విస్తృతంగా చేరికలు... పెరిగిన వలసలు
ఎన్డీఏ కూటమిలో వలసలు భారీగా కొనసాగుతున్నాయి. గురువారం మైలవరం, పెద్దముడియం, జమ్మలమడుగు మండలాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు జమ్మలమడుగు అసెంబ్లీ ఎన్డీఏ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.
ఎన్డీఏలో చేరిన వారితో జమ్మలమడుగులో అసెంబ్లీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి
జమ్మలమడుగు, పోరుమామిళ్ల, ప్రొద్దుటూరు వైద్యం, కలసపాడు, మైలవరం, న్యూస్టుడే: ఎన్డీఏ కూటమిలో వలసలు భారీగా కొనసాగుతున్నాయి. గురువారం మైలవరం, పెద్దముడియం, జమ్మలమడుగు మండలాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు జమ్మలమడుగు అసెంబ్లీ ఎన్డీఏ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వీరందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గంలోని 20 మంది ఆర్ఎంపీలు సైతం కలసి తమ మద్దతు తెలిపినట్లు ఆదినారాయణరెడ్డి తెలిపారు.
మిట్టమానుపల్లెకు చెందిన వైకాపా నాయకులతో ఎన్డీయే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్
పోరుమామిళ్ల పట్టణంలోని బలిజకోట వీధికి చెందిన 10 కుటుంబాలు గురువారం తెదేపాలో చేరాయి. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ వీరికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అక్కల్రెడ్డిపల్లె నుంచి 10 కుటుంబాలు, ముసల్రెడ్డిపల్లె నుంచి 30 కుటుంబాలు మొత్తం 50 కుటుంబాలు తెదేపాలో చేరాయి. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నగిరి భైరవప్రసాదు, సర్పంచి సుధాకర్, తెదేపా నాయకులు సీతా వెంకటస్బుయ్య, రామసుబ్బారావు, సత్యం, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రొద్దుటూరులోని అమృతనగర్కు చెందిన 100 కుటుంబాలు తెదేపాలో చేరాయి. వారందరికీ మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి కండువాకప్పి తెదేపాలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. వరదరాజులురెడ్డి ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రొద్దుటూరులో అరాచకాలు, అసాంఘిక కార్యకలాపాలు అంతమవుతాయన్నారు. పెద్దముడియం మహమ్మద్బాషా, గైబు, షరీఫ్, బుజ్జి, ఇంద్ర, బాషా, అక్బర్, తదితరులు పాల్గొన్నారు. కలసపాడు మండలంలోని పుల్లారెడ్డిపల్లెలో తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రంతూ, జడ్పీట©సీ మాజీ సభ్యుడు డి.రాంభూపాల్రెడ్డి సమక్షంలో, స్థానిక నాయకుడు పెదిరెడ్డి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైకాపాకు చెందిన 15 కుటుంబాలు తెదేపాలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి తెదేపాలోకి ఆహ్వానించారు. మైలవరం మండలం వేపరాల-1 ఎంపీటీసీ సభ్యులు అలిశెట్టి కుమార్, దొమ్మరనంద్యాల గ్రామానికి చెందిన యనమల సుబ్బిరెడ్డి, మైలవరానికి చెందిన భీముడు నాయక్లతో పాటు 200 కుటుంబాలు ఆదినారాయణరెడ్డి సమక్షంలో కూటమిలో చేరాయి. మైదుకూరు నియోజకవర్గంలో మిట్టమానుపల్లె పంచాయతీకి చెందిన సాంబశివారెడ్డి, నక్కా నారాయణతోపాటు వారి అనుచరులు ప్రొద్దుటూరులోని పార్టీ కార్యాలయంలో ఎన్డీయే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో తెదేపాలో చేరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దగ్గర పడింది
[ 03-06-2024]
ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సమయం దగ్గరపడింది. ఇందుకు జిల్లా అధికార యంత్రాంగం సన్నాహాలు పూర్తిచేసింది. -
సమస్యాత్మక గ్రామాల్లో హై అలెర్ట్
[ 03-06-2024]
సార్వత్రిక ఎన్నికల లెక్కింపు సందర్భంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో హై అలెర్ట్ ప్రకటించారు. ప్రధాన ప్రాంతాల్లో పోలీసు పికెట్లు ఏర్పాటు చేసి డేగ కన్నుతో పరిశీలిస్తున్నారు. -
ఈదురుగాలుల భీభత్సం!
