పండుటాకులతో జగన్ పింఛనాట
సామాజిక పింఛన్ల వ్యవహారంలో జగన్నాటకం కొనసాగుతోంది.. ఇంటింటికీ వెళ్లి పింఛను పంపిణీ చేయకుండా ఉండేందుకు ఎన్ని రకాలు కుట్రలు, కుతంత్రాలు పన్నాలో అన్నింటినీ అమలు చేస్తున్నారు.
న్యూస్టుడే, కర్నూలు సచివాలయం
సామాజిక పింఛన్ల వ్యవహారంలో జగన్నాటకం కొనసాగుతోంది.. ఇంటింటికీ వెళ్లి పింఛను పంపిణీ చేయకుండా ఉండేందుకు ఎన్ని రకాలు కుట్రలు, కుతంత్రాలు పన్నాలో అన్నింటినీ అమలు చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల దగ్గరకు వెళ్లలేము మహాప్రభో ఇంటి దగ్గరే ఇవ్వాలని పింఛనుదారులు వేడుకుంటున్నా చెవికెక్కించుకోవడం లేదు. బురద జల్లడమే మా పని.. రాజకీయ లబ్ధే మా వ్యూహం అన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇంటింటికీ సరిపడా సిబ్బంది ఉన్నా పంపిణీకి మోకాలడ్డుతున్నారు. బ్యాంకులకు వెళ్లండి తిప్పలు పడండి అంటూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒంటరిగా బ్యాంకులకు వెళ్లలేనివారు వేలల్లో ఉంటారు. ఇలాంటి వృద్ధులందరూ మరొకరిని వెంట తీసుకుని బ్యాంకులకు వెళ్లాలి. ఒక్కొక్కరు రూ.200-400 రవాణా ఖర్చు భరించాలి. తిండి ఖర్చు అదనం. ఒకరకంగా చూస్తే ఇదంతా వారిలో ఆందోళన నింపే ప్రయత్నమే అవుతుంది..
ఏప్రిల్లో ఏడిపించారు
లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను పంపిణీ చేయకుండా మండే ఎండల్లో గ్రామ, వార్డు సచివాలయాలకు రప్పించడంతో వృద్ధులు యాతన పెట్టారు.
మేలో ముచ్చెమటలు
పింఛనుదారుల బ్యాంకుఖాతాల్లో నగదు జమచేస్తామంటూ ఇళ్లకు ఎక్కడో దూరంలో ఉండే బ్యాంకుల చుట్టూ తిప్పే కుట్రకు తెర తీశారు.
ఇంటింటికి పంపిణీ చాలా సులువు
గ్రామ, వార్డు సచివాలయాల్లో 7 నుంచి 9 వరకు సిబ్బంది ఉన్నారు. ఒక్కో ఉద్యోగి 47 పింఛన్లు మాత్రమే పంచాల్సి ఉంటుంది. రెండు రోజుల్లో ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయొచ్చు. ఇంత సులభతరంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వృద్ధులను బ్యాంకుల చుట్టూ తిప్పేలా ప్రభుత్వం కుట్ర పన్నింది. దీనిపై లబ్ధిదారులు మండిపడుతున్నారు.
1,88,096 మంది బ్యాంకుకు వెళ్లాల్సిందే
కర్నూలు జిల్లాలో 2,46,340 మంది పింఛనుదారులు ఉండగా వారిలో 58,244 మంది నడవలేనివారు, మంచానికే పరిమితమైనవారు, దివ్యాంగులు, సైనిక పింఛన్లు తీసుకునేవారు ఉన్నారు. వీరికి సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందించనున్నారు. మిగిలిన 1,88,096 మందికి మే ఒకటో తేదీన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పింఛనుదారుల ఖాతాల్లో జమ చేస్తారు. బ్యాంకు ఖాతాలు లేనివారికి, పింఛను సొమ్ము ఖాతాలకు వెళ్లకుండా వెనక్కు వస్తే అలాంటి వారికి మే 3వ తేదీన సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి అందిస్తారు. పింఛనుదారుల్లో అత్యధికులు వృద్ధులే ఉన్నారు. మొత్తం 16 రకాల పింఛన్లు పంపిణీ చేస్తుండగా అందులో ఒక్క వృద్ధాప్య పింఛన్లే ఉమ్మడి జిల్లాలో 2.41 లక్షలు ఉన్నాయి. వితంతు పింఛన్లు 1.34 లక్షలు, దివ్యాంగుల పింఛన్లు 58 వేలు ఉన్నాయి. మిగిలిన అన్ని కేటగిరీలవారు 33,736 మంది ఉన్నారు. అసలే వేసవి కాలం.. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వృద్ధులు తదితరులు బ్యాంకులకు వెళ్లి నగదు తీసుకోవాలంటే నరకయాతనే.
