2024: చరిత్రలోనే అతిపెద్ద ఎన్నికల సంవత్సరం..!
ప్రపంచవ్యాప్తంగా దాదాపు సగం జనాభా 2024లో ఎన్నికలను చూడనుంది. వీటి ఫలితాలు భౌగోళిక రాజకీయాలను సమూలంగా మార్చే అవకాశం ఉంది. వీటిల్లో కీలక ఎన్నికల వివరాలు తెలుసుకొందాం.
ఇంటర్నెట్డెస్క్: మానవ చరిత్రలోనే అతిపెద్ద ఎన్నికల సంవత్సరంగా 2024 నిలవనుంది. ఈసారి చాలాచోట్ల ప్రాంతీయ, జాతీయ ఎన్నికలను జనాలు చూడనున్నారు. అంతేకాదు.. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న పది దేశాల్లో ఏడుచోట్ల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో చాలా విశేషాలున్నాయి. మొత్తం 64 దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫలితంగా ఈ భూమిపై ఉన్న 4 బిలియన్ల జనాభాపై వీటి ప్రభావం ఉండనుంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో పోలింగ్ ముగిసి ఫలితాలు కూడా వెలువడ్డాయి.
అత్యధికంగా ఏడు విడతల్లో భారత్లో పోలింగ్ జరుగుతోంది. భారత్లో ఓటర్ల సంఖ్య 96.8 కోట్ల మంది. 2019 ఎన్నికలతో పోలిస్తే వీరి సంఖ్య 15 కోట్ల వరకు పెరిగింది.
ఇక ప్రపంచంలోనే అత్యధిక మంది ఒకేరోజు ఓటు హక్కు వినియోగించుకొన్నది మాత్రం ఇండోనేషియా ఎన్నికల్లో. దాదాపు 20 కోట్ల మంది ఓటర్లలో 82.39 శాతం మంది ఓటుహక్కును వినియోగించుకొన్నారు. ఇక టువాలు దేశంలో అతి తక్కువగా 10 వేల మంది లోపే ఓటు వేశారు.
కిమ్ నియంతృత్వ పాలనలో మగ్గుతున్న ఉత్తర కొరియాలో పార్లమెంటరీ ఎన్నికలు ఏప్రిల్ 10న జరుగుతాయని ప్రకటించారు. ఆ తర్వాత వాటికి సంబంధించిన సమాచారం ఎక్కడా లేదు. ఇక దక్షిణ కొరియా కూడా ఏప్రిల్ 10న నేషనల్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించింది.
భారత్లో ఇలా..
- మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో భారత మిత్రురాలిగా పేరున్న షేక్ హసీనా రికార్డు స్థాయిలో నాలుగోసారి ప్రధాని అయ్యారు. ఇక భూటాన్లో త్సెరింగ్ టోబ్గేను ప్రజలు ఎన్నుకొన్నారు. ఇవన్నీ భారత్కు సానుకూల పరిణామాలే.
- తైవాన్లో చైనా వ్యతిరేక పార్టీగా పేరున్న డీపీపీకి చెందిన విలియం లాయ్చింగ్ విజయం సాధించారు. దీంతో తైవాన్ పునరేకీకరణపై కలలుకంటున్న బీజింగ్కు బ్రేకులు పడ్డట్లైంది.
- ఇక పాకిస్థాన్లో ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో పీఎంఎల్ఎన్-పీపీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకొంది. ఇమ్రాన్ వలే షరీఫ్లు మరీ తీవ్రమైన భారత వ్యతిరేక వైఖరిని అవలంభించరనే పేరుంది. మోదీ తొలివిడత పాలనలో పాక్లో పర్యటించింది షరీఫ్ హయాంలోనే.
- ఏప్రిల్లో మాల్దీవుల పీపుల్స్ మజ్లిస్ (పార్లమెంట్)కు జరిగిన ఎన్నికల్లో పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. దీంతో భారత వ్యతిరేకి అయిన అధ్యక్షుడు ముయిజ్జుకు ఆ దేశ చట్టసభల్లో ఎదురులేకుండా పోయింది.
- ఆర్థిక ఇబ్బందులతో దివాలా తీసిన శ్రీలంక పార్లమెంట్, అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్లో జరగొచ్చు. ఇక్కడ భారత్ అనుకూల పాలకులు ఉన్నారు. ఎన్నికల్లో భారత్తో సానుకూల సంబంధాలు కూడా ప్రధానాంశమయ్యే అవకాశం ఉంది.
