నేడు జమ్మికుంటకు సీఎం.. 8న వేములవాడకు పీఎం
పెరుగుతున్న ఉష్ణోగ్రతల మాదిరిగానే పార్టీలు ప్రచార వేడిని క్రమంగా పెంచుతున్నాయి. ఉత్తర తెలంగాణలో కీలకమైన జిల్లాగా పేరొందిన ఉమ్మడి కరీంనగర్పై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నాయి.
ఈనాడు, కరీంనగర్
పెరుగుతున్న ఉష్ణోగ్రతల మాదిరిగానే పార్టీలు ప్రచార వేడిని క్రమంగా పెంచుతున్నాయి. ఉత్తర తెలంగాణలో కీలకమైన జిల్లాగా పేరొందిన ఉమ్మడి కరీంనగర్పై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నాయి. ఉద్యమాల గడ్డ తమకు అడ్డా అని ఓ పార్టీ భావిస్తుంటే.. గత వైభవాన్ని అందిపుచ్చుకుని అధికారంలోకి వచ్చామని మరో పార్టీ విశ్వసిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో తమ గెలుపునకు అనుకూలమైన ప్రాంతమని ఇంకో పార్టీ దూకుడును పెంచుతోంది. ఈ క్రమంలో ముఖ్య నేతల ప్రచారాలు ఖరారు అవుతున్నాయి.
నేడు సీఎం రేవంత్ రాక
శాసనసభ ఎన్నికల సమయంలో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో జమ్మికుంటలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రచార యాత్రను సాగించిన రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి మంగళవారం వస్తున్నారు. జమ్మికుంటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు తరఫున ప్రచారాన్ని సాగించబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడి సమావేశానికి సీఎం రానుండటంతో అవసరమైన ఏర్పాట్లను పార్టీ నాయకులు పూర్తి చేశారు. భారీ జన సమీకరణపై దృష్టి పెట్టారు. మరుసటి రోజు మే 1న కోరుట్ల సభలోనూ సీఎం పాల్గొంటారు. అక్కడ నిజామాబాద్ అభ్యర్థి జీవన్రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తారు. తరువాత పెద్దపల్లి జిల్లాలోనూ అభ్యర్థి గడ్డం వంశీకి మద్దతుగా ముఖ్యమంత్రి పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక కరీంనగర్ పట్టణంలో పోలింగ్ తేదీకి రెండు, మూడు రోజుల ముందు ప్రియాంక గాంధీ లేదా రాహుల్ గాంధీలను రప్పించి భారీ సభను ఏర్పాటు చేయాలని కరీంనగర్ కాంగ్రెస్ భావిస్తున్నారు.
రెండ్రోజుల్లో కేసీఆర్
భారాస అభ్యర్థుల తరపున మాజీ సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో మే 2వ తేదీ నుంచి బస్సు యాత్రను చేపట్టబోతున్నారు. 2న జమ్మికుంటలో, 3న రామగుండంలో, 5వ తేదీన జగిత్యాలలో రోడ్షోలు నిర్వహిస్తారు.
మోదీ పర్యటన ఖరారు
భాజపా కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్కు మద్దతుగా మే 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ వేములవాడకు రానున్నారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్తోపాటు నిజామాబాద్ నియోజకవర్గానికి సమీపంలో ఉండటం, పుణ్యక్షేత్రం కావడంతో వేములవాడను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు హనుమాన్ జయంతి.. కాషాయమయంగా కొండగట్టు
[ 01-06-2024]
నేడు పెద్ద హనుమాన్ జయంతి నేపథ్యంలో కొండగట్టు క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. రామనామజపంతో కాషాయమయమైంది. -
మది నిండుగ.. దశాబ్ది పండుగ!
