ఉన్నాయా కళ్లు.. ఏంచేశారు.. ఐదేళ్లు?
నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీల ప్రభుత్వమని సీఎం జగన్ గొప్పలు చెబుతారు. అలాంటి ఆర్భాటపు ముఖ్యమంత్రి నోరు మూయించే చిత్రమిది.
ఈనాడు, అనంతపురం, న్యూస్టుడే, కదిరి: నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీల ప్రభుత్వమని సీఎం జగన్ గొప్పలు చెబుతారు. అలాంటి ఆర్భాటపు ముఖ్యమంత్రి నోరు మూయించే చిత్రమిది. చిన్నపాటి పనులతో అందుబాటులోకి వచ్చే ముస్లిం మైనారిటీ గురుకుల కళాశాల భవనాన్ని అక్షరాలా ఐదేళ్లు కన్నెత్తి చూడకుండా వదిలేసి శిథిలావస్థకు చేర్చిన వైనం.. మైనారిటీల మీద ఎంత ప్రేముందో చెప్పకనే చెబుతుంది. కదిరి నియోజకవర్గం పరిధిలో ముస్లింల జనాభా అధికంగా ఉండటంతో వారి కోసం గురుకుల కళాశాల అవసరం ఉందని గత తెదేపా ప్రభుత్వం గుర్తించింది. కదిరి శివారు లో రూ.15 కోట్లతో గురుకుల భవన నిర్మాణం చేపట్టి.. 95 శాతం పనులు పూర్తి చేసింది. రంగులు కూడా సిద్ధం చేశారు. 2019లో ఎన్నికలు రావటంతో చిన్నపాటి పనులు ఆగాయి. భవన సముదాయంలో విద్యుత్తు, తాగునీటి సౌకర్యం కల్పించాల్సి ఉంది. జగన్ ప్రభుత్వం రాగానే భవనానికి సంబంధించిన పనులు ఆపేసింది. నాటి నుంచి నేటి వరకు కదిరి-హిందూపురం రహదారి పక్కనే నిరుపయోగంగా ఉంది. వైకాపా తీరుపై వందలాది విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రజాధనానికి సార్థకత ఏదని ప్రశ్నిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాకరేపుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
[ 01-06-2024]
సార్వత్రిక ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థుల్లో ఆందోళన, ఉత్కంఠకు తెర లేచింది. గెలుపోటములపై లెక్కలు వేసుకోవడంలో తలమునకలయ్యారు. -
నిఘా నీడలో తాడిపత్రి
[ 01-06-2024]
తాడిపత్రిలో ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలను దృష్టిలో ఉంచుకొని ఇరు పార్టీల నాయకుల ఇళ్ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. -
కౌంటింగ్ వేళ.. భద్రత కట్టుదిట్టం
[ 01-06-2024]
కౌంటింగ్ ప్రశాంతంగా సజావుగా జరిగేలా కట్టుదిట్ట భద్రతా చర్యలు చేపట్టామని నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గౌతమి శాలి హెచ్చరించారు. -
మళ్లీ పింఛను ఇబ్బందులు తప్పవా?
[ 01-06-2024]
పింఛన్ లబ్ధిదారులకు జూన్లోనూ కష్టాలు తప్పేలా లేవు. రెండు రోజుల నుంచి ఎండలు తీవ్రం అయ్యాయి. -
వచ్చేది మా పార్టీయే.. తెదేపా కార్యకర్తలను చంపుతా
[ 01-06-2024]
మళ్లీ వచ్చేది మా పార్టీనే.. తెదేపా కార్యకర్తలను చంపుతా అంటూ ఓ వైకాపా కార్యకర్త మద్యం మత్తులో వేటకొడవలితో వీరంగం సృష్టించాడు. -
కబ్జాలు కనిపించవా..?
[ 01-06-2024]
మున్సిపల్ స్థలాల ఆక్రమణపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. రూ.కోట్లు విలువ చేసే స్థలాలు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోవడం లేదు. -
4 మార్కులు లెక్కించడం మరిచారు!
[ 01-06-2024]
పదో తరగతి పరీక్షల మూల్యాంకనంలో పొరపాట్లు చోటు చేసుకొన్నాయి. అనంతపురం నగరానికి చెందిన విద్యార్థిని షేక్. -
దళిత మహిళ భూమి వైకాపా నాయకుడి పేరున మార్పు
[ 01-06-2024]
మండలంలోని పందిపర్తికి చెందిన పేద దళిత మహిళ గంగరత్న పేరుతో ఉన్న 3.81 ఎకరాల అసైన్డ్ భూమిని వైకాపా నాయకుడు సజ్జారెడ్డి పేరున ఎలా రికార్డులు మార్చారని తహసీల్దార్ అంజనాదేవిని దళిత నాయకులు నిలదీశారు. -
నిక్కచ్చిగా పనిచేస్తే ముచ్చెమటలెందుకు?
[ 01-06-2024]
ఐదేళ్లపాటు పోలీసులను, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి.. ఇప్పుడు పోలీసులు, ఎన్నికల కమిషన్ నిక్కచ్చిగా, నిజాయితీగా పని చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. -
ఎరవేసి.. హతమార్చారు
[ 01-06-2024]
ఎన్ఎస్యూఐ జాతీయ కార్యదర్శి, న్యాయవాది సంపత్కుమార్ హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. -
తొలి ఫలితం.. పుట్టపర్తి, మడకశిర
[ 01-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కేవలం మూడు రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో హిందూపురం పార్లమెంటు స్థానంతో పాటు ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లు లెక్కించనున్నారు. -
కుళాయిల్లో గరళం!
[ 01-06-2024]
జీవకోటికి జలమే ప్రాణాధారం. పట్టణాల్లో తాగునీటి సరఫరా నిర్వహణలో మున్సిపల్ యంత్రాంగంలో నిర్లక్ష్యం ఆవహించింది. జిల్లాలోని కదిరి, పుట్టపర్తి, ధర్మవరం పట్టణాలకు చిత్రావతి రిజర్వాయరు నుంచి నీటి సరఫరా చేస్తున్నారు. -
రైతు ఆత్మహత్యల పాపం జగన్ సర్కారుదే
[ 01-06-2024]
రాష్ట్రలో రైతన్నల ఆత్మహత్యల పాపం జగన్ సర్కారుదేనని ధర్మవరం భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు.
తాజా వార్తలు (Latest News)
-
పుట్టెడు దుఃఖంలోనూ.. ‘ఓటు’ బాధ్యత మరవలేదు
-
40 శాతం కమీషన్ కేసులో సిద్దరామయ్య, డీకే శివకుమార్లకు బెయిల్
-
ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు చల్లని కబురు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
బెయిల్పై కేజ్రీవాల్కు దక్కని ఊరట.. రేపు తిరిగి జైలుకు
-
లైంగిక దౌర్జన్యం కేసు.. పరారీలో ప్రజ్వల్ రేవణ్ణ తల్లి..!