విశ్వశక్తుల నాయకత్వాలకు పరీక్ష..
- ఈ ఏడాది మార్చి 15-17 వరకు రష్యాలో ఎన్నికలు జరిగాయి. అక్కడి పుతిన్ను భారీ మెజార్టీతో ఎన్నుకొన్నారు. భారత ప్రధాని ఈ ఏడాది ద్వితీయార్థంలో బ్రిక్స్ సమావేశం నిమిత్తం రష్యాకు వెళ్లే అవకాశాలున్నాయి.
- ఇక అమెరికాలో నవంబర్ 5వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. పాత ప్రత్యర్థులైన జోబైడెన్-ట్రంప్ మరోసారి ముఖాముఖీ తలపడనున్నారు. సాధారణంగా అమెరికా ఎన్నికల ఫలితాలు ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి. ట్రంప్ మళ్లీ ఎన్నికైతే ప్రపంచానికి అతిపెద్ద ముప్పు తప్పదని ది ఎకానమిస్ట్ పత్రిక అభిప్రాయపడింది. పశ్చిమ దేశాల్లో కూడా ఆయన ఎన్నికపై భయాలు నెలకొన్నాయి.
- ఐరోపా సమాఖ్య పార్లమెంట్కు కూడా జూన్ 6-9 వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఉక్రెయిన్ యుద్ధానికి మద్దతు, ఇజ్రాయెల్కు అండగా ఉండటం, వలసల అంశాలు, భారత్ సహా పలు దేశాలతో వాణిజ్య చర్చలు వంటి అంశాలపై వీటి ఫలితాలు ప్రభావం చూపించనున్నాయి.
- యూకేలో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ లేబర్ పార్టీ కొంత దూకుడుగా ఉంది. రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటీవ్ పార్టీ గడ్డుకాలం ఎదుర్కొంటోంది. ఇక సునాక్ అధికారంలో ఉండగానే భారత్తో స్వేచ్ఛా వాణిజ్యంపై ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలూ ఉన్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎందుకీ నిరాసక్తి?
సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. -
ప్రాంతీయ పార్టీల్లో పునరుత్తేజం!
సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా సగానికిపైగా లోక్సభ నియోజకవర్గాల్లో ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. -
అటో.. ఇటో.. ఉత్కంఠే!
ఖనిజ సంపద ఉన్నా వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఝార్ఖండ్లో తీర్పు విచిత్రంగా ఉంటుంది. ఒకసారి ఒక కూటమికి, మరోసారి ఇంకో కూటమికి ఇక్కడి ప్రజలు పట్టం కడుతుంటారు. -
కార్మిక లోకం ఎవరికి బలం!
పశ్చిమ బెంగాల్లోని పారిశ్రామిక కారిడార్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. పౌరసత్వ సవరణ చట్టం, మైనారిటీలు, కూటమి ప్రభావం ఈ ఎన్నికల్లో అధికంగా ఉండనుంది. -
వారసులకు పరీక్ష!
బిహార్లోని 5 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 80 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
తేల్చేది తెలుగు ఓటర్లే!
తూర్పు రాష్ట్రాల్లో కీలకమైన ఒడిశాలో నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో భాగంగా సోమవారం దక్షిణ ఒడిశాలోని బ్రహ్మపుర, కొరాపుట్, నవరంగపుర్, కలహండి లోక్సభ, వాటి పరిధిలోని 28 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
సంచలన హోరు!
పశ్చిమ బెంగాల్లోని అత్యంత సంచలన నియోజకవర్గాల్లో నాలుగో విడతలో భాగంగా సోమవారం పోలింగ్ జరగనుంది. -
ఆఖరి వ్యూహాల్లో అభ్యర్థులు
పోలింగ్ సమయం ఆసన్నం కావడంతో లోక్సభ అభ్యర్థులు అంతిమ వ్యూహాలకు తెరలేపారు. ఎన్నికల్లో గెలవాలంటే నేరుగా ఎక్కువ ఓట్లు సాధించడం ఒక పద్ధతి. -
రవాణా సదుపాయం.. ఓట్లకు ఉపాయం
పోలింగ్ బూత్లకు దూరంగా ఉన్న పల్లెల్లోని ఓటర్లను తరలించేందుకు స్థానిక నాయకులు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రజారవాణా సౌకర్యాలు కొరవడిన మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గూడేల్లో ప్రతి ఎన్నికలోనూ ఇదే తంతు పునరావృతం అవుతోంది. -
ఓటు అమూల్యం.. వేద్దాం ఇలా..
