అమ్మా.. నేనేమీ చేశాను పాపం..
అమ్మా... ఎన్నో కష్టాలకోర్చి నవ మాసాలు మోశావు.. ఎందుకమ్మా నా ప్రాణాలు తీయాలని చూశావు.. అమ్మ పాలు అమృతంలా ఉంటాయని అంటారు.. అలాంటి పాల వాసన కూడా చూపించలేక పోయావు..
అమ్మా... ఎన్నో కష్టాలకోర్చి నవ మాసాలు మోశావు..
ఎందుకమ్మా నా ప్రాణాలు తీయాలని చూశావు..
అమ్మ పాలు అమృతంలా ఉంటాయని అంటారు..
అలాంటి పాల వాసన కూడా చూపించలేక పోయావు..
కానీ అమ్మ ముఖం ఎలా ఉంటుందో చూపించలేక పోయావు..
పురిటి నొప్పులు భరించి రక్తపు ముద్దగా చేసి..
నన్ను చెత్త కుప్పలో పడేసి..
నీ దారిన నీవు వెళ్లిపోతే నాకు దారి చూపించేదెవరమ్మా..
ఆడ పిల్లననేకదా అమ్మా..
ఇలాంటి శిక్ష విధించావు..
చెత్తలో ఉన్న రాళ్లు నా పక్కటెముకలకు గుచ్చుకుంటూ ఉంటే..
అమ్మా అని నేను చేసిన ఆర్తనాదాలు విని..
పక్క ఇంట్లో ఉన్న ప్రవీణ్ అంకుల్ నా కోసం పరితపించాడు..
100కు డయల్ చేస్తే పోలీసు సార్లు స్పందించి..
నన్ను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు..
నా కంటూ ఓ గమ్యాన్ని చూపించేందుకు కొందరు తల్లులూ కదిలి వచ్చారు..
అమ్మా నేను కోరుకునేది ఒక్కటేనమ్మా..
ఇక ముందు ఏ తల్లీ పుట్టిన బిడ్డను ఇలా చెత్తకుప్పల్లో విసిరివేయద్దని కోరుకుంటున్న అమ్మా..
ఓ అనాథ ఆడ పసికందు మనోవేదనకు అక్షర రూపం ఇదీ.
జన్నారం, న్యూస్టుడే
పసికందును పడేసిన చెత్తకుప్ప ఇది
మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని శ్రీలంక కాలనీలో సోమవారం సాయంత్రం ఓ పసికందును గుర్తు తెలియని తల్లి పడేసిపోయింది. చెత్త కుప్పలో నుంచి చిన్నారి ఏడుపు విన్న ప్రవీణ్ అనే యువకుడు చూసి తక్షణమే 100కు డయల్ చేశాడు. దీంతో హెడ్ కానిస్టేబుల్ తుకారాం, కానిస్టేబుల్ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గుడ్డలో చుట్టి చెత్తలో పడేసిన పసికందును పోలీసులే చేతుల్లోకి తీసుకొని జన్నారంలో ఉన్న పిల్లల ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ముక్కుపచ్చలారని ఆడ పసికందును పడేసి వెళ్లిపోయిన వారిని తిట్టని వారు లేరు. అనంతరం ఐసీడీఎస్ అధికారులకు పసికందును అప్పగించినట్లు జన్నారం ఎస్సై రాజవర్ధన్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజల సమస్యలు పరిష్కరించాలి
[ 01-06-2024]
ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జగన్ సింగ్ డిమాండ్ చేశారు. -
ప్రజారోగ్యం కోసం కృషి చేయాలి
[ 01-06-2024]
సిబ్బంది ప్రజారోగ్యం కోసం స్వచ్ఛందంగా కృషిచేసి వారి మన్ననలు పొందాలని డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్ సూచించారు. -
పాఠశాల బస్సులకు ఫిట్నెస్ లేకపోతే సీజ్ చేస్తాం
[ 01-06-2024]
ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు వారి బస్సులకు విధిగా ఫిట్నెస్ చేయించుకోవాలని ఎంవీఐ శ్రీనివాస్ సూచించారు. -
నాలుగు ప్రవేట్ బస్సులు సీజ్
[ 01-06-2024]
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న నాలుగు ప్రైవేట్ బస్సులను రవాణా శాఖ అధికారులు శనివారం సీజ్ చేశారు. -
పత్తి విత్తనాల గోదాంలను తనిఖీ చేసిన కలెక్టర్
[ 01-06-2024]
జిల్లా కలెక్టర్ రాజర్షి షా పత్తి విత్తన గోదాములను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
వరదతో పొంచి ఉన్న ముప్పు
[ 01-06-2024]
వర్షాకాలంలో లోతట్టు కాలనీవాసుల కష్టాలు వర్ణనాతీతం. వరద నీరు ఇళ్లను ముంచితే బంధువుల ఇంటికో లేక బల్దియా యంత్రాంగం ఏర్పాటు చేసిన తాత్కాలిక పునరావాస కేంద్రానికో వెళ్లాల్సిన పరిస్థితి. -
రోడ్డు కాదు పెనం.. జంకుతున్న జనం
[ 01-06-2024]
ఉమ్మడి జిల్లాపై భానుడు చండ్ర నిప్పులు కురిపిస్తున్నాడు. రోహిణి కార్తెలో రోకళ్లు పగులుతాయన్న సామెతను నిజం చేస్తూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో జిల్లా వాసులు బెంబేలెత్తుతున్నారు. -
జన చేతనం.. జయ కేతనం
[ 01-06-2024]
చిన్నా పెద్దా తేడాలేదు. మహిళలు, పురుషులంటూ లింగభేదం లేదు. ఆటలాడే చిన్నారి నుంచి పండు ముసలి వరకు ఒకటే నినాదం.. జై తెలంగాణ. స్వరాష్ట్ర సాధన కోసం ప్రతి ఒక్కరుముందుకు కదిలి పిడికిలి బిగించి ముందుకు సాగిన ఆ రోజులు ఎటుచూసినా ఆందోళనలతో అట్టుడికింది. -
సంపూర్ణ పోషణ.. పాలతో సాధ్యం
[ 01-06-2024]
