పాలకా.. ఏదీ బృహత్ ప్రణాళిక?
ఏళ్ల తరబడి నుంచి పట్టణ ప్రజలు ఎదురుచూస్తోన్న కందుకూరు మాస్టర్ప్లాన్ (బృహత్ ప్రణాళిక)కు మోక్షం లభించడం లేదు. నూతన ప్రణాళిక కోసం ఆరేళ్ల క్రితం అడుగులు పడగా.. నేటికీ ఖరారు కాకపోవడం ప్రజల్ని విస్తు గొలుపుతోంది.
కందుకూరు పట్టణం, న్యూస్టుడే: ఏళ్ల తరబడి నుంచి పట్టణ ప్రజలు ఎదురుచూస్తోన్న కందుకూరు మాస్టర్ప్లాన్ (బృహత్ ప్రణాళిక)కు మోక్షం లభించడం లేదు. నూతన ప్రణాళిక కోసం ఆరేళ్ల క్రితం అడుగులు పడగా.. నేటికీ ఖరారు కాకపోవడం ప్రజల్ని విస్తు గొలుపుతోంది. అనేక తర్జన భర్జనల అనంతరం డ్రాఫ్ట్ ప్లాన్ సిద్ధం చేసుకుని అనుమతులు కోసం డీటీసీపీకి పంపగా.. అక్కడ ఎటువంటి కదలిక లేదని సమాచారం. దీంతో పట్టణవాసుల ఆశలు అడియాసలుగా మిగిలిపోతున్నాయి.
2022 అక్టోబర్లో డ్రాఫ్ట్ ప్లాన్
1987 వరకు పంచాయతీగా ఉన్న కందుకూరును నగర పంచాయతీగా అభివృద్ధి చేసేందుకు అప్పట్లో కొన్ని చుట్టుపక్కల గ్రామాలను విలీనం చేశారు. 2001లో గ్రేడ్-2 మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. ఈ మేరకు పట్టణానికి అవసరమైన మాస్టర్ప్లాన్ను తొలిసారి 2005లో తయారుచేశారు. నాటి నుంచి నేటి వరకు అదే అమలులో ఉంది. దీంతో పెరుగుతున్న పట్టణీకరణ దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు, భవనాలు నిర్మించుకోవాలనుకునే వారికి సమస్య ఎదురవుతోంది. ముఖ్యంగా తానికొండకొష్టాలు, పామూరురోడ్డు, కేసరగుంటకాలనీ, కనిగిరిరోడ్డు, జీవీఆర్.నగర్ ప్రాంతాలవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు ఎట్టకేలకు 2018లో నూతన మాస్టర్ప్లాన్ ఏర్పాటుకు అడుగులు వేశారు. అనేక రకాలుగా కసరత్తు చేసి 2022 అక్టోబరులో డ్రాఫ్ట్ ప్లాన్ సిద్ధం చేశారు. ప్రకటించిన డ్రాఫ్ట్ ప్లాన్పై నెల రోజుల్లోగా అభ్యంతరాలుంటే ప్రజలు రాతపూర్వకంగా తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు 19మంది అభ్యంతరాలు తెలపడంతో తదనుగుణంగా మార్పులు, చేర్పులు చేసిన కందుకూరు మున్సిపల్ అధికారులు.. తుది డ్రాఫ్ట్ అనుమతుల కోసం ప్రభుత్వానికి పంపేందుకుగాను నుడాకు పంపారు. ఏడాది క్రితం నుడా అధికారులు కందుకూరు వచ్చి క్షేత్రపరిశీలన కూడా చేసి వెళ్లారు. దీంతో అతి త్వరలోనే తుది మాస్టర్ప్లాన్ ఖరారు అవుతుందని అంతా భావించారు.