ఎర్రటి ఎండ
బ్యాంకు సమయం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. ఈ సయమంలో ఎండ 43 నుంచి 44 డిగ్రీల వరకు ఉంటుంది.
పది కి.మీ. పరుగులు
మద్దికెర మండలంలో 8 గ్రామ పంచాయతీలు, మూడు మజరా గ్రామాలున్నాయి. మద్దికెర, పెరవలి గ్రామాల్లో మినహా మరే గ్రామంలోనూ బ్యాంకులు, ఏటీఎంలు లేవు. మండలంలో 4,867 మంది పింఛన్లు పొందుతున్నారు. వీరిలో రెండు వేల మందికి పైగా ఇతర గ్రామాల నుంచి బ్యాంకులకు వెళ్లాల్సిందే. దీంతో ఈ సారి వీరందరికీ కష్టాలు తప్పేలా లేవు.
‘‘‘ మదనంతపురం నుంచి పెరవలి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుకు వెళ్లేందుకు ఎలాంటి రవాణా సౌకర్యం లేదు.. ఈ దారిలో కనీసం ఆటోలు తిరగవు. బ్యాంకుకు వెళ్లేందుకు సుమారు 10 కి.మీ. వెళ్లాలి. ఇక్కడ 120 మంది పింఛన్దారులు ఉన్నారు. వీరంతా ఇప్పుడు 10 కి.మీ దూరంలోని పెరవలికి వెళ్లాలంటే ఇబ్బందులు తప్పవు.
న్యూస్టుడే, మద్దికెర
ఉన్నది ఒక్కటే బ్యాంకు
నందవరం మండలంలో 15 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.. 19 గ్రామ సచివాలయాల్లో 140 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. మండలంలో 7,157 మంది పింఛనుదారులున్నారు. వీరంతా మండల కేంద్రంలో ఉన్న కెనరా బ్యాంకులో డబ్బులు తీసుకోవాల్సిందే. గురజాలలో 449 మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు.. వీరంతా 15 కి.మీ దూరంలో ఉన్న నందవరానికి వెళ్లాలిందే. మాచాపురంలో తొమ్మిది సచివాలయ సిబ్బంది ఉండగా.. 231 మంది లబ్ధిదారులున్నారు. ఒక్కో సిబ్బంది 25 మంది చొప్పున అందజేస్తే రెండు గంటల్లో పూర్తి చేయొచ్చు. ప్రతి పల్లెలో ఒక్క రోజులో పూర్తి చేయొచ్చు.. బ్యాంకులో జమ చేయడంతో వీరికి ఇబ్బందులు తప్పవు. - న్యూస్టుడే, నందవరం
మనుగడలో లేని ఖాతాలు
కౌతాళం మండలంలో మొత్తం 8,738 పింఛన్లున్నాయి. ఇందులో 500 మందికిపైగా బ్యాంకు ఖాతాల్లేని వారున్నారు. మండలంలో ఖాతాలున్నా అప్డేట్ లేనివారు (లావాదేవీలు లేనివారు) సుమారు 860 మంది ఉన్నారు. కౌతాళం 2 బదినేహాల్ 1, ఉరుకుంద 2, హాల్వి 1 చొప్పున ఆరు బ్యాంకులున్నాయి. ఖాతాలే సరిగా లేకుంటే డబ్బులు ఎలా తీసుకునేదని పింఛనుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుంబళనూరు గ్రామ సచివాలయం పరిధిలో 394 మంది పింఛనుదారులున్నారు. ఇక్కడ సచివాలయ ఉద్యోగులు ముగ్గురు ఉన్నారు. ఇక్కడ ఒక్కో ఉద్యోగికి 131 పింఛన్లు వస్తాయి. వీరు ఇంటింటికి వెళ్లి రెండు గంటల్లో సులువుగా పంపిణీ చేయవచ్చు.