పంటలతో పాటు పాడి పెంపకంపై రైతులు దృష్టి సారిస్తే.. అదనపు ఆదాయం సమకూరడంతో పాటు పిల్లలకు పోషకాలు అందించేందుకు అవకాశం ఉంది. పాడి పోషణ రైతులకు భారం అవుతుండటంతో చాలా మంది రైతులు వాటికి దూరమవుతున్నారు. -
బాసర అమ్మవారి సన్నిధిలో అందెశ్రీ
[ 01-06-2024]
బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారిని ప్రముఖ గేయ రచయిత అందెశ్రీ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వేదపండితులు, అర్చకులు స్వాగతం పలికారు. -
ప్రారంభించకుండానే శిథిలం
[ 01-06-2024]
పేదల కోసం రెండు పడకగదుల ఇళ్లు నిర్మించి సంవత్సరాలు గడుస్తున్నా లబ్ధిదారులకు ఇవ్వకపోవడంతో ప్రారంభించకముందే శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన పనులు ఎవరికీ అక్కరకు రాకుండా నిరుపయోగంగా మారుతున్నాయి. -
నిర్వహణ భారం.. నీరుగారుతున్న లక్ష్యం
[ 01-06-2024]
వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో అన్నదాతలు సమావేశమై పంటల సాగు, సమస్యలపై వ్యవసాయ అధికారులతో చర్చించేందుకు గత ప్రభుత్వం నిర్మించిన రైతు వేదికలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. వీటి నిర్వహణ, పర్యవేక్షణ ప్రశ్నార్థకంగా మారింది. -
ఇంటర్ ఇక్కట్లు
[ 01-06-2024]
పదో తరగతి పూర్తయిన తర్వాత విద్యార్థులు కెరీర్పై దృష్టి సారించి ముందుకు సాగుతుంటారు. జూనియర్ కళాశాలలు అందుబాటులో ఉంటే ఆయా కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. -
కనిపించని ‘పొనికి’ ఉనికి
[ 01-06-2024]
పొనికి కర్ర అరుదైనది. అలంకరణ వస్తువులతోపాటు అందమైన బొమ్మలు, ఇతర కళాకృతుల తయారీకి దీన్ని విరివిగా వినియోగిస్తారు. నిర్మల్ కొయ్య బొమ్మల పరిశ్రమ దీనిపైనే ఆధారపడి కొనసాగుతోంది. స్థానికంగా కర్ర లభించక పరిశ్రమ నిర్వాహకులు ఇతరప్రాంతాల నుంచి తెప్పించుకుంటున్నారు. -
పారదర్శకత కోసం పొదుపు పద్దు పరిశీలన
[ 01-06-2024]
స్వయం సహాయక సంఘాలకు రుణాల పంపిణీలో పారదర్శకత పాటించేందుకు పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) అవసరమైన చర్యలు తీసుకుంటోంది. మహిళా సాధికారతకు వినియోగించే ప్రతి పైసాకు లెక్క చూపేలా కార్యాచరణ చేపట్టింది. -
పట్టణ చెరువుల పరిరక్షణకు అడుగులు
[ 01-06-2024]
పట్ణణాల్లో జల వనరులు ఆక్రమణకు గురవుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో తాగునీటితోపాటు ఇతర అవసరాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చెరువులు కబ్జా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పురపాలికల్లో చెరువులు, కుంటల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేకంగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. -
గొంతుకోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
[ 01-06-2024]
జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకోవడం స్థానికంగా ఆందోళనకు దారితీసింది. స్థానిక చున్నంబట్టివాడకు చెందిన ఓ భూవివాదం కేసులో దాసరి నరేష్ అనే వ్యక్తి ఈనెల 19న తాడూరి పోశం, తూము మోహన్లపై ఫిర్యాదు చేశారు. -
శునకం.. చూపిస్తుంది నరకం
[ 01-06-2024]
శునకాల దాడులు జిల్లాలో తీవ్రమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏదో ఒక చోట వీటి దాడులతో గాయపడుతున్న వారు పదుల సంఖ్యలో కనిపిస్తున్నారు. నిత్యం సర్కారు ఆసుపత్రి బాట పడుతున్నారు. -
అమ్మమ్మ ఇంటికొచ్చి.. అరగంటలో దోచేసి
[ 01-06-2024]
వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఇంటికొచ్చింది.. వారింట్లో ఉన్న బంగారం, నగదుపై ఆమె కన్నేసింది. ఎలాగైనా కాజేయాలని పథకం పన్ని తన ప్రియుడిని రప్పించింది. ఇంటిలో ఎవరూ లేని సమయంలో అరగంటలో బంగారం, వెండి, నగదు కాజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా శ్రేణుల్లో జోష్.. గన్నవరంలో చంద్రబాబుకు ఘన స్వాగతం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రోహిత్తో కలిసి ఓపెనింగ్.. నిరాశపరిచిన శాంసన్
-
పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైకాపాకు ఎదురుదెబ్బ
-
మేలో జీఎస్టీ వసూళ్లు రూ.1.73 లక్షల కోట్లు..
-
వాట్సప్లో ట్రేడింగ్ పేరుతో.. వ్యాపారి నుంచి రూ.9 కోట్లు స్వాహా