తేమ పేరుతో కోత
ఆరుగాలం శ్రమించి పంట పండించిన అన్నదాతలు అమ్ముకోవాలంటే అష్టకష్టాలు తప్పడం లేదు. ఏదో రీతిన దోచుకోవడానికి దళారులే కాదు మిల్లర్లూ సిద్ధమయ్యారు.
దోపిడీకి తెర తీసిన మిల్లర్లు
పాలకొల్లు నుంచి పెనుమదం వెళ్లే రహదారిలో ఉన్న పలు రైస్మిల్లులకు ఇతర ప్రాంతాల నుంచి కూడా ధాన్యాన్ని ట్రాక్టర్లపై తీసుకొచ్చి దిగుమతుల కోసం పడిగాపులు కాస్తున్నారు.
పాలకొల్లు గ్రామీణ, పాలకొల్లు సాంస్కృతికం, న్యూస్టుడే: ఆరుగాలం శ్రమించి పంట పండించిన అన్నదాతలు అమ్ముకోవాలంటే అష్టకష్టాలు తప్పడం లేదు. ఏదో రీతిన దోచుకోవడానికి దళారులే కాదు మిల్లర్లూ సిద్ధమయ్యారు. రైతు భరోసా కేంద్రాల నుంచి 17 శాతం తేమతో ధాన్యాన్ని ట్రాక్టర్లపై మిల్లులకు తరలిస్తున్న రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. అక్కడికి వెళ్లిన తర్వాత తేమశాతం 20 నుంచి 22 వరకు ఉందని మిల్లుల యాజమాన్యాలు కొర్రీలు వేస్తున్నాయి. వీటి నుంచి బయట పడాలంటే బస్తాకు 2 కిలోల ధాన్యాన్ని ఇవ్వాలని, లేదంటే కిలోకు రూ.22 చొప్పున రూ.44 నగదు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో కొంత మంది రైతులు వేరే రైస్ మిల్లులకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే అక్కడ ఇంతకంటే మరీ దారుణమైన పరిస్థితి ఎదురైంది. బస్తాకు 3 నుంచి 4 కిలోల వరకు ధాన్యం ఇవ్వాలంటూ ఇబ్బంది పెడుతున్నారని రైతులు చెబుతున్నారు. దీంతో ఆర్బీకే సూచించిన మిల్లుల వద్దకే ధాన్యాన్ని తీసుకెళ్లారు. అక్కడ జట్టు కూలీలు సరిపడా లేరు. అంతే కాకుండా ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకే ధాన్యం దిగుమతులు చేసుకుంటున్నారు. తేమశాతం సాకుతో కోత విధిస్తూ ముక్కు పిండి వసూలు చేస్తున్నారని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
మూడు రోజులు ట్రాక్టర్ కిరాయి
- సురేంద్ర, నౌడూరు, రైతు.
రెండు రోజుల నుంచి పడిగాపులు గాసినా ధాన్యం తీసుకోలేదు. ఆర్బీకే సూచించిన మేరకు ఈ మిల్లుకు తీసుకొచ్చాం. ఇక్కడ పరిస్థితి మరోలా ఉంది. ఏంచేయాలో పాలుపోవడం లేదు. ఈ నెల 15న ట్రక్కు షీటు తీసుకొచ్చా. ధాన్యంతో పాటు రహదారి పక్కనే ట్రాక్టరు నిలిపి ఉంచా. 17వ తేదీన గానీ దిగుమతి అయ్యేలా కనిపించడం లేదు. దీంతో మూడు రోజులు ట్రాక్టరు కిరాయి చెల్లించాల్సి వస్తోంది. భోజనం, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం.
రూ.44 వంతున చెల్లించాం..