[ 03-06-2024]
జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో ఉద్యాన తోటలకు అపార నష్టం వాటిల్లగా, విద్యుత్తు నియంత్రికలు, స్తంభాలు నేలకొరగగా, రేకుల ఇళ్లు దెబ్బతిన్నాయి. -
విధుల్లో విద్యుత్తు సిబ్బంది అలసత్వం
[ 03-06-2024]
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న విద్యుత్తు సిబ్బందిపై ఏపీఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. వారం వారం సమీక్షలు, వస్తున్న ఫిర్యాదులు, పరిష్కారాలు, క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటున్నారు. -
గ్రామీణులకు తప్పని దాహం కేకలు
[ 03-06-2024]
జిల్లాలో గ్రామ పంచాయతీలు 557 ఉండగా ఆవాస పల్లెలు 1,911 ఉన్నాయి. గ్రామాల్లో జనాభా 12,51,364 మంది ఉన్నారు. వీరికి స్వచ్ఛమైన సురక్షిత నీరు అంందించడానికి బహుళ గ్రామాల తాగునీటి పథకాలు 13, ఎంపీడబ్ల్యూఎస్ 550, పీడబ్ల్యూఎస్ 1,033, నేరుగా 1,158, చేతి పంపులు 6,715 ఉన్నాయి. -
ఏజెంట్లు ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి
[ 03-06-2024]
ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండి, ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు. -
ప్రభుత్వ స్థలం కబ్జా!
[ 03-06-2024]
స్థానిక కొత్తపల్లె పంచాయతీలో సామాజిక ప్రయోజనాలకు కేటాయించిన ఖాళీ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. -
చుట్టూ నీరు... మధ్యలో బస్టాండు
[ 03-06-2024]
చిన్నపాటి వర్షం కురిసినా కడప ఆర్టీసీ బస్టాండుకు మునిగిపోతోంది. దీంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. -
యథేచ్ఛగా పెట్రోల్, డీజిల్ విడి విక్రయాలు
[ 03-06-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈసీ భద్రతా చర్యలు చేపట్టింది. ఈనెల 10వ తేదీ వరకు ఎక్కడా పెట్రోల్, డీజిల్ లూజు విక్రయాలతో పాటు క్రాకర్స్ విక్రయాలు చేపట్టరాదని ఆదేశాలు జారీ చేసింది. -
ఓట్ల లెక్కింపు ప్రక్రియకు 918 మంది సిబ్బంది
[ 03-06-2024]
జిల్లాలో ఈనెల 4వ తేదీ జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు 918 మంది సిబ్బందిని నియమించినట్లు కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ పేర్కొన్నారు. -
వైకాపా పాపం.. ప్రజలకు శాపం
[ 03-06-2024]
వైకాపా ప్రభుత్వ పాపం జిల్లా ప్రజలకు శాపంగా మారింది. బాధ్యతను గుర్తెరిగి కీలక ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడంతో ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. -
సజ్జల చెప్పారని... అలాగే చేయాలని...!
[ 03-06-2024]
ప్రభుత్వ సలహాదారు, వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
పిన్నెల్లికి సుప్రీం షాక్.. కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దని ఆంక్షలు
-
రూ.1,000లోపే ఓటీటీ, డీటీహెచ్, 3.3TB డేటాతో ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లు
-
హైదరాబాద్లో గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి
-
దిల్లీ మద్యం కేసు.. ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
-
న్యూయార్క్ స్టేడియం.. గాయాల విషయంలో తస్మాత్ జాగ్రత్త: ద్రవిడ్