ప్రచార రణంలో పంచ్లు!
‘వేసవిలోనే ఫ్యాన్ను నాలుగులోనో, ఐదులోనో పెట్టుకుంటాం. గాలి బాగా వస్తుంది. కానీ, కిందటి ఎన్నికల్లో ఫ్యాన్ను ఏకంగా ‘151’లో పెట్టారు. ఏమైంది.. ఇల్లు టాప్ లేచిపోయేలా.. జగన్ సర్కార్ విద్యుత్తు బిల్లులతో బాదేసింది. అందుకే.. ఇప్పుడు ఫ్యాన్ను 4లోనో, 5లోనో ఉంచండి’
ప్రశ్నించి, హెచ్చరించి ఓటుపై అప్రమత్తం చేస్తున్న ఉపన్యాసాలు
తెదేపా, జనసేన సభల్లో ఆలోచింపజేస్తున్న సినీ కళాకారులు
‘వేసవిలోనే ఫ్యాన్ను నాలుగులోనో, ఐదులోనో పెట్టుకుంటాం. గాలి బాగా వస్తుంది. కానీ, కిందటి ఎన్నికల్లో ఫ్యాన్ను ఏకంగా ‘151’లో పెట్టారు. ఏమైంది.. ఇల్లు టాప్ లేచిపోయేలా.. జగన్ సర్కార్ విద్యుత్తు బిల్లులతో బాదేసింది. అందుకే.. ఇప్పుడు ఫ్యాన్ను 4లోనో, 5లోనో ఉంచండి’
కొంత సమాచారం, మరింత వ్యంగ్యం.. కొంచెం అప్రమత్తత, కాసింత ఆవేదన.. ఇలా అన్నీ కలగలిపిన మాటలు ఇప్పుడు ఎన్నికల ప్రచారాన్ని ఉర్రూతలూగిస్తున్నాయి. సుర్రుమంటున్న ఎండల్లో నవ్వుల జల్లులు కురిపించి సభను చల్లబరుస్తున్నాయి. ప్రజలను ఆలోచనలో పడేస్తున్నాయి. జనసేన, తెదేపా తరఫున సినీ కళాకారులే నేరుగా రంగంలోకి దిగి.. వైకాపా వైఫల్యాలను వ్యంగ్యంతో రంగరించి వివరిస్తున్నారు. పంచ్ పడగానే చప్పట్లతో ఆస్వాదిస్తున్న ప్రజలు.. ఆ తర్వాత చర్చిస్తున్నారు.
ఈనాడు, అమరావతి: ఆకట్టుకునే పంచ్ డైలాగ్ల హంగామా ఈటీవీ ‘జబర్దస్త్’ ఎందరినో హీరోలను చేసింది. మరెందరినో సినీ రంగంలో నిలదొక్కుకునేలా చేసింది. అందులో ఒకరు హైపర్ ఆది. ఆది తనదైన పంచ్లతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. సృజన ఉండాలే గానీ రాజకీయాల్లో రోజూ వ్యంగ్యం విరబూయించొచ్చు. అందుకే ఆదితోపాటు సినీ నటుడు పృథ్వీ, హీరో వరుణ్తేజ్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రచార క్షేత్రంలోకి దిగారు. కూటమికి మద్దతుగా ఛలోక్తులను చలామణిలోకి తీసుకొస్తున్నారు. సాధారణంగానే సినీ, టీవీ నటులు అంటే ప్రజలకు ప్రత్యేకాభిమానం ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా ప్రజలు వస్తారు. కానీ, వారిని సభలో నిలబెట్టాలంటే పంచ్లు పేలాలి. అదీ కాలానికి తగినదై, కాకలుతీరిన ప్రత్యర్థి కాళ్లకు బంధనాలు వేసేదై ఉండాలి. అలాంటి పంచ్ డైలాగ్లే కూటమి సభల్లో మోత మోగుతున్నాయి. అవే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
జగన్ మాట తప్పారా లేదా?
‘‘కిందటి ఎన్నికల్లో జగన్ ఏం చెప్పారు. మాట తప్పను, మడమ తిప్పను అన్నారు. ప్రత్యేక హోదా తెచ్చారా... లేదు. సీపీఎస్ రద్దు చేశారా.. లేదు. మద్య నిషేధం చేశారా.. లేదు, పోలవరం నిర్మించారా... లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛను రూ.3,000 చేస్తానన్నారు.. లేదు. ఆయన మాట తప్పుతారు, మడమ తిప్పుతారు. జగన్ను నమ్మకండి ఆయనకు ఓటెయ్యకండి’’ అని హైపర్ ఆది ప్రచారం చేస్తున్నారు.
