పొద్దంతా తిప్పారు.. పొద్దుపోయాక పంచారు
పింఛనుదారుల్లో కొందరికి ఇంటి వద్ద పంపిణీ చేసేందుకు సచివాలయ సిబ్బంది ఖాతాల్లో ఏప్రిల్ 30నే రూ.22.26 కోట్లు వేశారు. వీరు అదేరోజు నగదు డ్రా చేసి..
పండు టాకులపై జగన్ సర్కారు కక్ష
ఉదయం నుంచే పింఛనుదారుల నిరీక్షణ
బుధవారం సాయంత్రానికి ఖాతాల్లో జమ
హడావుడిగా బ్యాంకు మిత్రలతో పంపిణీ
జన్నావాళ్లమిట్టలో పింఛను పంపిణీ చేస్తున్న బ్యాంకుమిత్రలు
- పింఛను ఎప్పుడిస్తారో తెలియక, సరైన సమాధానం చెప్పేవారు లేక బుధవారం ఉదయమే పెనుమూరులోని సచివాలయం వద్దకు పలువురు వృద్ధులు, దివ్యాంగులు చేరుకుని నిరీక్షించారు.
- పింఛను బ్యాంకు ఖాతాలో జమ చేస్తారన్న సమాచారంతో బ్యాంకులకు సెలవని తెలియక పుంగనూరు స్టేట్ బ్యాంకు వద్ద పలువురు పింఛనుదారులు బుధవారం ఉదయం నిరీక్షించారు.
- కుప్పంలో సచివాలయం వద్ద వృద్ధులు పడిగాపులు కాశారు. సిబ్బంది వచ్చాక బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారని, ఖాతాలు లేని వారికి ఇంటి వద్దనే ఇస్తారనడంతో వారు వెనుదిరిగారు.
- యాదమరి మండలం కాశిరాళ్ల సప్తగిరి గ్రామీణ బ్యాంకులో పింఛను సొమ్ము జమ చేయడంతో, బ్యాంకుకు సెలవు ఉన్నా వెంటనే పంపిణీ చేయాలని అధికారులు ఆదేశించడంతో బ్యాంకుమిత్రలు నగదు తీసుకుని గ్రామాల్లో ఆధార్, బయోమెట్రిక్ విధానంతో పంపిణీ చేశారు.
పింఛన్ల పంపిణీలో విధానం మారినా వైకాపా ప్రభుత్వ తీరు మాత్రం మారలేదు.. ఎలాగోలా పింఛన్లు ఆలస్యం చేసి ఆ అపవాదును ప్రతిపక్షాలపై నెట్టాలనే కుట్రతో ఈ ప్రక్రియలను ప్రభుత్వం నానాటికీ ఆలస్యం చేస్తోంది.. గత నెల గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ చేసి మండుటెండలో అవ్వాతాతలు, దివ్యాంగులను అష్టకష్టాలు పెట్టిన వైకాపా సర్కారు.. ఇప్పుడు వారి కష్టాన్ని మరింత రెట్టింపు చేసింది.
చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్టుడే:పింఛనుదారుల్లో కొందరికి ఇంటి వద్ద పంపిణీ చేసేందుకు సచివాలయ సిబ్బంది ఖాతాల్లో ఏప్రిల్ 30నే రూ.22.26 కోట్లు వేశారు. వీరు అదేరోజు నగదు డ్రా చేసి.. బుధవారం జిల్లాలో 63,500 మందికి (80 శాతం) పంపిణీ చేశారు. పింఛన్దారుల బ్యాంకు ఖాతాల్లో బుధవారం సాయంత్రానికి నగదు జమ చేయడం గమనార్హం. ఈ క్రమంలో ఉన్నపళంగా బ్యాంకుమిత్రలను గ్రామాలకు పంపిణీ ఖాతాల్లోని పింఛను, ఆధార్ సంఖ్య నమోదు చేసి, బయోమెట్రిక్ విధానంతో హడావుడిగా నగదు పంపిణీ చేశారు. ఈ విషయం తెలియక బుధవారం ఉదయం నుంచే పలువురు వృద్ధులు, దివ్యాంగులు సచివాలయాలకు వెళ్లారు. నగదు బ్యాంకు ఖాతాల్లోకే జమవుతుందని సిబ్బంది చెప్పడంతో నిరాశగా వెనుదిరిగారు.
నడవలేని తనకెందుకు ఇవ్వరు
ఈమెను చూస్తేచాలు బ్యాంకుకు వెళ్లి పింఛను సొమ్ము తెచ్చుకునే స్థితిలో ఉందో లేదో తెలుస్తుంది. ఐరాల మండలం ఇరువారం గ్రామానికి చెందిన సరోజ వృద్ధాప్య పింఛను కోసం గ్రామంలోని సచివాలయం వద్దకు కష్టపడి వెళ్తే బ్యాంకులో వేశామని తెలిపారు. దీంతో ఆమె తనకు బ్యాంకు బుక్ లేదని, బ్యాంకులో వేస్తే ఎలా తెచ్చుకోవాలని రోదించింది.
సచివాలయాలకు పరుగులు
బైరెడ్డిపల్లె, న్యూస్టుడే: పింఛను నగదు కోసం వృద్ధులు, వితంతువులకు అవస్థలు తప్పలేదు. లబ్ధిదారులు స్థానిక సచివాలయాల వద్దకు బుధవారం పరుగులు తీశారు. కార్యాలయం తెరవకముందే సచివాలయాల వద్దకు వృద్ధులు చేరుకున్నారు. వారిని వెనక్కి పంపకుండా పింఛన్లు ఇచ్చామని చప్పిడిపల్లె, లక్కనపల్లె సచివాలయ ఉద్యోగులు సమాధానమిచ్చారు. బ్యాంకు ఖాతాలు కల్గిన లబ్ధిదారులు కూడా సచివాలయానికి రావడంతో వారి పేర్లు జాబితాలో లేకపోవడంతో మీరు బ్యాంకుకెళ్లి పింఛను తీసుకోవాలని వెనక్కి పంపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
16న శ్రీ భోగశ్రీనివాసుడికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం
[ 15-06-2024]
జూన్ 16వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలోని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం జరగనుంది. -
రెస్కో.. అవినీతి చూస్కో
[ 15-06-2024]
త్రిరాష్ట్ర కూడలి ప్రాంతమైన కుప్పం, సమీప మండలాల్లో నాణ్యమైన విద్యుత్తు నిరంతర సరఫరా కోసం పనిచేస్తున్న కుప్పం గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (రెస్కో) వైకాపా ప్రభుత్వ హయాంలో అవినీతికి కేరాఫ్గా మారింది. -
భూహక్కు.. సమస్యల చిక్కు
[ 15-06-2024]
చిగురుపాడుకి చెందిన కాటూరు సుబ్రహ్మణ్యం పదేళ్ల కిందట మరణించారు. ఆయనకు 1.92 ఎకరాలు భూమి ఉంది. ఆయన పేరుతోనే ఎల్పీ నంబరు కేటాయించి పట్టాదారు, అనుభవదారుగా 98 సెంట్లు ఉన్నట్లు నమోదు చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ యాక్టు రద్దు హర్షణీయం
[ 15-06-2024]
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేయడంపై చిత్తూరు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అశోక్ ఆనంద్ యాదవ్, న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. -
సగం పాఠశాలల్లో గుడ్డు పెట్టలేదు
[ 15-06-2024]
పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందజేస్తున్నారు అందులో 1,200 పాఠశాలల్లో కోడిగుడ్డు పంపిణీ చేయగా 1,248చోట్ల గత రెండు రోజులుగా విద్యార్థులకు అందజేయలేదు. -
అనధికార తట్టలు, హ్యాకర్ లైసెన్సులు
[ 15-06-2024]
తిరుమలలో తరతరాలుగా ఉంటున్న ప్రజలకు ఉపాధి కల్పించేందుకు గతంలో తితిదే తట్టలు, హ్యాకర్ లైసెన్సులు, దుకాణాలు కేటాయించింది. -
అన్నదాత దరిచేరని విజ్ఞానం
[ 15-06-2024]
