ఎన్నికల ముందు అధికారిక తాయిలాలు
ఎన్నికల ముందు గ్రామాల్లోని వైకాపా నాయకులకు జగన్ ప్రభుత్వం అధికారిక తాయిలాలు గుమ్మరిస్తోంది.
ఒకేరోజు రూ.36 కోట్లు ‘ఉపాధి’ బిల్లులు విడుదల
వైకాపా ప్రభుత్వం కుయుక్తులు
ఈనాడు డిజిటల్, అనంతపురం: ఎన్నికల ముందు గ్రామాల్లోని వైకాపా నాయకులకు జగన్ ప్రభుత్వం అధికారిక తాయిలాలు గుమ్మరిస్తోంది. ఒకే రోజు ఉమ్మడి జిల్లాలో రూ.36 కోట్లు ఉపాధి హమీ పథకం బిల్లుల్ని ఖాతాల్లో జమ చేసింది. రెండు రోజుల్లో మరో రూ.50 కోట్లు విడుదల చేసేందుకు సిద్ధమైంది. అనంత, శ్రీసత్యసాయి జిల్లాల్లో 2022-23, 2023-24 సంవత్సరాలకు సంబంధించి ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్లు అప్లోడ్ చేయాలనే ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండానే ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో బిల్లులు మంజూరు చేయడానికి అధికారులు ఉత్సాహం చూపుతున్నారు. గ్రామాల్లో మెటీరియల్ కాంపొనెంట్ కింద పనులు చేసిన వారిలో వైకాపా సర్పంచులు, నాయకులే ఉన్నారు. ఎన్నికల సమయంలో వారికి పెద్దమొత్తంలో బిల్లులు చెల్లించడం ద్వారా ఓటర్లకు తాయిలాల పంపిణీ మరింత సులభమవుతుందని వైకాపా పెద్దలు ఆలోచిస్తున్నారు. అందుకోసమే హడావుడిగా బిల్లుల్ని చెల్లిస్తున్నారే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఉపాధి పథకం పంచాయతీల్లో మెటీరియల్ కాంపొనెంట్ కింద పనులు చేపడతారు. సీసీ రోడ్లు, సచివాలయ భవనాలతో పాటు పండ్ల తోటల పెంపకం వంటివి నిర్వహిస్తారు. వీటికి సంబంధించి 2022-23 నుంచి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇంతకాలం బిల్లులపై స్పందించని జగన్ ప్రభుత్వం ఎన్నికల ముందు చెల్లించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో వైకాపా తరఫున డబ్బులు పంపిణీ చేయడం కోసమే బిల్లులు చెల్లిస్తున్నారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
పనిచేయరనే భయంతో..
గత ఐదేళ్లలో పెండింగ్ బిల్లుల చెల్లింపుపై జగన్ ప్రభుత్వం శ్రద్ధ చూపలేదు. కేంద్రం విడుదల చేసిన నిధుల్ని అవసరాలకు వాడుకుని తర్వాత ఎప్పుడో చెల్లించేవారు. పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధుల్ని పూర్తిస్థాయిలో దారి మళ్లించడంతో వైకాపా సర్పంచులు సైతం అసంతృప్తితో ఉన్నారు. కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్లులకు జమ చేసుకుంది. ఇతర పథకాలకు నిధుల్ని మళ్లించి పంచాయతీలకు మొండిచేయి చూపుతూ వచ్చింది. ఉమ్మడి జిల్లాలో సుమారు రూ.300 కోట్లు పంచాయతీ నిధుల్ని దారి మళ్లించారు. బిల్లులు రాక అప్పుల పాలై గ్రామాలను వదిలేసిన వైకాపా సర్పంచులు ఉమ్మడి జిల్లాలో చాలామంది ఉన్నారు. ఇంతకాలం సర్పంచులను, స్థానిక నాయకుల్ని గాలికొదిలేయడంతో వారంతా ఎన్నికల్లో పనిచేయబోమంటూ తేల్చి చెబుతున్నారు. దీంతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి బిల్లులకు ఆఘమేఘాలపై ఆమోదం తెలిపి ఖాతాల్లో జమ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాకరేపుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
[ 01-06-2024]
సార్వత్రిక ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థుల్లో ఆందోళన, ఉత్కంఠకు తెర లేచింది. గెలుపోటములపై లెక్కలు వేసుకోవడంలో తలమునకలయ్యారు. -
నిఘా నీడలో తాడిపత్రి
[ 01-06-2024]
తాడిపత్రిలో ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలను దృష్టిలో ఉంచుకొని ఇరు పార్టీల నాయకుల ఇళ్ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. -
కౌంటింగ్ వేళ.. భద్రత కట్టుదిట్టం
[ 01-06-2024]
కౌంటింగ్ ప్రశాంతంగా సజావుగా జరిగేలా కట్టుదిట్ట భద్రతా చర్యలు చేపట్టామని నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గౌతమి శాలి హెచ్చరించారు. -
మళ్లీ పింఛను ఇబ్బందులు తప్పవా?
