జగన్ కోసం.. ఎంతకైనా దిగజారుతా
నువ్వు ఇంతకంటే దిగజారవనుకునే ప్రతిసారీ నా నమ్మకం తప్పని నిరూపిస్తున్నావు అంటూ జెర్సీ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డికి అది అతికినట్టుగా సరిపోతుంది.
వైకాపా కుట్రల అమలులో వెనక్కి తగ్గని సీఎస్ జవహర్రెడ్డి
మొన్న పింఛన్లు.. తాజాగా పెట్టుబడి రాయితీ, ఫీజ్ రీయింబర్స్మెంట్
ఎన్నికల షెడ్యూలుకు ముందే బటన్ నొక్కినా.. దురుద్దేశపూరితంగా ఖాతాల్లో జమచేయని వైనం
ఈనాడు, అమరావతి: నువ్వు ఇంతకంటే దిగజారవనుకునే ప్రతిసారీ నా నమ్మకం తప్పని నిరూపిస్తున్నావు అంటూ జెర్సీ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డికి అది అతికినట్టుగా సరిపోతుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అధికార వైకాపాపై మితిమీరిన స్వామిభక్తిని ప్రదర్శిస్తున్న ఆయన... తన ప్రతి నిర్ణయాన్ని, ప్రతి అడుగునూ ఆ పార్టీకి ఎన్నికల్లో లబ్ధి కలిగించటమే లక్ష్యంగా వేయటంలో ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. ఎన్నికల సమయంలోనైనా తటస్థంగా, నిష్పాక్షికంగా వ్యవహరిస్తారేమోననుకుంటే... ‘‘లేదు లేదు.. అధికార పార్టీతో అంటకాగుతూ.. ఇంకా అథఃపాతాళానికి దిగజారుతూనే ఉంటా’’ అని తన చేతల ద్వారా పదే పదే నిరూపించుకుంటున్నారు. ఇంటివద్దకే పింఛన్లు అందించే అవకాశమున్నా.. వృద్ధుల్ని మండుటెండల్లో గ్రామ, వార్డు సచివాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరిగేలా చేసి సీఎస్ జవహర్రెడ్డి వారిని ముప్పుతిప్పలు పెట్టారు. ఆ నెపం విపక్షాలపై నెట్టేందుకు జగన్ పన్నిన దుష్టపన్నాగంలో అన్నీ తానై వ్యవహరించారు. ఇలా జగన్ కుట్రలను యథేచ్ఛగా అమలుచేస్తున్న ఆయన తాజాగా రైతులకు పెట్టుబడి రాయితీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపుల వ్యవహారంలో మరో కుతంత్రానికి తెరలేపారు. ఈ దురుద్దేశాన్ని గుర్తించే ఎన్నికల సంఘం వాటి విడుదలకు అనుమతి నిరాకరించి అడ్డుకట్ట వేసింది.
ముందే జమచేసే అవకాశం ఉన్నా..
2023 ఖరీఫ్లో కరవు వల్ల పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ పెట్టుబడి రాయితీని బాధిత రైతులకు వెంటనే చెల్లించలేదు. రూ.847 కోట్ల పెట్టుబడి రాయితీ చెల్లింపు కోసం మార్చి 6న, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రూ.610 కోట్ల కోసం మార్చి 1న బటన్ నొక్కారు. సాధారణంగా ఆ వెంటనే మొత్తం సొమ్ము రైతులు, విద్యార్థుల ఖాతాల్లో జమకావాలి. మహా అయితే ఓ వారం పట్టొచ్చు. కానీ ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే అవకాశముందని తెలిసినా అప్పట్లో వారి ఖాతాల్లో సొమ్ములు జమచేయకుండా దురుద్దేశపూర్వక జాప్యం చేశారు. తీరా మార్చి 16న ఎన్నికల షెడ్యూలు విడుదలైపోయింది. కొన్ని రోజుల తర్వాత తీరిగ్గా ఆ సొమ్ము విడుదలకు అనుమతివ్వాలంటూ స్క్రీనింగ్ కమిటీ ముందు ప్రతిపాదనలు పెట్టారు. దానికి అధ్యక్షుడిగా ఉన్న సీఎస్ జవహర్రెడ్డి ఆఘమేఘాలపై స్పందించి నిధుల విడుదలకు అనుమతివ్వాలంటూ ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపించారు. పోలింగ్కు కొద్దిరోజుల ముందు ఆ సొమ్ము రైతులు, విద్యార్థుల ఖాతాల్లో జమచేసి ఎన్నికల్లో వైకాపాకు అనుచిత ప్రయోజనం కలిగించాలనే కుతంత్రం దీని వెనక ఉంది. ఒకవేళ ఎన్నికల సంఘం స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదనలను తిరస్కరించి, నిధులు విడుదలకు అనుమతించకపోతే విపక్షాలు అడ్డుకోవటం వల్లే పెట్టుబడి రాయితీ, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులు చేయలేకపోయామంటూ ప్రతిపక్షాలపై విషప్రచారం చేయాలనే దురుద్దేశంతో ఇలా వ్యవహరించారు.
