణ పనుల్లో అధికారుల నిర్లక్ష్యం వాహనదారులకు శాపంగా మారింది. -
అడుగంటుతోన్న చెరువులు
[ 14-06-2024]
పల్లెల్లోని చెరువుల్లోని జలాలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నెల ఒకటో తేదీనే పంటకాలువలకు నీరొదిలినా అవి శివారు ప్రాంతాలకు చేరలేదు -
వేటకు వేళాయె!
[ 14-06-2024]
కడలి అలలు దాటుకుని చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు లేక ఇన్నాళ్లూ బోసిపోయిన సముద్ర తీరంలో మళ్లీ సందడి రానుంది. సముద్రంలో చేపల వేటకు ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు రెండు నెలలపాటు ప్రభుత్వం విరామం ప్రకటించింది. -
మావుళ్లమ్మ సేవలో కేంద్ర మంత్రి
[ 14-06-2024]
పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మ ఆలయాన్ని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ గురువారం సందర్శించారు. -
బడి బస్సు.. భద్రతెంత?
[ 14-06-2024]
పాఠశాల బస్సులు ప్రమాదాలకు గురవుతున్నా ఆ శాఖాధికారులు తూతూమంత్రంగా తనిఖీలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. -
సొమ్ము రాదు.. అప్పు పుట్టదు
[ 14-06-2024]
జిల్లాలో 2023-24 రబీ సీజన్కు సంబంధించి 79,960 ఎకరాల్లో వరి సాగు చేశారు. దాదాపు 3.30 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. -
జిల్లాను అభివృద్ధిబాట పట్టిస్తాం
[ 14-06-2024]
జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో పయనింపజేస్తామని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన గురువారం తొలిసారి ఏలూరులోని తెదేపా జిల్లా కార్యాలయానికొచ్చారు. -
ఆశల పొద్దు పొడిచింది
[ 14-06-2024]
రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువుదీరింది. మంత్రి వర్గ కూర్పు సైతం కొలిక్కి వచ్చింది. ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీల అమలుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.