సీనియర్ సహాయకుల వాంగ్మూలం సేకరణ
నిజామాబాద్ రిజిస్ట్రేషన్ల శాఖను కుదిపేసిన అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో కీలక అడుగు ముందుకు పడింది. విచారణ అధికారి, మెదక్ జిల్లా రిజిస్ట్రార్ రవీందర్ నిజామాబాద్లోని డీఐజీ కార్యాలయంలో గురువారం విచారణ చేపట్టారు. సస్పెన్షన్కు
నిజామాబాద్ నేరవార్తలు, న్యూస్టుడే: నిజామాబాద్ రిజిస్ట్రేషన్ల శాఖను కుదిపేసిన అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో కీలక అడుగు ముందుకు పడింది. విచారణ అధికారి, మెదక్ జిల్లా రిజిస్ట్రార్ రవీందర్ నిజామాబాద్లోని డీఐజీ కార్యాలయంలో గురువారం విచారణ చేపట్టారు. సస్పెన్షన్కు గురైన ఇద్దరు సీనియర్ సహాయకుల వాంగ్మూలం సేకరించారు. అధికారులపై వచ్చిన ఆరోపణలు, విచారణలో గుర్తించిన సమాచారంతో శాఖాపరమైన చర్యల కోసం నివేదిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
* స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో నాన్ లేఅవుట్లు, నాలా లేని భూములకు దస్తావేజులు పుట్టించిన వ్యవహారం ఇటీవల తీవ్ర చర్చకు దారితీసింది. బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం, జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి విచారణకు ఆదేశించడంతో అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం బయటపడింది. ఈక్రమంలో గతేడాది నవంబరులో విచారణ జరిపి ముగ్గురు అధికారులను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి నుంచి శాఖాపరమైన విచారణ మొదలుపెట్టారు. తాజాగా ఇద్దరు అధికారులు అక్రమాలు చేసినట్లు గుర్తించి ఆర్టికల్ ఆఫ్ ఛార్జెస్ ఉత్తర్వులు జారీ చేశారు. వీటి ఆధారంగానే శాఖాపరమైన విచారణ జరుగుతున్నట్లు సమాచారం.
కలెక్టర్ విచారణ..
పాలనాధికారి సైతం ప్రత్యేకంగా 2021 ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరులో జరిగిన రిజిస్ట్రేషన్ల దస్తావేజుల వివరాలు సేకరించి విచారణ చేయిస్తున్నారు. ఇది దాదాపుగా కొలిక్కి వచ్చినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్షరమే ఆయుధం.. ప్రజాహితమే బలం
[ 09-06-2024]
రామోజీరావు.. అక్షరయోధుడు.. ‘ఈనాడు’ అనే మూడు అక్షరాలకు ఐదు దశాబ్దాల క్రితం పురుడుపోశారు.. ప్రజాహితమే పరమార్థంగా కదిలారు.. సబ్బండ వర్గాలకు భరోసా ఇచ్చారు.. ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించే సామాన్యుడి పత్రికగా మార్చారు. -
ఏకరూప దుస్తులు కుట్టడం పూర్తవ్వాలి
[ 09-06-2024]
పాఠశాలలు ప్రారంభించేనాటికి ఏకరూప దుస్తులు కుట్టడం పూర్తిచేయాలని మహిళా సంఘాల సభ్యులకు జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. -
బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం
[ 09-06-2024]
న్యాయ సంబంధ కారణాలతో ఎనిమిది నెలలుగా నిలిచిపోయిన ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ యథాతథంగా కొనసాగించేలా శుక్రవారం సాయంత్రం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ప్రణాళిక విడుదల చేశారు. -
నేడే గ్రూప్-1 పరీక్ష
[ 09-06-2024]
జిల్లాలో గ్రూప్-1 పరీక్షను ఆదివారం పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాకేంద్రంలో 12 కేంద్రాల్లో 4,797 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. -
బోధన్లో కత్తిపోట్ల కలకలం
[ 09-06-2024]
బోధన్ పట్టణంలోని ఓ కల్లుబట్టీ వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం జరగడంతో అది కత్తిపోట్లకు దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబోధన్కు చెందిన గంగాధర్(38) మరో వ్యక్తి జీవన్సింగ్ (65) ఇరువురి మధ్య వివాదం చోటుచేసుకుంది. -
ఏ ‘ఆధారం’ లేదు
[ 09-06-2024]
ఫొటోలో కనిపిస్తున్న వృద్ధుడు కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన నాగుల(కుర్మ) గంగయ్య. ఈయన భార్య నర్సవ్వ 25 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. -
చైన్ లాగిన ఆకతాయి.. నిలిచిన హిసార్ ఎక్స్ప్రెస్
[ 09-06-2024]
జనరల్ బోగీలో ఓ ఆకతాయి చైన్ లాగడంతో రైలు రైల్వేగేటు వద్ద ఆగిపోయిన ఘటన నిజామాబాద్ జిల్లాకేంద్రంలో చోటుచేసుకుంది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హిసార్ వీక్లీ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుంచి హరియాణా రాష్ట్రంలోని హిసార్ నగరానికి శనివారం నిజామాబాద్ మీదుగా వెళ్తోంది.