ట్రాఫిక్ చిక్కులు.. ఛార్జింగ్కు తిప్పలు
నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్తో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల శక్తినంతటినీ ఈ రద్దీ పీల్చేస్తోంది.
నగరంలో ఎలక్ట్రిక్ బస్సులకు ఎదురవుతున్న సవాలు
జూన్ నెలాఖరులోగా మరో 28 వాహనాలు
ఈనాడు, హైదరాబాద్
నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్తో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల శక్తినంతటినీ ఈ రద్దీ పీల్చేస్తోంది. విద్యుత్ స్కూటీలు, కార్లు, బస్సులు ఇలా ప్రతి ఒక్క వాహనంలో ఈ సమస్య ఏర్పడుతోంది. ఛార్జింగ్ చేసిన అనంతరం ఎక్కువ దూరం ప్రయాణిస్తే తిరుగు ప్రయాణంలో మధ్యలోనే ఆగిపోతున్న సందర్భాలున్నాయని వాహనదారులు వాపోతున్నారు. ఆర్టీసీని సైతం ఈ సమస్య వెంటాడుతోంది. ఇటీవలే 10 ఇ-గరుడ బస్సులను విజయవాడకు నడపడం ప్రారంభించారు. ట్రాఫిక్ రద్దీని దాటుకుని అక్కడికి చేరుకునే క్రమంలో రెండుసార్లు ఛార్జింగ్ చేయాల్సి వస్తోంది. దీనిపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. జూన్ నెలాఖరులో కంటోన్మెంట్ నుంచి 28 సిటీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ట్రాఫిక్ సవాళ్లను ఎదుర్కొంటూ కేవలం రెండు ఛార్జింగ్ స్టేషన్లున్న నగరంలో వీటిని నడిపేదెలా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్టీసీ హైదరాబాద్ నుంచి విజయవాడకు 10 ఎలక్ట్రిక్ గరుడ బస్సులను నడుపుతోంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 300 కిలోమీటర్లు ప్రయాణిస్తాయని ప్రకటించినా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. మియాపూర్లో ఛార్జింగ్ పెట్టిన తర్వాత 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎంజీబీఎస్కు, అక్కడి నుంచి మరిన్ని ట్రాఫిక్ కూడళ్లు దాటి చౌటుప్పల్ చేరుకునే సరికి 60-70 శాతం ఛార్జింగ్ అయిపోతోంది. దీంతో సూర్యాపేటలో ఛార్జింగ్ చేస్తున్నారు. ఏడాది చివరికల్లా 570కి పైగా విద్యుత్ బస్సులు తీసుకురావాలన్న ప్రణాళికలతో ముందుకెళ్తున్న ఆర్టీసీ ‘రీఛార్జింగ్’ సమస్యలను ఎలా ఎదుర్కొంటుందో. ప్రధానంగా రద్దీగా ఉండే నగరంలో ఈ సమస్యలు పరిష్కరించాలి. పైగా మియాపూర్ డిపో-2, కంటోన్మెంట్లో రెండే ఛార్జింగ్ స్టేషన్ యూనిట్లు ఉండటం నిర్వహణ సాధ్యమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో మొత్తం 350 కూడళ్లున్నాయి. అందులో 100 జంక్షన్లు నిత్యం రద్దీగా ఉంటాయి. ఇక వర్షాకాలంలో ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గవర్నర్ను కలిసిన సీఎం రేవంత్.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం..