[ 01-06-2024]
పింఛన్ లబ్ధిదారులకు జూన్లోనూ కష్టాలు తప్పేలా లేవు. రెండు రోజుల నుంచి ఎండలు తీవ్రం అయ్యాయి. -
వచ్చేది మా పార్టీయే.. తెదేపా కార్యకర్తలను చంపుతా
[ 01-06-2024]
మళ్లీ వచ్చేది మా పార్టీనే.. తెదేపా కార్యకర్తలను చంపుతా అంటూ ఓ వైకాపా కార్యకర్త మద్యం మత్తులో వేటకొడవలితో వీరంగం సృష్టించాడు. -
కబ్జాలు కనిపించవా..?
[ 01-06-2024]
మున్సిపల్ స్థలాల ఆక్రమణపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. రూ.కోట్లు విలువ చేసే స్థలాలు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోవడం లేదు. -
4 మార్కులు లెక్కించడం మరిచారు!
[ 01-06-2024]
పదో తరగతి పరీక్షల మూల్యాంకనంలో పొరపాట్లు చోటు చేసుకొన్నాయి. అనంతపురం నగరానికి చెందిన విద్యార్థిని షేక్. -
దళిత మహిళ భూమి వైకాపా నాయకుడి పేరున మార్పు
[ 01-06-2024]
మండలంలోని పందిపర్తికి చెందిన పేద దళిత మహిళ గంగరత్న పేరుతో ఉన్న 3.81 ఎకరాల అసైన్డ్ భూమిని వైకాపా నాయకుడు సజ్జారెడ్డి పేరున ఎలా రికార్డులు మార్చారని తహసీల్దార్ అంజనాదేవిని దళిత నాయకులు నిలదీశారు. -
నిక్కచ్చిగా పనిచేస్తే ముచ్చెమటలెందుకు?
[ 01-06-2024]
ఐదేళ్లపాటు పోలీసులను, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి.. ఇప్పుడు పోలీసులు, ఎన్నికల కమిషన్ నిక్కచ్చిగా, నిజాయితీగా పని చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. -
ఎరవేసి.. హతమార్చారు
[ 01-06-2024]
ఎన్ఎస్యూఐ జాతీయ కార్యదర్శి, న్యాయవాది సంపత్కుమార్ హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. -
తొలి ఫలితం.. పుట్టపర్తి, మడకశిర
[ 01-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కేవలం మూడు రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో హిందూపురం పార్లమెంటు స్థానంతో పాటు ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లు లెక్కించనున్నారు. -
కుళాయిల్లో గరళం!
[ 01-06-2024]
జీవకోటికి జలమే ప్రాణాధారం. పట్టణాల్లో తాగునీటి సరఫరా నిర్వహణలో మున్సిపల్ యంత్రాంగంలో నిర్లక్ష్యం ఆవహించింది. జిల్లాలోని కదిరి, పుట్టపర్తి, ధర్మవరం పట్టణాలకు చిత్రావతి రిజర్వాయరు నుంచి నీటి సరఫరా చేస్తున్నారు. -
రైతు ఆత్మహత్యల పాపం జగన్ సర్కారుదే
[ 01-06-2024]
రాష్ట్రలో రైతన్నల ఆత్మహత్యల పాపం జగన్ సర్కారుదేనని ధర్మవరం భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా శ్రేణుల్లో జోష్.. గన్నవరంలో చంద్రబాబుకు ఘన స్వాగతం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రోహిత్తో కలిసి ఓపెనింగ్.. నిరాశపరిచిన శాంసన్
-
పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైకాపాకు ఎదురుదెబ్బ
-
మేలో జీఎస్టీ వసూళ్లు రూ.1.73 లక్షల కోట్లు..
-
వాట్సప్లో ట్రేడింగ్ పేరుతో.. వ్యాపారి నుంచి రూ.9 కోట్లు స్వాహా