ప్రభుత్వ నిధులతో ఓట్లు కొనాలనే కుట్ర కాదా!
ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో తమకు కావాల్సిన కాంట్రాక్టర్లకు దాదాపు రూ.13వేల కోట్ల మేర బిల్లులు చెల్లించి దోచిపెట్టారు. అప్పుడు జగన్కు, జవహర్రెడ్డికి రైతులకు చెల్లించాల్సిన పెట్టుబడి రాయితీ, విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ గుర్తుకురాలేదా? వేలకోట్ల రూపాయల నిధులు అందుబాటులో ఉన్నా... అప్పుడు ఎందుకు చెల్లించలేదు? వారం, పదిరోజుల్లో సొమ్ము జమచేస్తామని చెప్పి ఎందుకు జాప్యం చేశారు? అప్పుడు కుట్రపూరిత తాత్సారం చేసి... ఇప్పుడు ఎన్నికల సంఘానికి నిధుల విడుదల కోసం నివేదించటం ఏంటి? వారు అనుమతిస్తే పోలింగ్కు కొద్దిరోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా చేసి... తద్వారా ప్రభుత్వ నిధులతో ఓట్లు కొనాలనే కుట్ర ఇది కాదా? ఎవరి మెప్పు కోసం, ఎవరి కళ్లలో ఆనందం కోసం, ఎవరికి అనుచిత ప్రయోజనాలు కోసం జవహర్రెడ్డి ఇదంతా చేశారనేది ప్రశ్నించుకుంటే జగన్, వైకాపా కోసమే ఆయన ఈ కుట్రను అమలు చేశారనేది తేటతెల్లమవుతుంది. ఎన్నికల సంఘం ఈ కుట్రను పసిగట్టే వాటి విడుదలకు అనుమతి నిరాకరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
కొత్త విద్యాసంవత్సరం(2024-25)లో రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. -
భయపెడుతున్న ఏపీ రెవెన్యూ, ద్రవ్యలోటు
రెవెన్యూ ఖర్చుల నియంత్రణ, అప్పుల నియంత్రణపైనే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికప్పుడు రెవెన్యూ లోటు పెరిగిపోతూ ఉంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం రెవెన్యూ లోటు లేకుండా చూడాలి. -
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?
‘రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు.. ఫలితాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి.. ఇలాగైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉద్యోగాలు ఎలా వస్తాయి..’ అని ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులను పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ ప్రశ్నించారు. -
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
చాట్ జీపీటీ కంటే మెరుగ్గా తెలుగులో సరికొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు వై.కిరణ్చంద్ర తెలిపారు. -
ఏం చెప్పినా.. తందానతాన!
కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర కీలక స్థానాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని ఏరికోరి నియమించిందీ ఆయనే..! కొన్ని జిల్లాల్లో వివాదాస్పద అధికారులున్నారని, వారు ఎన్నికల వేళ అధికార పార్టీతో అంటకాగుతున్నారన్న విపక్షాల ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా చోద్యం చూసిందీ ఆయనే..! తీరా ఎన్నికల సంఘం కన్నెర్ర చేస్తే.. -
పల్నాడు కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీ లఠ్కర్
రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను, ఒక జిల్లాకు కలెక్టర్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీరావు లఠ్కర్, ఎస్పీగా మలికా గార్గ్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి, తిరుపతి ఎస్పీగా వి.హర్షవర్ధన్ రాజును నియమించింది. -
ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం
జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలంగాణ ఎప్సెట్లో ఏపీ విద్యార్థుల విజయదుందుభి
తెలంగాణ ఎప్సెట్-2024లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఎప్సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ర్యాంకులను శనివారం ఆ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తదితరులు విడుదల చేశారు. -
రాజేంద్రనాథరెడ్డి సిబ్బందే సిట్ సభ్యులు!
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండకు పూర్వ డీజీపీ, ప్రస్తుత ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథరెడ్డి నియమించిన అధికారులే కారణమని ఓ వైపు విమర్శలు వ్యక్తమవుతుంటే.. మళ్లీ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందినే సిట్లో నియమించడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. -
ఎప్సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వారంలో..
తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు ప్రారంభం
ఏపీఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉదయం సెషన్ ఒకటే నిర్వహించినట్లు సెట్ ఛైర్మన్, జేఎన్టీయూకే వీసీ జీవీఆర్ ప్రసాదరాజు, కన్వీనర్ కె.వెంకటరెడ్డి తెలిపారు. -
ఆరు వారాల్లో తేల్చండి.. ఏపీ చెస్ అసోసియేషన్కు గుర్తింపుపై హైకోర్టు ఆగ్రహం
ఏపీ చెస్ అసోసియేషన్కు అనుబంధ గుర్తింపు ఇచ్చే వ్యవహారంలో జాతీయ క్రీడల కోడ్ నిబంధనలకు లోబడి తగిన ఉత్తర్వులు జారీచేయాలని అఖిల భారత చదరంగ సమాఖ్య కార్యదర్శిని.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
ఆర్టీసీ ఎండీ సిహెచ్.ద్వారకా తిరుమలరావు ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టి.. ఆయనే ఫోన్ చేస్తున్నట్లుగా 70334 00216 నంబరుతో పలువురికి వాట్సప్ కాల్స్ చేసి బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు యత్నించారు. -
‘ప్రమాదాలు ఆందోళనకరం..’ పట్టించుకోని అధికారగణం!
రాష్ట్రంలో వరస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణలోపం ఫలితంగా వందల మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఐదు రోజుల కిందట చిలకలూరిపేట వద్ద ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టడంతో మంటలు ఎగిసి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. -
స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి నిమ్రా కళాశాలలో ఏర్పాటుచేసిన ఈవీఎంల స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు చేరుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద పకడ్బందీ భద్రత ఉండాలి
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ల వద్ద అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
24లోగా రబీ పంట నష్టాన్ని లెక్కించండి
రబీ కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 24 లోగా పంటనష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ ఆదేశించారు. రాజకీయ లబ్ధికి తావులేకుండా నష్టాన్ని లెక్కించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారులకు సూచించారు. -
ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతుగా సంతకాల సేకరణ
జగన్ ప్రభుత్వ కక్షపూరిత చర్యలకు బలైపోయిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పౌర సమాజం నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ఆయనకు న్యాయం చేయాలంటూ రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ‘ఛేంజ్.ఓఆర్జీ’లో వేల మంది సంతకాలు చేస్తున్నారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి క్యూలైన్లో వచ్చిన భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టైమ్స్లాట్ టోకెన్లు లేని భక్తులు శనివారం వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఔటర్రింగ్ రోడ్డు, శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. -
ఉన్నత విద్యామండలి ఛైర్మన్పై గవర్నర్కు ఫిర్యాదు
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డిపై గవర్నర్కు ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఫిర్యాదు చేయగా.. చర్యల కోసం వాటిని ఉన్నత విద్యాశాఖకు పంపించారు. -
కోడ్ ఉల్లంఘన ఆరోపణలతో ఏయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెన్షన్
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జి.లావణ్య దేవిని సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
హిందీ ‘గజనీ’.. మురుగదాస్ ఫస్ట్ ఛాయిస్ సల్మాన్
-
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్
-
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM