ప్రధాని రోడ్ షోలో అప్రమత్తంగా ఉండండి
ప్రధాన మంత్రి రోడ్ షోలో విధులు నిర్వహించే ప్రతీ అధికారి అంకితభావంతో పని చేయాలని నగర పోలీస్ కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణ అన్నారు.
పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు
పోలీసులకు సీపీ దిశానిర్దేశం
కరెన్సీనగర్, న్యూస్టుడే : ప్రధాన మంత్రి రోడ్ షోలో విధులు నిర్వహించే ప్రతీ అధికారి అంకితభావంతో పని చేయాలని నగర పోలీస్ కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణ అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో నగరంలోని ఆంధ్రా లయోల కళాశాల దేవయ్య ఆడిటోరియంలో మంగళవారం పోలీస్ అధికారులకు సీపీ దిశానిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రధాని పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు పర్యవేక్షణ పెంచాలన్నారు. సిబ్బంది వారికి కేటాయించిన పాయింట్ల వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు. వీక్షకులకు, ఆహ్వానితులకు వారికి కేటాయించిన మార్గాలను తెలియజెప్పాలన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే కంట్రోల్ రూమ్కు, ఉన్నతాధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్లాలన్నారు. ప్రధాని రోడ్ షోలో భాగంగా బందోబస్తు పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టం చేయాలని, రోడ్ ఓపెనింగ్ పార్టీస్, కట్ ఆఫ్ పార్టీస్, రూఫ్ టాప్స్, రోప్ పార్టీస్, యాంటి సబ్ టేజ్ చెక్... వివిధ బృందాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. విధుల్లో ఆరుగురు ఐపీఎస్, 7 గురు డీసీపీలు, ఏడీసీపీలు 22 మంది, ఏసీపీలు 50 మంది, ఇన్స్పెక్టర్లు 136 మంది, ఎస్సైలు 250 మంది సిబ్బందితో కలిపి 5 వేల మంది లా అండ్ ఆర్డర్, ఏఆర్., ఏపీఎస్పీ, పారా మిలటరీ బలగాలతో భద్రత పటిష్టంగా ఉండాలన్నారు. ట్రాఫిక్కు ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో పంపాలన్నారు. ఐజీపీ కె.వి.మోహన్రావు, డి.ఐ.జి. గోపినాథ్ జెట్టి, ఎ.ఐ.జి. ఎం.రవీంద్రనాథ్ బాబు, వకుల్ జిందాల్, మల్లికా గార్గ్, దామోదర్, డీసీపీలు శ్రీనివాసరావు, అధిరాజ్ సింగ్ రాణా, ఉదయరాణి, కీరముల్లా, చక్రవర్తి, హరికృష్ణ, బి.రామకృష్ణ ఇతర అధికారులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణ ప్రసాద్ ప్రత్యేక పూజలు
[ 02-06-2024]
పెడన నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణ ప్రసాద్ ఘంటసాల జలధీశ్వర స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి విశేష పూజలు జరిపారు.. -
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు.. పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
[ 02-06-2024]
నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించాయి. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. -
కౌంటింగ్ రోజు వైకాపా కుట్రలను తిప్పికొట్టాలి: చంద్రబాబు
[ 02-06-2024]
ఏపీలో కూటమి తిరుగులేని విజయం సాధించబోతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. -
తగాదాలు సృష్టించేందుకు వైకాపా ప్రయత్నాలు: సి.ఎం. రమేశ్
[ 02-06-2024]
ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని దాదాపు అన్ని సర్వేలు తేల్చాయని అనకాపల్లి లోక్సభ కూటమి అభ్యర్థి (భాజపా) సి.ఎం.రమేశ్ అన్నారు. -
స్వప్నాలు చెదిరినా.. స్వప్నిల్ తీరింతే..!
[ 02-06-2024]
మేం కళ్లు మూసుకున్నాం.. మీరూ కళ్లు మూసుకోండి... జనం ఎలా చనిపోతే ఏంటి? అసలెందుకు ప్రాణాలు పోతున్నాయో? అంటోంది ఘనత వహించిన విజయవాడ నగర పాలక సంస్థ. నిద్రపోతున్నవాళ్లను లేపవచ్చేమోకానీ.. నటించేవాళ్లను ఏమాత్రం మేల్కొల్పలేము! -
ఉన్నారా...? కళ్లు మూసుకున్నారా?
[ 02-06-2024]
నగరంలో కలుషిత నీరు తాగి పదిమంది ప్రాణాలు కోల్పోవడానికి.. వందలాదిమంది ఆసుపత్రులపాలవడానికి కారణాలేమిటో కనుగొనేందుకు వీఎంసీ ఇంతవరకు ఓ విచారణ బృందాన్ని కూడా నియమించలేదు. -
భజే వాయుపుత్రం!
[ 02-06-2024]
శ్రీ ఆంజనేయం.. ప్రసన్నాంజనేయం.. స్మరణతో ఆలయాలు మార్మోగాయి. హనుమజ్జయంతి సందర్భంగా శనివారం ఉమ్మడి కృష్ణా జిల్లాలో అంజనీపుత్రుడికి విశేష పూజలు నిర్వహించి.. ప్రత్యేక అలంకరణతో తీర్చిదిద్దారు. -
మట్టి తవ్వకాలపై ఎన్టీఆర్ కలెక్టర్ కన్నెర్ర
[ 02-06-2024]
‘మీకు ఎంత చెప్పినా చెవికి ఎక్కడం లేదా..? విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు. మీ ప్రాంతంలో మళ్లీ ఇలాంటి సంఘటనలు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి..!’ అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీరావు రెవెన్యూ అధికారులను హెచ్చరించారు. -
ఎన్నికల ఫలితాలు సకాలంలో ప్రకటించాలి
[ 02-06-2024]
ఓట్ల లెక్కింపు పటిష్ఠంగా నిర్వహించి సకాలంలో ఫలితాలు ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బాలాజీ జిల్లాలోని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. -
తవ్వేకొద్దీ అక్రమాలు
[ 02-06-2024]
వ్యవసాయశాఖ పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ) గోల్మాల్ వ్యవహారంలో ప్రైవేటు వ్యక్తితో పాటు వ్యవసాయశాఖ ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు అధికారుల విచారణలో వెలుగుచూస్తోంది. -
భక్తిశ్రద్ధలతో హనుమజ్జయంతి
[ 02-06-2024]
ఇంద్రకీలాద్రిపై భక్తిశ్రద్ధలతో హనుమజ్జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. క్షేత్రపాలక ఆంజనేయస్వామి ఆలయంలో రుత్వికులు పూజలు నిర్వహించారు. -
మా అవస్థలు పట్టవా?
[ 02-06-2024]
కాలువలపై సిమెంటు దిమ్మెలు బాగా దెబ్బతిన్నాయి. ఇనుప చువ్వలు సైతం బయట పడ్డాయి. కొన్నిచోట్ల పైకిలేచి ఉండడంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. -
సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయాలని ప్రార్థ్ధనలు
[ 02-06-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయాలని తెదేపా మహిళా నాయకులు శనివారం దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. -
బాగుచేసేదెప్పుడో?
[ 02-06-2024]
భవానీపురం పరిధిలోని పలు రహదారులు అధ్వానంగా మారాయి. భారీ గోతులు పడటంతో వాహనచోదకులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తుపాకీతో కాల్చుకుని ఏఆర్ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
-
రెండు రోజుల్లో కౌంటింగ్.. ఈసీ తలుపుతట్టిన అధికార, విపక్షాలు
-
ఎగ్జిట్ పోల్స్కి విలువ లేదు.. మమత రియాక్షన్ ఇదే!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
సినీ నటుడి బ్యాగులో 40 బుల్లెట్ల గుర్తింపు
-
అమిత్షాపై ఆరోపణలు.. జైరాం రమేష్కు ఈసీ నోటీసులు