సీలు వేశాం.. కానీ ఊడిపోయింది..!
‘గృహ ఓటింగ్’లో సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం
బ్యాలట్ బాక్సుకు సీలు వేయని వైనం
తహసీల్దారు శ్రీనివాసులు, సిబ్బందిని నిలదీస్తున్న తెదేపా నాయకులు, గ్రామస్థులు
లేమల్లెపాడు(వట్టిచెరుకూరు), కలెక్టరేట్, న్యూస్టుడే: ‘గృహ ఓటింగ్’ ప్రక్రియ నిర్వహణలో ఎన్నికల సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వట్టిచెరుకూరు మండలంలోని లేమల్లెపాడులో శనివారం ‘గృహ ఓటింగ్’ ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలింగ్ సిబ్బంది బ్యాలట్ బాక్స్కు సీలు వేయకపోవడం విమర్శలకు తావిచ్చింది. గ్రామానికి చెందిన మద్దినేని సింగయ్యతో ఓటు వేయించేందుకు మధ్యాహ్నం సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ఆ సమయంలో బ్యాలట్ బాక్స్కు సీలు లేకపోవడాన్ని గమనించిన తెదేపా ఏజెంట్లు అధికారులను నిలదీశారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోలింగ్ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. సాయంత్రం ఆర్వో శ్రీకర్, తహసీల్దారు శ్రీనివాసులు గ్రామానికి చేరుకుని సీలు వేయకపోవడంపై సిబ్బందిని ప్రశ్నించారు. తొలుత సీలు వేశామని.. అది ఊడిపోయిందని వివరణ ఇచ్చారు. అనంతరం బ్యాలట్ బాక్స్కు సీలు వేసిన తర్వాత ఓటింగ్ మళ్లీ మొదలైంది. మేనల్లుడు బొమ్మినేని భాస్కరరావు సాయంతో సింగయ్య ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండలంలోని అనంతవరప్పాడులో ఏడు, లేమల్లెపాడులో ఐదు ఓట్లు పోలైనట్లు అధికారులు వెల్లడించారు.
సీలు వేస్తున్న సిబ్బంది
అభ్యర్థుల అభ్యంతరం: ఇంటి నుంచి ఓటరు సేకరణ ప్రక్రియలో అధికారులే నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని గుంటూరు ఎంపీ తెదేపా అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి బుర్ల రామాంజనేయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కలెక్టరేట్లోని ఛాంబర్లో కలెక్టర్ని శనివారం కలిసి కనీసం ఓట్లను సేకరిస్తున్న బాక్సులకు సీల్ వేయలేదని వివరించారు. లేమల్లెపాడు ఘటనపై అధికారులను నివేదిక ఇవ్వాలని కలెక్టర్ కోరారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడే ప్రదక్షిణలు మొదలెట్టేశారు!
