శస్త్రచికిత్సలో అపశ్రుతి.. యువతి చనిపోయినా చెప్పకుండా దాచిన వైద్యులు
‘2019లో శస్త్రచికిత్స చేసి కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించుకునేందుకు ఆసుపత్రిలో చేరిందా యువతి. అందరితో నవ్వుతూ రెండు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పింది. అలా వెళ్లిన యువతి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా విగతజీవిగా మారింది.
కేసు నమోదు చేసిన సూర్యారావుపేట పోలీసులు
రితిక (పాతచిత్రం)
సూర్యారావుపేట(విజయవాడ), న్యూస్టుడే : ‘2019లో శస్త్రచికిత్స చేసి కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించుకునేందుకు ఆసుపత్రిలో చేరిందా యువతి. అందరితో నవ్వుతూ రెండు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పింది. అలా వెళ్లిన యువతి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా విగతజీవిగా మారింది. మరణించి ఒక రోజు గడిచినా యువతిని వెంటిలేటర్పై ఉంచామంటూ తల్లిదండ్రులను మభ్యపెట్టి శుక్రవారం ఉదయం చనిపోయినట్లు వైద్యులు ప్రకటించడంతో కుటుంబ సభ్యులు అగ్రహోదగ్రులయ్యారు. వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. కుమార్తె విగతజీవిగా కళ్లెదుట కనిపించే సరికి తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. చూపరులను కన్నీళ్లు పెట్టించిన ఈ ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి..
ఆసుపత్రి ముందు బైఠాయించిన రితిక బంధువులు, కుటుంబసభ్యులు
విజయవాడ గాంధీనగర్కు చెందిన పేర్ల లక్ష్మీ వెంకట రితిక (18) నందిగామ మిక్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఆమె తండ్రి రమేష్కు వస్త్రలతలో దుకాణం ఉంది. తల్లి కవిత గృహిణి. వారికి కుమారుడు, కుమార్తె. రితికకు చిన్నప్పటి నుంచి కాలు వంకరగా ఉండటంతో 2019లో నగరంలోని ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసి ప్లేట్లు అమర్చారు. ఇటీవల ఆసుపత్రిలో చూపించుకోగా అంతా బాగానే ఉందని కాలిలో ఉన్న ప్లేట్లను తీసేద్దామంటూ వైద్యుడు సూచించారు. ఈ నేపథ్యంలో శస్త్రచికిత్స నిమిత్తం బుధవారం ఉదయం ఆసుపత్రిలో చేరారు.
మత్తు వికటించిందని చెప్పి..: బుధవారం సాయంత్రం 6 గంటలకు శస్త్రచికిత్స చేస్తామని వైద్యులు ప్రకటించారు. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. రితికకు ఇచ్చిన మత్తు మందు వికటించిందంటూ రాత్రి 10.30 గంటల సమయంలో వెంటిలేటర్పై ఉంచామని వైద్యులు చెప్పడంతో కుటుంబసభ్యులు కంగారుపడ్డారు. బుధవారం రాత్రి నుంచి వెంటిలేటర్పై ఉందని చెప్పిన వైద్యులు శుక్రవారం ఉదయం రితిక మరణించిందని ప్రకటించడంతో ఒక్కసారిగా కుటుంబసభ్యులు కుప్పకూలిపోయారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మరణించిందంటూ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి ముందు బైఠాయించారు. ఆసుపత్రిని మూసివేయాలంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న సూర్యారావుపేట పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని బందోబస్తు ఏర్పాటు చేశారు.