[ 01-06-2024]
గవర్నర్ సీపీ రాధాకృష్ణన్తో రాజ్భవన్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. -
పదేళ్ల ప్రగతి.. విశ్వనగర ఖ్యాతి
[ 01-06-2024]
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిలూదిన హైదరాబాద్ గడ్డ స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో పరుగులు పెట్టింది. నాలుగు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన భాగ్యనగరి అభివృద్ధిలో దశాబ్దకాలం పెద్దది కాకపోయినా.. ఈ పదేళ్లలో చారిత్రక నగరికి మరిన్ని సొబగులు జతకూరాయి. విశ్వనగరికి అడుగులు పడ్డాయి. -
గంధంగూడ భూములపై ఆర్డీవో నివేదిక బుట్టదాఖలు
[ 01-06-2024]
హైదరాబాద్ శివారులోని గంధంగూడలో రూ.500 కోట్ల విలువైన ప్రభుత్వ భూముల ఆక్రమణ వ్యవహారంలో తవ్వేకొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎనభై రెండేళ్లుగా అది సర్కారు భూమేనని.. ప్రజాప్రయోజనాలకు కేటాయిద్దామని.. -
జంట నగరాలకు.. 240 టేబుళ్లు
[ 01-06-2024]
జంటనగరాల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. ఎన్ని టేబుళ్లపై ఓట్లను లెక్కించాలి, ఎంత మంది సిబ్బంది అవసరం, వారికి శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భద్రత, ఇతరత్రా అంశాలపై అధికారుల కసరత్తు శనివారం కొలిక్కి వచ్చింది. -
చకాచక్... చెక్మేట్
[ 01-06-2024]
చదరంగంలో ఐదేళ్ల ఇషాని చక్కిలం అరుదైన రికార్డును నెలకొల్పింది. రాయ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇనార్బిట్మాల్ రోడ్ మైహోం అప్రా అపార్ట్మెంట్లో నిర్వహించిన కార్యక్రమంలో కేవలం 9.23 నిమిషాల్లో 104 చెక్మేట్ ఇన్ వన్ మూవ్ పజిల్స్ను పరిష్కరించి ఔరా..అనిపించింది. -
1969 ఉద్యమకారుల త్యాగాలు గుర్తించాలి
[ 01-06-2024]
‘1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటం ఉద్ధృతం కావడంతో అణచివేతకు పోలీసులు జరిపిన కాల్పుల్లో పలువురు నేలకొరిగారు. అయినా ఉద్యమాన్ని కొనసాగించాం. విద్యార్థి నేతలపై పీడీ యాక్ట్ ప్రయోగించి జైళ్లకు పంపారు. -
అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలి
[ 01-06-2024]
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అమరులైన 1200 మంది కుటుంబాలను కాంగ్రెస్ సర్కార్ ఆదుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. -
తెలం‘గాన’మే పరిషత్తు నినాదం
[ 01-06-2024]
ఆనాడు నిజాం పరిపాలన కాలంలో అక్షరాస్యత అంతంత మాత్రమే. ఉర్దూకు అన్నింటా ప్రాధాన్యం. తెలుగులో మాట్లాడితే నేరం. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ భాష సాంస్కృతిక పరిరక్షణకు 1943లో సారస్వత పరిషత్తు ఏర్పాటైంది. ఇటీవల కాలంలో చేపట్టిన తెలంగాణ మహోజ్వల చరిత్ర, సంస్కృతి, సమగ్ర సంపుటాల ప్రాజెక్టు దేశంలోనే అరుదైందని చెప్పవచ్చు. -
ఉద్యమ కోట.. మూసాపేట
[ 01-06-2024]
తెలంగాణ ఉద్యమ చరిత్రకు మూసాపేట కంచుకోటగా నిలిచింది. శాంతియుత పంథాలో పతాకస్థాయిలో జరిగిన పోరాటం అప్పట్లో రాష్ట్ర స్థాయిలో గుర్తింపును సాధించింది. రెండు దఫాలుగా 235 రోజులపాటు ఇక్కడ నిరసన దీక్షలు, కళాకారుల ధూంధాం ఆటపాటలు నిత్యం మార్మోగాయి. ఐకాసకు తొలి బీజం పడింది కూడా ఇక్కడే కావడం విశేషం. -
ట్యాంక్బండ్పై జయశంకర్ విగ్రహం ఏర్పాటుకు వినతి
[ 01-06-2024]
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ.జయశంకర్ విగ్రహాన్ని ట్యాంక్బండ్పై ఏర్పాటు చేయాలని తెలంగాణ బీసీ కుల సంఘాల ఐకాస ఛైర్మన్ కుందారం గణేష్చారి కోరారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. -
నిల్వ మాంసం.. బిర్యానీకి సిద్ధం
[ 01-06-2024]