డీటీసీపీ అనుమతులు రావాలి
కందుకూరు పట్టణానికి సంబంధించిన నూతన మాస్టర్ప్లాన్ కసరత్తు మొత్తం ఒడా(ఒంగోలు) పరిధిలో జరిగింది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కందుకూరు నెల్లూరులో కలిసినందున నుడా(నెల్లూరు) పరిధిలోకి వెళ్లింది. ఇలాంటి సాంకేతిక సమస్యలతో కొన్ని నెలలు ప్రక్రియ నిలిచిపోయింది. అనంతరం వచ్చిన ఆదేశాల మేరకు నుడా అధికారులు ప్రక్రియ తిరిగి ప్రారంభించారు. తుది ప్రకటన కోసం డీటీసీపీకి పంపగా.. కొన్ని మార్పులు, చేర్పులు సూచించినట్లు తెలిసింది. ఈ మేరకు మున్సిపల్, నుడా అధికారులు సవరణలు చేసి సదరు నివేదికలను డీటీసీపీ అనుమతులు కోసం పంపారు. ఈ ప్రక్రియ పూర్తై ఆర్నెల్లు దాటింది. కానీ, అడుగు ముందుకు పడలేదు. దీంతో అనేకమంది పారిశ్రామికజోన్, గ్రీన్జోన్, నీటివనరుల జోన్ వంటి సమస్యలు పరిష్కారంగాక ఇబ్బందులు పడుతున్నారు.
అనుమతులు రావడం లేదు
మాకు పామూరురోడ్డులో ఇంటి స్థలం ఉంది. ఇల్లు కట్టుకుందామనుకుంటే.. సదరు స్థలం పారిశ్రామికజోన్లో ఉంది. ఇంటి ప్లాన్ అనుమతులు రావని చెబుతున్నారు. సమస్య పరిష్కారం కోసం అనేకసార్లు అర్జీలు ఇచ్చాం. దాదాపు 5ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం. నేటికీ పరిష్కారం కాలేదు.
ఎం.రమణయ్య, పామూరురోడ్డు
త్వరలోనే వస్తాయి
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తుది మాస్టర్ప్లాన్ కోసం చేసిన మార్పులు, చేర్పులను సవరణలు చేసి డీటీసీపీ అనుమతుల కోసం పంపాం. త్వరలోనే అనుమతులు వస్తాయి.
శ్రీనివాసులు, పట్టణ ప్రణాళికాధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛను దారుల సమస్యలు పరిష్కరించాలి
[ 18-06-2024]
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్, నెల్లూరు శాఖ నాయకులు కలిసి అభినందించారు. -
సుబ్బానాయుడు కోలుకోవాలని ప్రత్యేక పూజలు
[ 18-06-2024]
తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాలేపాటి సుబ్బా నాయుడు ఆరోగ్యరీత్యా చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి తెదేపా నాయకులు అన్నారు. -
తీవ్ర అస్వస్థత గురైన మాలేపాటి
[ 18-06-2024]
రాష్ట్ర తెదేపాఉపాధ్యక్షులు, కావలి నియోజకవర్గ తెదేపా నాయకుడు మాలేపాటి సుబ్బానాయుడు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. -
మామూళ్లు...చర్యలకు సంకెళ్లు!
[ 18-06-2024]
ఏకంగా 114 డాక్యుమెంట్లు.. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు. కమిషనర్ సంతకం పెట్టలేదు. అయినా నగరపాలక సంస్థకు తనఖా పెట్టిన ఆస్తులను విడుదల చేశారు. -
పొర్లుకట్ట పనులు ప్రారంభం
[ 18-06-2024]
సంగంలో దువ్వూరు కాలువపై నూతనంగా నిర్మించిన రెగ్యులేటర్ నుంచి జడ్పీ ఉన్నత పాఠశాల వరకు పొర్లుకట్ట నిర్మాణ పనులను సోమవారం ప్రారంభించారు. -
శాంతికి చిహ్నం ఇస్లాం
[ 18-06-2024]
జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరులు సోమవారం బక్రీద్ను ఘనంగా జరుపుకొన్నారు. ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి.. -
ఇప్పుడేమిటి దారి?
