గతంలో తండ్రి.. ఇప్పుడు తల్లి
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న కొడుకే తల్లిదండ్రులను పొట్టనబెట్టుకున్నాడు.
మాతృమూర్తిని కర్రతో మోదిన తనయుడు.. చికిత్స పొందుతూ మృతి
భారతమ్మ
ములుగు: కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న కొడుకే తల్లిదండ్రులను పొట్టనబెట్టుకున్నాడు. ఎస్సై మధుకర్రెడ్డి తెలిపిన వివరాలు.. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తికి చెందిన పెద్దబోయిన బాలమల్లు, భారతమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు నరసింహులు ఉన్నారు. అందరికీ పెళ్లిల్లయ్యాయి. మద్యానికి బానిసైన నరసింహులు 9 ఏళ్ల కిందట తండ్రితో డబ్బుల విషయమై గొడవపడ్డాడు. ఇవ్వకపోవడంతో కర్రతో తండ్రి తలపై గట్టిగా కొట్టడంతో ఆయన మృతిచెందారు. ఈనెల 27న రాత్రి తాగిన మైకంలో తల్లి భారతమ్మ(55)తో కుమారుడు నరసింహులు గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. తల్లిని బలంగా నెట్టేయడంతో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి. అంతటితో ఆగకుండా కర్రతో దాడి చేశాడు. గమనించిన చుట్టుపక్కల వారు భారతమ్మ కుమార్తెలకు సమాచారం అందించారు. వేరే గ్రామాల్లో ఉంటున్న వారు వచ్చి తల్లిని చికిత్సకు గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె సోమవారం సాయంత్రం మృతి చెందింది. తమ్ముడు నరసింహులుపై ఆయన అక్క సరస్వతి మర్కూక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై హత్య కేసు నమోదైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూడళ్లు..ప్రమాదాల లోగిళ్లు
[ 31-05-2024]
జిల్లాలో రెండో అతిపెద్ద పట్టణమైన నర్సాపూర్ మీదుగా రెండు జాతీయ రహదారులు వెళ్తాయి. రవాణాకు ఎంతో కీలకమైన ఈ ప్రాంతం వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉంటుంది. -
అక్రమాలకు చెక్
[ 31-05-2024]
బల్దియాల్లో రెగ్యులర్ ఉద్యోగులతోనే ఆస్తి పన్నులు వసూలు చేసే ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాత విధానంలో కొన్ని పట్టణాల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. -
పొగాకు..జీవితానికి పరాకు
[ 31-05-2024]
ధూమపానం, గుట్కా వ్యసనం.. ఆరోగ్యానికి ముప్పుగా మారింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా నష్టాన్ని మిగులుతోంది. కుటుంబ సభ్యులను అగాధంలోకి నెడుతోంది. -
ఆస్తిపాస్తులు లాక్కొని పెంపుడు తండ్రికి చిత్రహింసలు
[ 31-05-2024]
పెంచి పెద్ద చేసిన తండ్రి నుంచి ఆస్తిపాస్తులు బలవంతంగా లాక్కోవడమే కాకుండా గదిలో బంధించి చిత్రహింసలు పెట్టారు కుమారుడు, అతడి భార్య. -
కుట్టు.. ఉపాధికి మెట్టు
[ 31-05-2024]
ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద మహిళలకు చేయూత ఇచ్చేందుకు స్వచ్ఛంద సంస్థ చేస్తున్న కృషి పలువురికి ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. -
వేర్వేరు కారణాలతో ఆరుగురి ఆత్మహత్య
[ 31-05-2024]
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరు కారణాలతో ఆరుగురు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. -
ధ్రువపత్రం.. అన్నింటికీ ఆధారం
[ 31-05-2024]
ఉన్నత చదువు ప్రవేశాలకు వేళయింది. జూన్ 1 నుంచి ఇంటర్ తరగతులు షురూ కానున్నాయి. మరోవైపు ప్రభుత్వం అందించే ఉపకార వేతనాలకు దరఖాస్తుల సమయం ఆసన్నమైంది. -
అదనపు నిధుల జాడేదీ?
[ 31-05-2024]
ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల కింద నిధులు విడుదల చేస్తున్నాయి. -
పట్టాలిచ్చారు.. స్థలాలు మరిచారు
[ 31-05-2024]
లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసి సుమారు రెండేళ్లయింది. వారికి ఇప్పటికీ స్థలాలు కేటాయించలేదు. భూములు కోల్పోయాం.. -
కొత్త రేషన్ కార్డులపై పేదల ఆశలు
[ 31-05-2024]
పేదలకు చౌక ధరలకే సరకులు అందించాలన్న లక్ష్యంతో ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రభుత్వం తీసుకొచ్చింది. రేషన్ కార్డుదారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. -
నిర్మాణాల్లో నిబంధనల పాతర
[ 31-05-2024]
జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఇళ్ల నిర్మాణాలు ఇష్టారీతిన సాగిస్తున్నారు. నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా నిర్మాణాలు చేపడుతున్నా జిల్లాయంత్రాంగం పట్టించుకోవటం లేదు. -
వనితల ఆసక్తికి వెన్నుదన్ను
[ 31-05-2024]
సిద్దిపేటలోని యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ.. నిరుద్యోగ యువతకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. స్వయం ఉపాధి కల్పనకు బాటలు వేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఈ రోజు భారీ నష్టం వాటిల్లింది’: మస్క్ దేని గురించి అన్నారంటే..?
-
భాజపాకి 303 సీట్లు నిలవాలంటే ఇదే కీలకం!
-
ప్రజ్వల్ రేవణ్ణకు జూన్ 6 వరకు సిట్ కస్టడీ
-
ఝూఠోకే సర్దార్.. దో శహజాదే.. ప్రచార పర్వంలో పదనిసలెన్నో!
-
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరాలు వెల్లడించాలి: గవర్నర్ను కలిసిన భాజపా బృందం
-
అన్యాయాన్ని ఎదురిస్తూనే ఉంటా.. నా పోరాటం ఆగదు: ఏబీవీ