ఓటు అమూల్యం.. ఆ హక్కును సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నా.. దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్నా.. ప్రతి ఒక్కరూ ఓటు వేయడం అత్యంత కీలకం. -
ఓటు హక్కు కాదు.. పౌర బాధ్యతంటున్న సింగపూర్
మన దేశంలో ఓటును హక్కుగా చూస్తారు. కానీ, సింగపూర్లో మాత్రం అది పౌరుడి బాధ్యత కూడా. ప్రభుత్వ ఎంపిక బాధ్యత నుంచి తప్పించుకొనేవారిని అక్కడి చట్టాలు తేలిగ్గా వదిలిపెట్టవు. అలాగని ప్రజలు ఏదో బలవంతం మీద ఓటు వేసినట్లు ఉండనీయవు. -
మంజీర పరీవాహకంలో గెలుపు తీరం ఎవరిదో!
తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో జహీరాబాద్ లోక్సభ స్థానం కొన్ని ప్రత్యేకతలను సంతరించుకుంది. -
మారిన ప్రచార ఎజెండా
దేశంలో రెండు కూటములుగా విడిపోయిన పార్టీలు.. సార్వత్రిక సమరాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దేశాన్ని ప్రపంచంలోనే సగర్వంగా నిలుపుతామని, అయోధ్యలో రామ మందిరం నిర్మించామని ఎన్డీయే.. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంక్షేమం తమ ప్రాధాన్యాంశాలని ఇండియా కూటమి తొలుత ప్రచారాస్త్రాలుగా చేసుకున్నాయి. -
తొలిసారే లోక్సభ బరి.. విజయంపై గురి
మొదటిసారిగా ఎన్నికల బరిలోకి.. అదీ నేరుగా లోక్సభ అభ్యర్థిగా పోటీకి దిగిన పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి ఇలా తొలిసారి 15 మంది బరిలోకి దిగారు. -
హైదరాబాద్కా ‘షాన్’ ఎవరో?!
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, ఫలక్నుమా ప్యాలెస్ లాంటి పర్యాటక ప్రాంతాలు, ఉస్మానియా ఆసుపత్రి లాంటి చారిత్రక ప్రదేశాలకు నెలవిది. -
‘సేన’ల మోహరింపు
-
‘గ్రేటర్’లో హోరా హోరీ
రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో హోరాహోరీ నెలకొంది. త్రిముఖ పోటీ వాతావరణం నెలకొన్నా ఒక స్థానంలో మినహా మిగిలిన మూడు చోట్ల ముఖాముఖి పోరుగానే ఉంది. -
దక్షిణాన దూకుడెవరిదో?
దక్షిణ తెలంగాణలో ఈసారి త్రిముఖపోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించిన కాంగ్రెస్.. లోక్సభ సమరంలో అదే జోరు కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. -
ఉద్యమాల ఖిల్లాలో ఆశీర్వాదం ఎవరికో?
ఉత్తర తెలంగాణ... ఉద్యమాల ఖిల్లా. ఎన్నెన్నో పోరాటాలు పురుడు పోసుకున్న నేల. రాజకీయ చైతన్య కేంద్రం. ఎందరో ఉద్దండులను దేశానికి అందించిన ప్రాంతం. -
కరీం‘నగారా’ మోగించేదెవరో!?
శాతవాహనులు ఏలిన ఎలగందుల నేల.. దక్షిణకాశీ వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రం కొలువుదీరిన భూమి.. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నేతన్నల ఇలాకా.. మానేరు గలగలలను ఒడిసిపట్టిన ప్రాంతం.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, జ్ఞానపీఠ్ పురస్కారగ్రహీత సినారెల జన్మస్థలం.. కరీంనగర్ లోక్సభ స్థానం. -
ఆ ప్రధానుల ప్రత్యేకత మోదీకి అందేనా!
దేశ రాజకీయ చరిత్రలో మాజీ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్బిహారీ వాజ్పేయీలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ముగ్గురూ కనీసం మూడుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు.
తాజా వార్తలు
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన
-
మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే
-
రీడర్స్ డైజెస్ట్.. యూకేలో ముగిసిన 86 ఏళ్ల ప్రయాణం
-
చైనా సైబర్ ముఠా చేతిలో ఏపీ వాసులు.. ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల మోసం
-
బెంగళూరు vs చెన్నై: వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?