ఆయన కుటుంబానికే దిక్కు లేదు?
‘మీ కుటుంబంలో మంచి జరిగిందో లేదో చూడండి. మంచి జరిగితే మళ్లీ వైకాపాకు ఓటు వేయండి అని జగన్ అంటున్నారు. అసలు ఆయన కుటుంబంలో మంచి జరిగిందా..’’ అని హైపర్ ఆది ప్రజలను ఆలోచనలో పడేస్తున్నారు. ‘‘ఆయన చెల్లెళ్లు ఇద్దరూ న్యాయం చేయండి అంటూ వేడుకుంటున్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఎన్నికల బరిలోకి వచ్చారు. ఆయన కుటుంబానికే మంచి చేయని జగన్ మన కుటుంబానికి మంచి చేస్తారా’’ అంటూ సవివరంగా చెప్పేస్తున్నారు. అందుకే.. వైకాపాకు ఓటు వేయవద్దని విన్నవిస్తున్నారు.
ఆయన ‘మీ బిడ్డ’ కాదు..!
‘‘మీ బిడ్డ.. మీ బిడ్డ’నని జగన్ ప్రతి సభలో ప్రజలకు చెప్పుకొంటున్నారు. మరి.. బిడ్డగా మనకు ఆయన ఏం చేశారు?’’ అని సూటిగా నిలదీస్తున్నారు. ‘‘అక్కను వేధిస్తున్నారని బాలుడు అమర్నాథ్ నిలదీస్తే పెట్రోలు పోసి తగలబెట్టారు. ‘మీ బిడ్డ’నని చెప్పుకొనే ఆయన అప్పుడెందుకు చర్యలు తీసుకోలేదు. ఒక ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ను చంపేసి డోర్ డెలివరీ చేస్తే.. అదే ‘మీ బిడ్డ’ ఎందుకు మాట్లాడటం లేదు. దళిత వైద్యుడు సుధాకర్ మాస్కు అడిగినందుకు పిచ్చివాణ్ని చేసి చంపేసినా.. ‘మీ బిడ్డ’ ఎందుకు స్పందించరు. ఓ చిన్న పిల్లను ఎందరో చెరిస్తే.. ఆ తల్లి న్యాయం కోసం తిరుగుతూనే ఉంది. ‘మీ బిడ్డ’ అని చెప్పుకొనే జగన్కు ఆమె కన్నీళ్లు ఎందుకు కనిపించవు’ అంటూ రాష్ట్రంలో ఐదేళ్లు జరిగిన దాష్టీకాలను ప్రజల కళ్ల ముందుంచుతూనే.. కఠిన పాలకులను నిలదీస్తున్నారు. ‘బటన్ నొక్కితే ఆడవాళ్ల ఖాతాలో రూ.15 వేలు పడుతున్నాయంటున్నారు జగన్. సాయంత్రం మూత తిప్పితే రూ.30 వేలు మద్యానికి పోతున్నాయ్’ అని హైపర్ ఆది వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
మాటలే కాదు.. పాటలు సైతం
- సినీ నటుడు పృథ్వీ సైతం రాష్ట్రమంతా తిరుగుతున్నారు. పవన్ను ఓడించకుంటే పేరు మార్చుకుంటానంటూ ముద్రగడ చేసిన సవాల్కు పృథ్వీ స్పందిస్తున్నారు. ఎన్నికలైన వెంటనే మేమంతా ఆయన బారసాలకు వెళ్లాలని చమత్కరిస్తున్నారు. తన శాఖ విషయాలు తెలియని రోజా.. మాట్లాడితే పవన్ వ్యక్తిగత విషయాలు ఎత్తుకుంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు.
- కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇంతకుముందే పవన్కు మద్దతు ఒక పాట విడుదల చేశారు. నల్గొండ గద్దర్ పాడిన పాటకు ఆయన నృత్యం చేసి విడుదల చేశారు. జనసేన ప్రచారంలో ఆ పాట మార్మోగుతోంది.
- సినీ హీరో వరుణ్ తేజ్ పిఠాపురంలో బాబాయి పవన్ కల్యాణ్కు మద్దతుగా ప్రచారం చేస్తూ పిఠాపురం నియోజక వర్గాన్ని ఒక స్థాయిలో నిలబెడతామన్నారు.
- సినీ నటుడు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పిఠాపురంలోనే మకాం వేశారు.
- తెదేపా, కూటమి తరఫున నారా రోహిత్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రచారం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్