[ 18-06-2024]
జిల్లాలో 2022 అక్టోబరు, నవంబరు నెలల్లో కురిసిన వర్షాలకు రోడ్లు దెబ్బతినగా- వాటి మరమ్మతులు, కొత్తగా వేసేందుకు నిధులు అందుబాటులో లేవు -
సోమశిల.. సాంకేతిక చిక్కులు తొలగేనా?
[ 18-06-2024]
జలాశయం నుంచి విడుదలయ్యే వరదనీటి వేగానికి అడ్డంకి ఎదురై.. ఏర్పడే ఒత్తిడి శక్తి ఆప్రాన్ కట్టడాలపై పడితే ఏం జరుగుతుందో 2020, 21 వరదలు తేటతెల్లం చేశాయి. -
ఆర్యవైశ్య బులియన్ మర్చంట్స్ అధ్యక్షుడిగా శోభన్బాబు
[ 18-06-2024]
ఆర్యవైశ్య బులియన్ మర్చంట్స్, పాన్బ్రోకర్స్ అసోసియేషన్ కమిటీ ఎన్నికల్లో.. ఏఎంఆర్ ప్యానల్ విజయం దక్కించుకుంది. దీంతో కొనగళ్ల శోభన్బాబు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. -
అభివృద్ధి పేరుతో దోపిడీ?
[ 18-06-2024]
జగనన్నకాలనీల పేరుతో గ్రామాలను ఏర్పాటు చేస్తున్నాయని గ్రామ స్థాయి నాయకులకు అక్రమంగా దోచిపెట్టారనే అరోపణలు నానాటికి వినిపిస్తున్నాయి. -
పెంచలకోనలో చినజీయర్ స్వామి పూజలు
[ 18-06-2024]
రాజుపాలెం పరమానంద ఆశ్రమాన్ని రామానుజ చినజీయర్ స్వామితో కలిసి దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.. -
సాగుకు సన్నద్ధం.. దిశానిర్దేశం శూన్యం
[ 18-06-2024]
పంటల సీజను సమీపిస్తుంది. తరచూ చినుకులు పడుతున్నాయి. దీంతో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. వీరికి దిశానిర్దేశం కల్పించడంలో వ్యవసాయ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. -
దాహం తీర్చని శుద్ధ జల కేంద్రం
[ 18-06-2024]
ఓడరేవు కోసం గ్రామాలు కోల్పోయి పునరావాస కాలనీల్లో ఉంటున్న ప్రజలు తాగునీటికి అవస్థలు పడుతున్నారు. -
రేపటి నుంచి ఐటీఐ కౌన్సెలింగ్
[ 18-06-2024]
ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో చేరదలచిన విద్యార్థులకు పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా సిద్ధం చేశామని బుధవారం నుంచి వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐ కళాశాలలో కౌన్సెలింగ్ -
టీవీ రిమోట్ కోసం అన్నాచెల్లెళ్ల గొడవ బాలిక ఆత్మహత్య
[ 18-06-2024]
రిమోట్ విషయమై అన్నాచెల్లెలు గొడవ పడి.. క్షణికావేశంలో ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెల్లూరు నగరంలో చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ అడ్వకేట్ జనరల్గా దమ్మాలపాటి శ్రీనివాస్
-
ఇంగ్లిష్ మీడియంపై మోజు.. ఆత్మహత్యవంటిది - ఎన్సీఈఆర్టీ చీఫ్
-
విమానంలో ప్రయాణికురాలి వింత ప్రవర్తన.. సిబ్బంది చేయి కొరికి..
-
క్యాప్షన్ కోరిన శ్రద్ధా కపూర్.. విహార యాత్రలో నోరా ఫతేహి
-
స్మార్ట్ ఛార్జింగ్ కేస్తో జేబీఎల్ ఇయర్బడ్స్.. ధర ఎంతంటే?
-
కార్యకర్తతో కాళ్లు కడిగించుకొని..వివాదంలో కాంగ్రెస్ నేత