గత కొన్ని రోజులుగా ఫుడ్సేఫ్టీ అధికారులు నగరంలోని హోటళ్లలో దాడులు నిర్వహించి అనేక లోపాలను వెలుగులోకి తెస్తున్నారు. శుక్రవారం పాతబస్తీలోని ప్రముఖ హోటళ్లు, బేకరీలు, డెయిరీ పరిశ్రమల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ల టాస్క్ఫోర్స్ బృందం తనిఖీలు చేసి అనేక లోపాలు గుర్తించారు. -
శిశువును అపహరించిన ముగ్గురి అరెస్ట్
[ 01-06-2024]
అమ్మ ఒడిలో నిద్రిస్తున్న శిశువును అర్ధరాత్రి అపహరించిన దంపతులతోపాటు మరో మహిళను ఆర్జీఐఏ పోలీసులు శుక్రవారం కటకటాల్లోకి నెట్టారు. అపహరించిన శిశువును విక్రయించడానికి యత్నించిన ముగ్గురిని సీసీ కెమెరాలు పట్టించాయి. -
రూ.300 కోట్ల మనీలాండరింగ్ పేరుతో వయోధికుడికి రూ.23 లక్షల టోకరా
[ 01-06-2024]
మీరు రూ.300కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్నారంటూ బెదిరించి ఓ వయోధికుడి నుంచి రూ.23 లక్షలు దండుకున్నారు సైబర్ మోసగాళ్లు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్కు చెందిన 64 ఏళ్ల వ్యాపారికి ధిల్లీలోని లజ్పత్నగర్ పోలీసు ఠాణాలోని సీనియర్ హెడ్ కానిస్టేబుల్నంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. -
‘ఆత్మ’.. అదృశ్యమేనా?
[ 01-06-2024]
వ్యవసాయ రంగంలో సమగ్రాభివృద్ధికి రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి చైతన్యవంతులను చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) పథకం నామమాత్రంగా మారుతోంది. -
బడుల్లో మౌలిక వసతులు.. మారనున్న రూపురేఖలు
[ 01-06-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రెండో దశ కింద తొమ్మిది పాఠశాలలను పీఎంశ్రీ (ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్) పథకానికి ఎంపిక చేసింది. -
ఆయిల్పామ్.. అన్నదాతకు లాభం
[ 01-06-2024]
జిల్లాలో ఆయిల్పామ్ సాగుకు అధికారులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. సాంప్రదాయ పంటల కంటే వీటితో అధిక లాభాలు ఆర్జించొచ్చని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తుండడంతో చాలామంది ముందుకొస్తున్నారు. -
శిక్షణ ఉచితం.. భవిత భద్రం
[ 01-06-2024]
సర్కారీ కొలువు సాధించాలన్నది ప్రతి ఒక్కరి ఆశయం. ఏళ్ల తరబడి చదువుతూ ప్రవేశ పరీక్షలు రాస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని నిరుద్యోగులకు కొలువులు దక్కాలన్న ఉద్దేశంతో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందిస్తున్నారు. -
సత్యం కంప్యూటర్స్ పునరుత్థానం స్ఫూర్తిదాయకం
[ 01-06-2024]
పతనమైన సత్యం కంప్యూటర్స్.. వంద రోజుల్లో తిరిగి నిలబడడం స్ఫూర్తిదాయకమని, నాడు ప్రభుత్వం నియమించిన సీఏ టీఎన్ మనోహరన్, డైరెక్టర్లు, ఉద్యోగులు పడిన శ్రమదే ఈ ఘనతని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. -
వారి రాజీనామా నిర్ణయం అభినందనీయం: కేటీఆర్
[ 01-06-2024]
రాష్ట్ర సహకార బ్యాంకు పదవులకు రాజీనామా చేసిన కొండూరి రవీందర్రావు, గొంగిడి మహేందర్రెడ్డిలను భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అభినందించారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీస్టార్’ ఆడకపోవడానికి కారణమిదే!
-
పాండ్య ‘బ్యాకప్’ పేసర్.. బౌలింగ్ కాంబినేషన్ అలా ఉంటే తిరుగుండదు: గావస్కర్
-
సల్మాన్పై లారెన్స్ బిష్ణోయ్ ట్రిగర్.. పాక్ నుంచి ఏకే-47 తుపాకులు..!
-
విజయవాడలో డయేరియా మరణాలు ఆందోళనకరం: చంద్రబాబు
-
గవర్నర్ను కలిసిన సీఎం రేవంత్.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం..
-
వైఎస్సార్ జిల్లాలో పోలీసుల తనిఖీలు.. కారులో తరలిస్తున్న రూ.1.5 కోట్లు స్వాధీనం