24 గంటల్లోపే దొంగ అరెస్టు
మీ సేవా కేంద్రంలో చోరీకి పాల్పడిన నిందితున్ని 24 గంటల్లోపే అరెస్టు చేసిన సంఘటన సరూర్నగర్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఎల్బీనగర్లో డీసీపీ సన్ప్రీత్సింగ్ తెలిపిన కథనం ప్రకారం... గుంటూరు జిల్లా దాచేపల్లి గ్రామానికి చెందిన
నిందితుడు అంబటి చక్రవర్తి
నాగోలు, న్యూస్టుడే: మీ సేవా కేంద్రంలో చోరీకి పాల్పడిన నిందితున్ని 24 గంటల్లోపే అరెస్టు చేసిన సంఘటన సరూర్నగర్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఎల్బీనగర్లో డీసీపీ సన్ప్రీత్సింగ్ తెలిపిన కథనం ప్రకారం... గుంటూరు జిల్లా దాచేపల్లి గ్రామానికి చెందిన అంబటి చక్రవర్తి(32) పాత నేరస్థుడు. గుంటూరు, సూర్యాపేట జిల్లాల్లో చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లొచ్చాడు. పగటిపూట తాళం వేసిన ఇళ్ల వద్ద రెక్కీ నిర్వహించి రాత్రిళ్లు చోరీలకు పాల్పడతాడు. గతేడాది మే నెలలో జైలు నుంచి విడుదలై నగరానికి వచ్చి దిల్సుఖ్నగర్ పీఅండ్టీ కాలనీలో ఉంటూ సరూర్నగర్లోని స్టీల్ బజార్లో పనిచేస్తున్నాడు. దాంతోపాటు సులువుగా సంపాదించేందుకు తిరిగి చోరీలకు పాల్పడుతున్నాడు. తాజాగా పీఅండ్టీ కాలనీలోని మీ సేవా కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నాడు. 25వ తేదీ రాత్రి 9గంటలకు నిర్వాహకుడు కేంద్రానికి తాళంవేసి వెళ్లిపోగా... అర్ధరాత్రి కిటికీ గ్రిల్స్ను వంచి లోనికి ప్రవేశించి కార్యాలయ అల్మారాలోని రూ.1లక్షా 30వేల నగదును దోచుకెళ్లాడు. నిర్వాహకుడు ఇచ్చిన ఫిర్యాదుతో సరూర్నగర్ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సీసీ ఫుటేజీలు పరిశీలించారు. అందులో నిందితుని చిత్రాలను గుర్తించారు. ఎల్బీనగర్ సీసీఎస్, ఐటీ సెల్ సహకారంతో 24గంటల్లోపు నిందితున్ని అరెస్టుచేశారు. అతని వద్ద రూ.1,11,240 నగదును స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో క్రైమ్ డీసీపీ యాదగిరి, ఏసీపీ శ్రీధర్రెడ్డి, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు వేంకటేశ్వర్లు, ఏవీ రంగా, దేవేందర్, సరూర్నగర్ సీఐ సీతారామ్, డీఐ రవిబాబు, ఎస్సైలు శ్రీనివాసరావు, నర్సయ్య, పాండు, సిబ్బంది పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు’: ప్రధాని మోదీ
-
తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు
-
సోమవారం ముడతల దుస్తులు ధరించండి..! సీఎస్ఐఆర్ వినూత్న ప్రచారం
-
మూడో నెలా పేటీఎం లావాదేవీలు డౌన్.. టాప్లో ఫోన్పే, గూగుల్పే
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన
-
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు