దేశ చరిత్రను కాపాడేది ఆచార్యులే
ప్రాచీన చరిత్రను కాపాడేందుకు ఆచార్యులంతా సమాయత్తం కావాలని ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ పిలుపునిచ్చింది.
ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ సర్వసభ్య సమావేశంలో వక్తలు
సమావేశానికి హాజరైన అధ్యాపకులు
కరెన్సీనగర్, న్యూస్టుడే: ప్రాచీన చరిత్రను కాపాడేందుకు ఆచార్యులంతా సమాయత్తం కావాలని ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఏపీ హిస్టరీ కాంగ్రెస్ కార్యవర్గ నిర్వాహక కమిటీ సమావేశం ఆదివారం విజయవాడలోని ఆంధ్రా లయోల కళాశాల ఎస్జే బ్లాకులో నిర్వహించారు. కమిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మొవ్వా శ్రీనివాసులరెడ్డి, ఆచార్య కిరణ్ క్రాంత్ చౌదరి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రాచీన, మధ్య యుగ, ఆధునిక చరిత్రలను ఆయా ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని, కొన్ని పాఠ్యాంశాలను తొలగించేందుకు సిద్ధపడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. వచ్చే ఏడాది జనవరిలో వార్షిక సమావేశాన్ని విశాఖపట్నం బుల్లయ్య కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. కొత్తగా నిర్వహించే సదస్సుకు అధ్యక్షునిగా గుంటూరు హిందూ కళాశాల విశ్రాంత అధ్యాపకులు ఎం.సోమశేఖర్ను ఎన్నుకున్నారు. మిగిలిన విభాగాలకు సంబంధించి నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఎస్.మురళి మోహన్ (ప్రాచీన చరిత్ర), కావలి జవహర్ భారతి డిగ్రీ కళాశాల నుంచి డాక్టర్ జె.కృష్ణ ప్రసాద్బాబు(మధ్యయుగ చరిత్ర), మైసూరు రీజనల్ విద్యా సంస్థ తరఫున ఆచార్య ఎస్.ఎస్.గాంధీ(ఆధునిక చరిత్ర), మౌలానా ఆజాద్ విశ్వవిద్యాలయం నుంచి ఆచార్య ఎస్.ఎన్.అజీజ్ హుస్సేన్ (చరిత్ర రచన) అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. సమావేశంలో చరిత్ర అధ్యాపకులు ఎ.రామచంద్రారెడ్డి, కొప్పర్థి వెంకట కృష్ణమూర్తి, కొల్లూరి సూర్యనారాయణ, గోవిందు సురేంద్ర, డాక్టర్ అజయ్బాబులు పాల్గొన్నారు. తొలుత ప్రిన్సిపల్ ఫాదర్ జి.ఎ.పి.కిషోర్, తెలుగు సీనియర్ అధ్యాపకులు ఆర్.రవీంద్ర భాస్లు సభ్యులను సమావేశానికి ఆహ్వానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమ్మతోడు ఆ రోజు నేను లేను.. తొడగొట్టినోళ్లు హడలెత్తుతున్నారు
[ 01-06-2024]
‘అమ్మతోడు.. నేను ఆ రోజు గొడవల్లో ఎక్కడా లేను! అయినా నన్ను స్టేషన్కు పిలుస్తున్నారు. బైండోవర్ చేస్తామంటున్నారు. నాకు ఆ గొడవలతోనే ఎలాంటి సంబంధం లేదు. నేను స్టేషన్కు రానన్నా..’ ఇదీ అధికార పార్టీకి చెందిన ఒక యువ నాయకుడి బేల మాటలు. -
కౌంట్డౌన్.. 4వ తేదీ ఖాళీల్లేవ్..!