అన్నదాతకు వ్యవసాయంలో నూతన మెలకువలు నేర్పించి తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడి సాధించే స్థాయికి తెచ్చేందుకు వ్యవసాయ శాఖ పొలంబడి కార్యక్రమం రూపొందించింది. -
సర్వదర్శనానికి 18 గంటలు
[ 15-06-2024]
శ్రీవారి సర్వదర్శనానికి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా శుక్రవారం సాయంత్రానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లో వేచి ఉన్నారు -
పరిశ్రమించేందుకు మరో అవకాశం
[ 15-06-2024]
పారిశ్రామిక వాడల్లో మౌలిక వసతుల పనుల్లో కదలిక రానుంది. గత తెదేపా హయాంలో సాగి మధ్యలో వైకాపా సర్కార్ ఆపేసిన చెన్నై-విశాఖ పారిశ్రామిక నడవా(వీసీఐసీ) ప్రాజెక్టుల్లో ట్రెంచ్-1 పనులు గడవు పెంచారు. -
పుట్టినరోజు వేడుకలకు వెళ్తూ..
[ 15-06-2024]
స్నేహితుడి పుట్టినరోజే ఆ ముగ్గురు స్నేహితులకు జీవితంలో చివరి రోజైంది.. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలను ఘనంగా చేయాలని కేకు తీసుకుని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఆ ముగ్గురిని ఐచర్ వాహనం మృత్యు రూపంలో వచ్చి బలిగొంది.. -
గణనాథుడి సేవలో సినీ నటుడు సాయి ధరమ్ తేజ్
[ 15-06-2024]
శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారిని సినీ హీరో సాయిధరమ్తేజ్ శుక్రవారం దర్శించుకున్నారు. -
విలీనంతో సరిపెట్టారు
[ 15-06-2024]
వైకాపా ప్రభుత్వంలో పలు గ్రామాలను సమీప పురపాలక సంఘాల్లో, నగరపాలక సంస్థల్లో ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా విలీనం చేశారు. -
ఎస్వీయూలో బోధనేతర ఉద్యోగుల అల్టిమేటం
[ 15-06-2024]
ఎస్వీయూలోని బోధనేతర ఉద్యోగ సంఘం ఎన్నికలను వాయిదా వేస్తూ ఏకపక్ష నిర్ణయాలు, కక్ష సాధింపులకు ఊతం ఇచ్చేలా వర్సిటీ అధికారులు వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు ఆక్రోశం వెల్లగక్కుతున్నారు. -
సిరి సంత.. సేంద్రియం చెంత
[ 15-06-2024]
మాది చిత్తూరు జిల్లా పలమనేరు. మిత్ర చిరుధాన్యాల ఉత్పత్తుల పేరుతో ఏళ్లుగా విక్రయాలు సాగిస్తున్నాం. ప్రస్తుతం 65 రకాల చిరుధాన్యాల ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నాం -
ఎస్పీసీహెచ్లో గుండెమార్పిడి శస్త్రచికిత్స
[ 15-06-2024]
శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో మరో గుండె మార్పిడి శస్త్రచికిత్సను శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి పూర్తి.. త్వరలో చుక్ చుక్ పరుగులు!
-
‘కాలర్ ఐడీ’పై ట్రయల్స్ మొదలు పెట్టిన టెలికాం కంపెనీలు
-
రాష్ట్రం కోసం నీతీశ్ ఏమి చేస్తున్నారు: ప్రశాంత్ కిషోర్
-
విఘ్నేశ్తో గొడవపై స్పందించిన విజయ్ సేతుపతి.. ఏమన్నారంటే
-
తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీ..
-
లోటస్ పాండ్ వద్ద అక్రమ నిర్మాణాలు తొలగింపు