- కె.రాజు, ఆచంట, రైతు
పంటలు బాగా పండాయి. ధాన్యం అమ్ముకుంటే ఒడుదొడుకుల నుంచి గట్టెక్కుతాం అని భావించాం. ఇదే తరుణంలో వాతావరణం ఆందోళన కలిగిస్తోంది. కోతలు వేగంగా పూర్తి చేసుకుని మిల్లులకు ధాన్యాన్ని తీసుకొచ్చా. ఇక్కడి నిర్వాహకులు ధాన్యంలో తేమశాతం ఎక్కువగా ఉందని బస్తాకు రూ.44 వంతున చెల్లించాలన్నారు. ఏమీ చేయలేని పరిస్థితిలో నేను తీసుకొచ్చిన ధాన్యానికి రూ.5,200 చెల్లించా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నవ్యాంధ్రకు చంద్రుడు.. నవచరితకు ఆద్యుడు
[ 13-06-2024]
‘‘నవ్యాంధ్ర రథసారథిగా.. చంద్రన్న కొలువుదీరారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వేదికగా.. లక్షలాది అభిమానులు.. వేలాది ఆత్మీయులు.. వందలాది బంధుమిత్రులు తరలిరాగా.. ప్రధాని మోదీ సమక్షంలో.. బుధవారం ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. -
అపురూప ఘట్టం.. ఆనంద వీక్షణం
[ 13-06-2024]
జయజయ ధ్వానాల జోరు..బాణసంచా కాల్పుల హోరు..గ్రామగ్రామాన తెదేపా, జనసేన, భాజపా జెండాల రెపరెపలు..ఇదీ కూటమి మంత్రి వర్గ ప్రమాణస్వీకార మహోత్సవం నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమలో కనిపించిన దృశ్యాలు. -
అనుభవానికి అందలం
[ 13-06-2024]
ఏలూరు, పశ్చిమ జిల్లాల్లో మంత్రి పదవుల ఎంపికలో కూటమి ప్రభుత్వం అనుభవం..ఆలోచనల వైపు మొగ్గు చూపింది. ఏలూరు జిల్లా నుంచి నూజివీడు ఎమ్మెల్యే పార్థసారథి మూడోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, -
బడిబాటలో తడబాటు
[ 13-06-2024]
పాఠశాలలు గురువారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. గతంలో చేపట్టిన అదనపు గదులు, ఇతర నిర్మాణాలను వేసవి సెలవుల్లో పూర్తి చేయలేకపోవడంతో ఈ విద్యా సంవత్సరంలోనూ విద్యార్థులకు ఇబ్బందులు తప్పేలాలేవు. -
బడిలో సవాళ్లు
[ 13-06-2024]
వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు గురువారం పునఃప్రారంభం కానున్నాయి. సర్కారు బడులు సమస్యలతో విద్యార్థులకు స్వాగతం పలకనున్నాయి. పలుచోట్ల నాడు- నేడు రెండో విడత పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. -
ప్రత్యేక చిన్నారుల భవితకు బాటలు
[ 13-06-2024]
సాధారణ విద్యను అభ్యసించలేని ప్రత్యేక అవసరాలున్న చిన్నారుల కోసం మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన భవిత కేంద్రాలకు బాలల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. మే 1 నుంచి నియోజకవర్గంలోని నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, -
తక్కువ సమయంలో అధిక రాబడి
[ 13-06-2024]
రసాయన ఎరువుల వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించి తక్కువ పెట్టుబడితో అధికోత్పత్తి సాధించడమే లక్ష్యంగా ఖరీఫ్ ప్రణాళిక అమలుకు వ్యవసాయశాఖ సన్నద్ధమైంది. -
అభిమానంతో.. ఉచితంగా అల్పాహారం
[ 13-06-2024]
ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకొని జంగారెడ్డిగూడేనికి చెందిన ఆయన అభిమాని, టీ స్టాల్ యజమాని ఎం.రాజు, ఆయన కుమారుడు బుధవారం ఉదయం -
ఉసురు తీసిన గుట్టలు
[ 13-06-2024]
జాతీయ రహదారి 165 విస్తరణ పనుల్లో గుత్తేదారు నిర్లక్ష్యంతో వాహనదారుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మండవల్లి భైరవపట్నం బస్టాండ్ సమీపంలో నిర్మాణం పూర్తైన రోడ్డుపై రాత్రికి రాత్రే తారు చిప్స్ కలిపిన గుట్టలు పోయడం.. -
జీవో 117ను రద్దు చేయాలి
[ 13-06-2024]
ఉపాధ్యాయులపై పనిభారం తగ్గించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.సాయిశ్రీనివాస్ కోరారు. భీమవరంలో బుధవారం జరిగిన సంఘం జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
ఆకివీడులో ‘అన్న క్యాంటీన్’
[ 13-06-2024]
కూటమి ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు సూచనల మేరకు కూటమి నాయకులు ఆకివీడు గాంధీ విగ్రహం -
కలెక్టరేట్ వెలవెల!
[ 13-06-2024]
నూతన ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా బుధవారం రాష్ట్రమంతా సందడి వాతావరణం నెలకొంది. కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయ భవనాలను సుందరంగా ముస్తాబు చేశారు. -
ఇదేంది గురూ!
[ 13-06-2024]
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పురపాలక కార్యాలయంలో వైకాపా నాయకులు బుధవారం ఉదయం రాజకీయ సమావేశం నిర్వహించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. -
అధినేతను సీఎంగా చూసి.. అనంతలోకాలకు.!
[ 13-06-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న క్రమంలో ఆయన్ను చూసేందుకు వచ్చిన ఓ అభిమాని గుండెపోటుతో మరణించడం విషాదం నింపింది.
తాజా వార్తలు (Latest News)
-
నా హెల్పింగ్ హ్యాండ్ ఇదే.. నవ్వులు పూయిస్తోన్న మంత్రి పోస్టు
-
భారత్ గురించి మరింత తెలుసుకోవాలని ఉందట..! చైనాలో ఆసక్తికర సర్వే
-
కశ్మీర్పై చైనా-పాక్ సంయుక్త ప్రకటన.. దీటుగా స్పందించిన భారత్
-
మెగా డీఎస్సీపై ఏపీ ప్రభుత్వం జీవో జారీ
-
భారత ఎన్నికలపై వ్యాఖ్యలు చేయబోం..: పాకిస్థాన్
-
ఆ విద్యార్థులకు 23న మళ్లీ ‘నీట్’.. ఫలితాలు ఎప్పుడంటే?