న్యూస్టుడే, మంత్రాలయం గ్రామీణం
ఖాతా పని చేయడం లేదు
- కౌట్లయ్య, గోనెగండ్ల
నేను ఎప్పుడో బ్యాంకు ఖాతా తీసుకున్నా. ప్రస్తుతం అది పని చేస్తుందో లేదో తెలియదు. ఆధార్ లింకు కావాలని అడుగుతున్నారు. ఆ ఖాతాకు లింకు అయ్యిందో లేదో తెలియదు. ప్రభుత్వం ఎప్పటి మాదిరిగా ఇంటింటికి వచ్చి పింఛను అందిస్తే మాలాంటి వారికి ఇబ్బందులుండవు.
న్యూస్టుడే, గోనెగండ్ల
అంత దూరం వెళ్లే సరికి బ్యాంకు మూస్తారు
- ఈడిగ లక్ష్మీదేవి, కె.వెంకటాపురం
మా గ్రామానికి మండల కేంద్రం దేవనకొండకు 12 కి.మీ. దూరం ఉంది. బస్సు సౌకర్యం లేదు. దేవనకొండలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, పత్తికొండలోని ఎస్బీఐలో ఖాతాలు ఉన్నాయి. ఆధార్ అనుసంధానం పత్తికొండలోని బ్యాంకు ఖాతాకు ఉంది. కె.వెంకటాపురం నుంచి పత్తికొండకు వెళ్లాలంటే 12 కి.మీ., దేవనకొండకు ఆటోలో చేరుకొని, అక్కడి నుంచి మరో 18 కి.మీ. పత్తికొండకు వెళ్లాల్సిఉంది. అక్కడికి వెళ్లే సరికి బ్యాంకు సమయం ముగుస్తుంది.ఒంటరిగా వెళ్లలేను. నాతో పాటు మరొకరి సాయాన్ని తీసుకోవాల్సి వస్తుంది.
న్యూస్టుడే, దేవనకొండ
బ్యాంకు లేదు.. బస్సు రాదు...
- రంగమ్మ, సూదేపల్లి (వెల్దుర్తి)
మా గ్రామానికి బస్సు రాదు.. బ్యాంకు వసతి లేదు. 11 కి.మీ. ప్రయాణించి వెల్దుర్తికి వెళ్లాలి. సూదేపల్లి నుంచి వెల్దుర్తికి వెళ్లాలంటే రూ.100 ఖర్చు అవుతుంది. ఒక్కదాన్ని అంత దూరం వెళ్లలేను. తోడుగా మరొకరు రావాలి.. అదనపు భారం తప్పదు.
న్యూస్టుడే, వెల్దుర్తి
ఖాతా వినియోగించక మూడేళ్లు
- లింగమ్మ, విరుపాపురం (హాలహర్వి)
బ్యాంకు ఖాతా వినియోగించక మూడేళ్లు అవుతోంది. ఇలాంటి సమయంలో పింఛను సొమ్ము జమచేస్తే డ్రా చేసుకొనేందుకు 16 కి.మీ. ఆటోలో ప్రయాణించాలి. బ్యాంకులో నిల్చోవడం సాధ్యం కాదు. మండుటెండలో ప్రయాణం కష్టసాధ్యం. వృద్ధులు తీవ్ర వ్యయప్రయాసలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణపై శిక్షణ కార్యక్రమం
[ 03-06-2024]
సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణపై జిల్లా కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన ఆధ్వర్యంలో జనరల్ అబ్జర్వర్స్ జాఫర్, మీర్ తారిఖ్ అలీ, బిపుల్ సైకియా సమక్షంలో మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. -
హాలహర్వి లో 64.6 మి.మీ. వర్షపాతం నమోదు
[ 03-06-2024]
హాలహర్వి మండలంలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. -
ఎమ్మిగనూరులో 69.2 వర్షపాతం నమోదు
[ 03-06-2024]
మండలంలో 69.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. -
పక్కాగా లెక్కింపు బలగాల మోహరింపు
[ 03-06-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరింది. 4వ తేదీన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. కర్నూలు జిల్లాకు సంబంధించి ఓట్ల లెక్కింపు కార్యక్రమం నగర శివారులోని రాయలసీమ విశ్వవిద్యాలయంలో జరగనుంది. -
నాణ్యతకు నీళ్లొదిలినారు
[ 03-06-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 200కు పైగా గుర్తింపు ఉన్న నర్సరీలు ఉన్నాయి.. అనధికారికంగా మరో 50కిపైగా నడుస్తున్నాయి. కర్నూలు జిల్లాలో రామళ్లకోట, పత్తికొండ, గోనెగండ్ల, ఎమ్మిగనూరు, ఓర్వకల్లు, కోడుమూరు తదితర మండలాల్లో ఎక్కువగా నర్సరీలు ఉన్నాయి. -