[ 18-06-2024]
సార్వత్రిక ఎన్నికల విధుల్లో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఎంపీడీవోలు, తహసీల్దార్లు, జిల్లా అధికారులు బదిలీపై వెళ్లారు -
వైకాపా కౌన్సిలర్ అరెస్టు
[ 18-06-2024]
కత్తులతో బెదిరించి ఆర్ఎంపీ ఆస్తి రాయించుకున్న కేసులో తెనాలి పట్టణ 33వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ మొఘల్రహమత్బేగ్ అలియాస్ మొఘల్అహ్మద్, అతని సోదరుడు ఫయాజ్బేగ్, బంధువు జాన్సైదాలను మూడో పట్టణ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. -
అక్షర యోధుడు రామోజీ
[ 18-06-2024]
రామోజీ గ్రూపు సంస్థల అధినేత, ‘పద్మవిభూషణ్’ చెరుకూరి రామోజీరావు పేదల పక్షాన పోరాడిన అక్షర యోధుడని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు అన్నారు. -
కోడెలపై పెట్టిన కేసు జగన్కు వర్తించదా?: ఎమ్మెల్యే జీవీ
[ 18-06-2024]
జగన్ నియంత మనస్తత్వానికి నిదర్శనం విశాఖ రుషికొండ ప్యాలెస్ నిర్మాణామని.. తాను నివాసం ఉండేందుకు ప్రజల సొమ్ము రూ.500 కోట్లు ఖర్చు చేశారని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు -
పర్యాటకులనూ వదలని సైబర్ నేరగాళ్లు
[ 18-06-2024]
సూర్యలంకలో పర్యాటక శాఖ బీచ్ రిసార్ట్స్ పేరుతో నకిలీ వెబ్సైట్ తెరిచి గదులు బుక్ చేసుకునే పర్యాటకులను మోసగించి రూ.వేల నగదు తమ బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయించుకుంటున్న సైబర్ నేరగాళ్ల ఉదంతమిది. -
నగరాభివృద్ధికి ప్రణాళికలు
[ 18-06-2024]
నగరాభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నగరపాలక వర్గాలను ఆదేశించారు -
ఆలకిస్తే వరం.. అన్నదాతకు ఫలం
[ 18-06-2024]
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేయాలనుకున్న ప్రయోగశాలకు బాలారిష్టాలు తప్పడం లేదు. భవనాల నిర్మాణం పూర్తయి స్వాధీనం చేసుకోవడంలో అంతులేని జాప్యం జరుగుతోంది. -
నేనున్నాను.. ఆదుకుంటాను
[ 18-06-2024]
మీ సమస్యను నేను పరిష్కరిస్తాను.. ఆదుకుంటాను’ అని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రజలకు భరోసా ఇచ్చారు. -
వైద్యం.. దైన్యం..
[ 18-06-2024]
ఓ రోగి తీవ్రమైన గుండెనొప్పితో ఆదివారం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఆయన్ను వైద్యులు పరిశీలించి యాంజియోగ్రామ్ చేయించుకోవాలని సూచించారు -
ప్రపంచ స్కేటింగ్లో మెరిసిన తెలుగుతేజం
[ 18-06-2024]
ప్రపంచ స్కేటింగ్ పోటీల్లో తెలుగు తేజం మాత్రపు జెస్సీరాజ్(13) సత్తా చాటి పసిడి పతకంతో మెరిసింది. -
పుట్టగొడుగుల్లా అక్రమ కట్టడాలు
[ 18-06-2024]
ఈ చిత్రంలో కనిపిస్తున్న భారీ వాణిజ్య సముదాయం బాపట్ల సూర్యలంక రోడ్లో నిర్మితమవుతోంది. -
నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తాం: మంత్రి గొట్టిపాటి
[ 18-06-2024]
రాష్ట్రంలో వైకాపా పరిపాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని, ప్రధానంగా సాగునీటి వనరుల్ని ఏమాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు -
కుళాయిల్లో కలుషిత నీరు
[ 18-06-2024]
గుండ్లకమ్మ జలాశయంలో నీటి మట్టం పూర్తిగా పడిపోవడంతో కొరిశపాడు, జె.పంగులూరు మండలాల్లోని 21 గ్రామాలకు తాగు నీరు అందించే రాచపూడి నీటి పథకంపై ఆ ప్రభావం పడింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టేజీ మధ్యలో బిగుసుకుపోయిన బైడెన్.. చేయందించి బయటకు తీసుకెళ్లిన ఒబామా!
-
సూపర్-8.. భారత్కు ‘గండం’ ఆ ఒక్కటే..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
విశాఖలో జరిగిన ఆ కిడ్నాప్.. ఇప్పటికీ ఓ మిస్టరీ!
-
అమెరికాను కలసికట్టుగా ఎదుర్కొంటాం.. కిమ్తో భేటీకి ముందు పుతిన్
-
భవారియా గ్యాంగ్ బరితెగింపు.. పోలీసులకు అంతర్రాష్ట్ర ముఠా సవాల్