[ 01-06-2024]
ఇప్పుడు ఎక్కడ చూసినా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు పైనే అందరి చూపులు. ఎవరు గెలుస్తారు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయ్.. ఎవరు అధికారాన్ని కైవసం చేసుకుంటారు.. ఏ నలుగురు కలిసినా సర్వత్రా ఇదే చర్చ. ఇదే సమయంలో లెక్కింపు రోజున జిల్లా కేంద్రం ఒంగోలులో ఉండి ఫలితాలు తెలుసుకోవడం పైనా పలువురు ఆసక్తి చూపుతున్నారు. -
బాబోయ్.. తీగలూ తెగుతున్నాయ్
[ 01-06-2024]
రోహిణి కార్తెలో ఎండలకు రోళ్లు పగులుతాయనేది నానుడి. రోళ్ల సంగతి తర్వాత.. భానుడి భగభగలకు కాలం చెల్లిన విద్యుత్తు తీగలిప్పుడు తెగి పడుతున్నాయి. గత మూడు రోజులుగా క్రమేణా పెరుగుతున్న ఎండలు ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు. -
నిన్న కందిపప్పు.. నేడు గోధుమ వంతు
[ 01-06-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చే సరకులను పెంచుతామని ప్రకటించిన జగన్.. ఇప్పుడు గతంలో ఇచ్చిన వాటిలోనే కోతలు పెడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసి ఓట్ల లెక్కింపునకు సిద్ధమవుతున్న సమయంలో జూన్ నెల రేషన్ కోటాలోనూ కోత పెట్టారు. -
ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ ఏర్పాట్లు
[ 01-06-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 4న ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజినీరింగ్ కళాశాలలో చేపట్టనున్న ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఒంగోలు ప్రకాశం భవన్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
రూ. 338.. అధరగొట్టిన పొగాకు
[ 01-06-2024]
అంతర్జాతీయ మార్కెట్లో పొగాకు పంటకు మంచి డిమాండ్ ఏర్పడడంతో అన్ని వేలం కేంద్రాల్లో ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఇతర దేశాల్లో పంట దిగుబడి తగ్గింది. దీంతో ఆంధ్రా సీజన్లో ఉత్పత్తికి డిమాండ్ ఏర్పడింది. -
కొండలు కొల్లగొట్టేస్తున్నారు
[ 01-06-2024]
కంభం మండలంలోని చిన్నకంభం గ్రామ సమీపంలోని విద్యుత్తు ఉప కేంద్రం సమీపంలోని కొండ నుంచి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారు. జేసీబీ ఏర్పాటు చేసి మట్టి తవ్వి ట్రాక్టర్లతో కంభం, బేస్తవారపేట పట్టణాలకు అక్రమంగా తరలిస్తున్నారు. -
పేదరాలి పొలంపై వైకాపా పెత్తనం
[ 01-06-2024]
వైకాపా నాయకులు చెప్పిందే తడవుగా పైసలు ఇస్తే చాలు సి.ఎస్.పురం మండల రెవెన్యూ అధికారులు ఒకరి భూమిని మరొకరి పేరుపై బదలాయించేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా సాగులో ఉన్న రైతులకు సంబంధించిన అసైన్మెంట్ భూములను గుట్టుచప్పుడు కాకుండా ఇతరుల పేరుపై మార్చేస్తున్నారు. -
మద్యం మత్తులో బీరు సీసాతో దాడి
[ 01-06-2024]
మద్యం మత్తులో తన స్నేహితుడే 108 అంబులెన్సు డ్రైవర్పై బీరు సీసాతో దాడి చేసిన సంఘటన కురిచేడు మండలం బోధనంపాడులో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన షేక్ అబుదావలి, వేమా రమేష్లు స్నేహితులు. -
22 ఎయి‘డెడ్’ పాఠశాలలు
[ 01-06-2024]
ఎయిడెడ్ వ్యవస్థ క్రమంగా కనుమరుగుతోంది. ఒక్క విద్యార్థి కూడా లేని 22 ఎయిడెడ్ పాఠశాలలను మూసివేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆయా యాజమాన్యాలకు శుక్రవారం తుది ఉత్తర్వులు జారీ చేసింది. -
చెవిరెడ్డి బెదిరింపులకు తలొగ్గనందుకే ఆర్వోపై వేటు
[ 01-06-2024]
ఒంగోలు ఎంపీ వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి బెదిరింపులకు తలొగ్గనందుకే యర్రగొండపాలెం ఆర్వో శ్రీలేఖను బాధ్యతల నుంచి తప్పించారని ఆ నియోజకవర్గ పరిశీలకుడు వేములకొండ శ్రీనివాస్ విమర్శించారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీస్టార్’ ఆడకపోవడానికి కారణమిదే!
-
పాండ్య ‘బ్యాకప్’ పేసర్.. బౌలింగ్ కాంబినేషన్ అలా ఉంటే తిరుగుండదు: గావస్కర్
-
సల్మాన్పై లారెన్స్ బిష్ణోయ్ ట్రిగర్.. పాక్ నుంచి ఏకే-47 తుపాకులు..!
-
విజయవాడలో డయేరియా మరణాలు ఆందోళనకరం: చంద్రబాబు
-
గవర్నర్ను కలిసిన సీఎం రేవంత్.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం..
-
వైఎస్సార్ జిల్లాలో పోలీసుల తనిఖీలు.. కారులో తరలిస్తున్న రూ.1.5 కోట్లు స్వాధీనం