తెదేపా నాయకుల మద్దతు: రితిక పెదనాన్న తెదేపా నాయకుడు కావడంతో విషయాన్ని బొండా ఉమామహేశ్వరరావుకు తెలిపారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, తెదేపా ఫ్లోర్లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి తదితరులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న కుటుంబసభ్యులకు సంఘీభావం ప్రకటించి నిరసనలో పాల్గొన్నారు. బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు తెదేపా నాయకులు, తల్లిదండ్రులతో మాట్లాడారు. నిర్లక్ష్యం వహించిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. కేసు పెట్టాలని పోలీసులు వారికి సూచించారు. దీంతో రితిక మేనత్త రేణుకాదేవి సూర్యారావుపేట స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముగ్గురు వైద్యులపై సూర్యారావుపేట పోలీసులు 304 ఎ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగారం
గన్నవరం గ్రామీణం, హనుమాన్జంక్షన్, న్యూస్టుడే : ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించి తగలబెట్టిన ఘటనలో నిందితుడికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. గన్నవరం పోలీసుల వివరాల ప్రకారం.. గన్నవరం మండలం అజ్జంపూడికి చెందిన తాడంకి నాగబాబు(21) 2020 సంవత్సరం మార్చి 12న ద్విచక్ర వాహనంపై వీకేఆర్ కళాశాల రోడ్డులో బహిర్భూమికి వెళ్లాడు. ఆ సమయంలో అప్పటికే పాత కక్షలు ఉండటంతో అజ్జంపూడికే చెందిన కొడవలి శివ అలియాస్ నాని, ఓ సీసాలో పెట్రోల్తో అక్కడకు చేరుకున్నాడు. నాగబాబు కళ్లలో కారం కొట్టి, పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటల్లో తీవ్రంగా కాలిపోయిన నాగబాబును సోదరుడు జోజిబాబు హుటాహుటిన పోరంకిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించాడు. పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి నుంచి విజయవాడ జీజీహెచ్కు మార్చారు. చికిత్స పొందుతూ 2020 మార్చి 16న నాగబాబు ప్రాణాలు కోల్పోయాడు. కొడవలి శివ భార్యకు, తన సోదరుడికి అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో శివ అంతకుముందు బెదిరింపులకు దిగాడని, ఆ క్రమంలోనే పథకం ప్రకారం హతమార్చాడంటూ జోజిబాబు గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై అప్పటి ఎస్సై రమేష్బాబు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. ఆ తర్వాత సీఐ కె.శివాజీ ఆధ్వర్యంలో విచారణ పూర్తి చేసి, ఛార్జిషీటు వేసి విజయవాడ 8వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానంలో హాజరుపర్చారు. న్యాయమూర్తి డి.లక్ష్మి, పీపీ జి.కల్యాణి మొత్తం 18 మంది సాక్షులను విచారించి, నిందితుడు కొడవలి శివ నేరానికి పాల్పడినట్లు నిర్ధారించారు. శుక్రవారం న్యాయస్థానంలో తుది విచారణ సందర్భంగా నిందితుడికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి డి.లక్ష్మి తీర్పు ఇచ్చారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో 15రోజులు జైలు విధించాలన్నారు. కేసు విచారణలో కీలక పాత్ర పోషించినందుకు గన్నవరం డీఎస్పీ జయసూర్య, సీఐ కేవీఎస్వీ ప్రసాద్, ఇతర సిబ్బందిని జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదేళ్లుగా అక్రమార్కుల ఇష్టారాజ్యం.. దుర్గగుడి ప్రక్షాళనకు వేళాయె!
[ 17-06-2024]
‘రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద దేవాలయమైన విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంపై చంద్రబాబు సర్కారు ప్రత్యేక దృష్టి సారించి.. ప్రక్షాళన చర్యలను ఆరంభించాల్సిన సమయం ఆసన్నమైంది. -
నారు పోయాలి.. నీరేదీ?
[ 17-06-2024]
కృష్ణా డెల్టా కాలువలకు గతేడాది జూన్ మొదటివారంలోనే నీరు విడుదల చేశారు. ఈసారి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. నారు పోసేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరుణుడు కరుణిస్తే తప్ప పొలాలకు సాగు నీరందే పరిస్థితి లేదు. -
ఒత్తిడికి ఓడిపోతున్నారు!
[ 17-06-2024]
ప్రేమ విఫలమైందనో... కుటుంబ సమస్యలనో...ఆర్థిక ఇబ్బందులనో.. పరీక్షల్లో తప్పామనో... ఇలా రకరకాల కారణాలతో ఒత్తిడికి లోనై బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. -
రైతుల కడ‘గండ్లు’ తీర్చండి!
