అందరి కళ్లూ ‘హింజిలి’పైనే..
రాష్ట్రంలోని అందరి దృష్టి గంజాం జిల్లా అస్కా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ‘హింజిలి’పైనే ఉంది.
నవీన్ ఆరోసారి పోటీకి దిగిన స్థానం
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: రాష్ట్రంలోని అందరి దృష్టి గంజాం జిల్లా అస్కా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ‘హింజిలి’పైనే ఉంది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వరుసగా అయిదుసార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొంది అధికారపీఠాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఆయన ఈ నియోజకవర్గం నుంచి ఆరోసారి నామినేషన్ దాఖలు చేశారు. గతంలో కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం రెండు దశాబ్దాలకుపైగా బిజద ఖాతాలో చేరింది. 1956 నుంచి 1990 వరకూ వరుసగా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. మధ్యలో ఒకసారి జనతాదళ్, ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడి నుంచి విజయం సాధించారు. 1997లో తండ్రి బిజు పట్నాయక్ మరణానంతరం నవీన్ పట్నాయక్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1997లో అస్కా లోక్సభ ఉప ఎన్నికలో ఆయన పోటీచేసి విజయం సాధించారు. ఆ తర్వాత తండ్రి పేరిట బిజు జనతాదళ్ (బిజద) ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేసి పగ్గాలు చేపట్టి 2000 సంవత్సరంలో తొలిసారిగా హింజిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి వరుసగా అయిదుసార్లు ఈ నియోజకవర్గం ఓటర్లు ఆయనకు పట్టం కట్టారు.
పోటీలో ప్రత్యర్థులు
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇటీవల హింజిలి, శెరగడ సమితుల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయాచోట్ల నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్న నవీన్ హింజిలి, శెరగడ సమితులు దేశఖ్యాతి గాంచాయన్నారు. ప్రజలంతా మరోసారి శంఖాల గుర్తులపై ఓట్లేసి లోక్సభ, అసెంబ్లీ బిజద అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. ఈ నియోజకవర్గం నుంచి ఈసారి భాజపా అభ్యర్థిగా శిశిర్ మిశ్ర, కాంగ్రెస్ అభ్యర్థిగా రజనీకాంత్ పాఢి బరిలోకి దిగారు. వీరితోపాటు ఆప్, ఎస్యూసీఐ (కమ్యూనిస్టు) తదితర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు. నియోజకవర్గ ప్రజలు ఈసారి ఎవరికి పట్టం కడతారన్నది త్వరలో తేలుతుంది. ఆరోసారి గెలుపొంది నవీన్ రికార్డు సాధిస్తారని బిజద నాయకులు దీమా వ్యక్తం చేస్తుండగా, దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ పవనాలు వీస్తున్నాయని, ఆ ప్రభావం హింజిలిలో ఏ మేరకు ఉంటుందన్నది వేచి చూడాలని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తమ గెలుపు నిశ్చయమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డ్రైనేజీ ప్రవాహంలో బాలుడు మృతి
[ 18-06-2024]
భువనేశ్వర్లో మంగళవారం మధ్యాహ్నం విషాధ ఘటన చోటుచేసుకుంది. -
రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలి
[ 18-06-2024]
ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్, అక్షరయోధుడు రామోజీరావుకు ‘భారత రత్న’ ఇవ్వాలని వివిధ తెలుగు సంస్థలు తీర్మానించాయి. -
కిన్నెరుల తరఫున ఎస్పీకి వినతి పత్రం
[ 18-06-2024]
కిన్నెర సంఘం తరఫున మంగళవారం ఎస్పీ రోహిత్ వర్మకు వినతి పత్రం అందజేశారు. -
ఆదివాసీలకు దేశీ విత్తనాలు పంపిణీ
[ 18-06-2024]
కోరాపుట్ జిల్లాలో అంతరించి పోతున్న సేంద్రియ వ్యవసాయం, దేశీ విత్తనాల వాడకం పనరుజ్జింపచేసేందుకు స్వచ్ఛంద సంస్థ సభ్యులు అడుగులు వేస్తున్నారు. -
నకిలీ సీబీఐ అధికారి అరెస్టు
[ 18-06-2024]
కోరాపుట్ జిల్లా బొయిపరిగుడ సమితిలో సీబీఐ అధికారిగా ప్రజలను మొసగించి, బెదిరించి దోచుకుంటున్న యువకుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. -
కొత్త ప్రభుత్వం కొలువుదీరినా.. తొలగించని మోసర్కర్ బోర్డులు
[ 18-06-2024]
రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం కొలువుదీరినంతరం గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన 5టీ, మోసర్కార్ బోర్డులను తొలగించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. -
5 రోజుల్లో లక్ష మందిని కలిసిన ఒడిశా సీఎం
[ 18-06-2024]
ప్రజా సమస్యలు వినేందుకు ప్రజాప్రతినిధులు ఐదు నిమిషాలు కేటాయించడమంటే గగనంగా మారిపోతున్న రోజులివి. -
100 రోజుల్లో అందుతాయా..?
[ 18-06-2024]
నవీన్ సర్కార్ 25 ఏళ్లలో చేయలేక పోయిన పనులు భాజపా ప్రభుత్వం అయిదేళ్లలో పూర్తి చేయాలి. దాంతోపాటు ఎన్నికల ముందు.. -
ప్రాణాలు పోతున్నాయి..!
[ 18-06-2024]
రాయగడ జిల్లాలో రహదారులు రక్తమోడుతున్నాయి. ఏటికేడు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. -
15 మంది బాధితుల గుర్తింపు
[ 18-06-2024]
జిల్లాలోని కాశీపూర్ సమితి డొంగశిల పంచాయతీ మునుస్పొదర్ గ్రామాన్ని పీడిస్తున్న అంతుచిక్కని వ్యాధిగ్రస్థుల సంఖ్య 15కి చేరుకుంది. -
19న బిజద సభాపక్షం భేటీ
[ 18-06-2024]
బిజద అధినేత నవీన్ పట్నాయక్ అధ్యక్షతన బుధవారం (19న) సాయంత్రం భువనేశ్వర్లోని శంఖభవన్ (బిజద కార్యాలయం)లో ఆ పార్టీ సభాపక్షం నేతల సమావేశం జరగనుంది. -
సెఫాలి కొండకు మహర్దశ
[ 18-06-2024]
మూడున్నర దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని సెఫాలి కొండపై ఉన్న రామేశ్వర ఆలయానికి మంచి రోజులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావడంతో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. -
పిడుగుపాటుకు ఆవులు మృతి
[ 18-06-2024]
పిడుగుపాటుకు 20 ఆవులు మృతి చెందిన ఘటన మల్కాన్గిరి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఇంటర్ విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు
-
పాస్ పుస్తకాలు, ధ్రువీకరణ పత్రాలపై ఫొటోలు, రాజకీయ రంగులు ఉండొద్దు
-
దేశవ్యాప్తంగా 41 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ పీఆర్సీ ఛైర్మన్ మన్మోహన్సింగ్ రాజీనామా
-
నడిరోడ్డుపై దారుణం.. యువతిని ఇనుపరాడ్డుతో కొట్టి..ప్రాణాలు తీసి..