[ 01-06-2024]
దశాబ్దాల ఉద్యమాల ఫలితంగా పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటితో పదేళ్లు పూర్తయింది.. ఆదివారం పదకొండో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వేడుకలకు ఉమ్మడి జిల్లా ముస్తాబవుతోంది. ఇన్నేళ్ల ఘన కీర్తిని.. ఉద్యమ ఖ్యాతిని గుర్తు చేసుకుంటూనే భవిష్యత్తు దిశగా పడే అడుగులపై ఉమ్మడి జిల్లావాసుల్లో ఆశలు పెరుగుతున్నాయి.. -
కాషాయ వర్ణం.. కొండగట్టు
[ 01-06-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ పరిసరాలు కాషాయ శోభను సంతరించుకుంటున్నాయి. వివిధ జిల్లాల నుంచి దీక్షాపరులు పాదాలకు వస్త్రాలు చుట్టుకుని, హనుమాన్ జెండాను చేతపట్టుకుని పాదయాత్రగా ‘రామ లక్ష్మణ జానకీ.. జైబోలో హనుమాన్కీ’ అంటూ ఘాట్రోడ్డు, మెట్లదారిన కొండపైకి చేరుకున్నారు. -
116 టేబుళ్లు.. 153 రౌండ్లు
[ 01-06-2024]
కరీంనగర్ లోక్సభ స్థానానికి సంబంధించి ఈనెల 4న ఓట్ల లెక్కింపు కోసం అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలు నిర్వహించగా, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి అధికారులకు దిశానిర్దేశం చేశారు. -
ఉత్తమ ఫలితాలు.. మౌలిక వసతులు
[ 01-06-2024]
పక్కా భవనాలు.. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో కార్పొరేట్ కళాశాలలకు దీటుగా బోధన, ఉత్తమ ఫలితాలు ఉన్నాయంటూ అధ్యాపకులు ఇంటింటి ప్రచారం చేశారు. జిల్లా వ్యాప్తంగా 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా ఆయా కళాశాలల్లో ప్రవేశాల సంఖ్యను పెంచేందుకు మే 9 నుంచి ఇంటర్ విద్యాశాఖ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. -
ముంపు ముప్పు తప్పేనా?
[ 01-06-2024]
వర్షం కురిస్తే చాలు సిరిసిల్ల పురపాలక సంఘంలోని లోతట్టు కాలనీలు జలమయం కావడం, ప్రధాన రహదారులపైకి, ఇళ్లలోకి నీరు చేరడం సర్వసాధారణంగా మారింది. పట్టణం చుట్టూ ఉన్న చెరువుల శిఖం ఆక్రమణలతో వాటిలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. -
అతివల ఆర్థిక అభ్యున్నతికి అండ
[ 01-06-2024]
ఉమ్మడి జిల్లాలో స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్థికాభివృద్ధికి స్త్రీనిధి రుణాలు అండగా నిలుస్తున్నాయి. అత్యవసర వేళల్లో తోడ్పాటునందిస్తున్నాయి. వడ్డీ వ్యాపారుల ఒత్తిడి లేకుండా చిరు వ్యాపారాల నిర్వహణతో ఆర్థిక బలోపేతం వైపు అడుగులు పడేలా సహకరిస్తున్నాయి. -
సుల్తానాబాద్లో లారీ బీభత్సం
[ 01-06-2024]
డ్రైవర్ మద్యం మత్తుతో శుక్రవారం సుల్తానాబాద్లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పలు ద్విచక్రవాహనాలు దెబ్బతిన్నాయి. -
67 గోవులు, ఎద్దుల పట్టివేత
[ 01-06-2024]
మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు వాహనాల్లో తరలిస్తున్న 67 గోవులు, ఎద్దులను పెద్దపల్లి జిల్లా బసంత్నగర్ టోల్ప్లాజా వద్ద పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. -
వడదెబ్బతో నలుగురి మృతి
[ 01-06-2024]
ఎండలు మండిపోతుండటంతో జనం విలవిల్లాడుతున్నారు. శుక్రవారం ఒక్క రోజే ఉమ్మడి జిల్లాలో వడదెబ్బకు నలుగురు మృత్యువాత పడటం విషాదం నింపింది. -
47.1 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు
[ 01-06-2024]
ఉమ్మడి జిల్లాలో భానుడిప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం రాష్ట్రంలోనే అత్యధికంగా పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో 47.1 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా ముత్తారంలో 46.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నెలకొంది.
తాజా వార్తలు (Latest News)
-
శుభ్మన్ గిల్తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన నటి
-
ఫోన్ ట్యాపింగ్పై సీబీఐ విచారణ చేయించాలి: సీఎం రేవంత్కు బండి సంజయ్ లేఖ
-
రివ్యూ: మిస్టర్ అండ్ మిసెస్ మహి: జాన్వీకపూర్ స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
-
‘వెంటనే ఆ ఫొటో డిలీట్ చేయండి’: నెటిజన్పై ఎస్బీఐ ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మూడేళ్లు ఆడగలిగే ఫిట్నెస్ ఉన్నా.. ఐపీఎల్కు వీడ్కోలు పలికేందుకు డీకే కారణమిదే!