[ 17-06-2024]
ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో సుమారు 80 కి.మీ పొడవునా విస్తరించి ఉన్న పోలవరం కాలువ గట్లు చాలాచోట్ల ధ్వంసమైపోయాయి. కాంక్రీటు చప్టాలు ఎక్కడికక్కడ కుంగిపోయాయి. -
సుమధుర స్వరం.. అక్కాచెల్లెళ్ల గానం
[ 17-06-2024]
వారిద్దరూ సోదరీమణులు. ఒకరు సాఫ్ట్వేర్ ఉద్యోగి కాగా.. ఒకరు బీటెక్ చదువుతున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదువుతో పాటు శాస్త్రీయ సంగీతం, కళలు, తదితర రంగాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి వేదికలపై సత్తాచాటుతున్నారు. -
దుర్గంధం ఘాట్...
[ 17-06-2024]
నిత్యం వేల మంది దుర్గమ్మ భక్తులు పుణ్య స్నానాలు ఆచరించే దుర్గాఘాట్ దుస్థితిది. కృష్ణా నదిలో నీటి మట్టం తగ్గడంతో భక్తుల కోసం జల్లు స్నానాలు ఏర్పాటు చేసినా కనీస శుభ్రత చర్యలు చేపట్టడం లేదు. -
రహదారులపై నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోండి
[ 17-06-2024]
నగరంలోని ప్రధాన రహదారులతోపాటు, అంతర్గత రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్తోపాటు, ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. -
దాత.. యాచకుడు యాదిరెడ్డి మృతి
[ 17-06-2024]
యాచక వృత్తి చేసుకుంటూ.. లక్షలాది రూపాయిలను దేవాలయాలకు విరాళంగా ఇచ్చిన ముత్యాలంపాడుకు చెందిన యడ్ల యాదిరెడ్డి(85) ఆదివారం రాత్రి మృతిచెందారు. -
శాంతిభద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు
[ 17-06-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ పి.హెచ్.డి.రామకృష్ణ పేర్కొన్నారు. -
యువతి జన్మదిన వేడుకల్లో ఘర్షణ
[ 17-06-2024]
యువతి జన్మదిన నేపథ్యంలో జరిగిన ఘర్షణలో యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. -
ఆర్టీసీ పార్సిల్ కష్టాలు..
[ 17-06-2024]
ఆర్టీసీ నిర్వహించే లాజిస్టిక్ సర్వీసులో పార్సిల్ బుక్ చేసిన వారి కష్టాలు ఎలా ఉన్నాయో చూడండి. ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్లో ఏదో ఒక జిల్లా నుంచి విజయవాడకు పార్సిల్ బుక్ చేశాక, అది డిస్పాచ్ కౌంటర్ నుంచి చేతికందేసరికి ప్రజలు నరకం చూస్తున్నారు. -
కోడ్ ముగిసినా మా గోడు పట్టదా..!
[ 17-06-2024]
పరిపాలనా సౌలభ్యం కోసం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమించే ప్రక్రియ జిల్లాలో పూర్తిస్థాయి అమలుకు నోచుకోలేదు. -
కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వండి
[ 17-06-2024]
సీఎం చంద్రబాబును ఆదివారం మాజీ ఎంపీ, తెదేపా జిల్లా అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు, ఆయన సోదరుడు కొనకళ్ల జగన్నాథరావులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. -
ప్రత్యేక హోదా సాధనకు ఇదే సరైన సమయం
[ 17-06-2024]
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ మెజార్టీతో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయం సాధించి అధికారంలోకి వచ్చాయని, ప్రస్తుతం కేంద్రంలోని మోదీ సర్కారు కూడా రాష్ట్ర ఎంపీల మీద ఆధారపడి నడుస్తుండడంతో.. -
మోపిదేవి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం
[ 17-06-2024]
శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వస్వామి ఆలయానికి ఆదివారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో రూ.10,99,732 ఆదాయం వచ్చిందని ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పన్నూ హత్యకు కుట్ర కేసు.. అమెరికాకు నిఖిల్ గుప్తా అప్పగింత!
-
ఐదేళ్లుగా అక్రమార్కుల ఇష్టారాజ్యం.. దుర్గగుడి ప్రక్షాళనకు వేళాయె!
-
సైబర్ వలతో విలవిల.. మాతృభూమికి రప్పించడం ఎలా?
-
తాడేపల్లిలో ప్రజలకు తీరిన ‘దారి’ కష్టాలు!
-
చుక్క రక్తం తీయకుండా ఐదు నిమిషాల్లో ఫలితాలు
-
ఉద్యోగులు ఆలస్యంగా వస్తే కఠినచర్యలు: కేంద్రం