మహాదేవ.. విధిరాత మార్చవా
[ 03-06-2024]
ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైల మహాక్షేత్రంలో పాలనా వ్యవహారాల నిర్వహణకు అవసరమైన ఉద్యోగుల కొరత వేధిస్తోంది. కీలక పోస్టులు భర్తీ కాకపోవడంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందడం లేదు. ఫలితంగా సమస్యలు పరిష్కరించలేని పరిస్థితి. -
మద్యానికి బారులు
[ 03-06-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బార్లు, ప్రభుత్వ మద్యం దుకాణాలు ఆదివారం కిటకిటలాడాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో 175 ప్రభుత్వ మద్యం దుకాణాలు, 49 బార్లు ఉన్నాయి. -
కూటమిదే విజయం : తిక్కారెడ్డి
[ 03-06-2024]
ఈ నెల 4న ఓట్ల లెక్కింపులో ఎన్డీయే కూటమి నూటికి నూరు శాతం గెలుపు ఖాయమని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించబోతున్నారని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. -
చెంత నీరున్నా చింతే!
[ 03-06-2024]
ఆళ్లగడ్డ 21వ బ్లాక్ వద్ద ఉన్న మేజరు కాల్వ పూడికతీత పనులు గత ఏడాది జూన్లో చేపట్టారు. టెయిల్ఎండ్ పనులు పూర్తికాకపోవడంతో చేపట్టిన పనులన్నీ వృథాగా మారాయి. కాల్వను ఇప్పటికే రైతులు పూడ్చేయడంతో నీటి ప్రవాహం జరగడం లేదు. -
కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి
[ 03-06-2024]
జూన్ 4న ఓట్ల లెక్కింపు సిబ్బంది విధులు నిర్వహించేందుకుగాను రెండో ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డా.జి.సృజన అబ్జర్వర్లకు వివరించారు. -
వ్యాపారికి రొక్కం.. రైతుకు దుఃఖం
[ 03-06-2024]
ఏటా నాసిరకం విత్తనాలతో అన్నదాత నష్టపోతునే ఉన్నారు. వ్యవసాయ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. నాణ్యమైన విత్తనాలు రైతులు ఎంపిక చేసుకోవాలని అధికారులు చెబుతున్నా.. నాణ్యమైన వాటిని అందించడంలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారు. -
ఎమర్జెన్సీ వైద్య బృందం ఏర్పాటు చేయండి
[ 03-06-2024]
రాయలసీమ యూనివర్సిటీలోని ప్రతి బ్లాక్లో ఎమర్జెన్సీ వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని, ప్రతి ఫ్లోర్లో ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎమర్జెన్సీ కిట్లను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డా.జి.సృజన సంబంధిత అధికారులను ఆదేశించారు. -
లెక్కింపు ప్రక్రియ విజయవంతంగా చేయాలి
[ 03-06-2024]
ఎన్నికల నిబంధనలు పాటిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఆదివారం ఆయన విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహణపై వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫలితాల వేళ.. భాజపా నేతల కీలక భేటీ.. రాజకీయ పరిస్థితులపై వ్యూహాలు
-
అభ్యర్థులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్రెడ్డి
-
ఆ విషయంలో ఎంఎస్ ధోనీ - రోహిత్ శర్మ ఒకటే: కైఫ్
-
తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు
-
పోస్టల్ బ్యాలెట్లకు ప్రత్యేక కౌంటర్లు: సీఈవో ముకేశ్కుమార్ మీనా
-
‘హీరామండి-2’ ప్రకటించిన దర్శకుడు.. ఏం చూపనున్నారంటే!