నౌపడలో ఓటర్లకు వైకాపా ప్రలోభం
సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వైకాపా కార్యకర్తలు, నాయకులు పావులు కదుపుతున్నారు. పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో తమ పార్టీకే ఓటు పడుతోంది అని నిర్ధారించుకున్న ఇళ్లకు వెళ్లి చిట్టీలను ఇస్తున్నారు.
ఇంటింటికీ చిట్టీలు పంచుతున్న నేతలు
సంతబొమ్మాళి, న్యూస్టుడే: సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వైకాపా కార్యకర్తలు, నాయకులు పావులు కదుపుతున్నారు. పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో తమ పార్టీకే ఓటు పడుతోంది అని నిర్ధారించుకున్న ఇళ్లకు వెళ్లి చిట్టీలను ఇస్తున్నారు. ఒక్కో ఓటరుకు రూ.2 వేలు ఇస్తామని నమ్మబలుకుతున్నారు. ఒక కుటుంబంలో ముగ్గురు ఉంటే స్లిప్పుపై 6 అని సంఖ్య రాసి ఇస్తున్నారు. స్లిప్పులు ఇచ్చిన ఓటరు మొబైల్ నంబరు, ఫొటోలు తీసుకొని మభ్యపెడుతున్నారు. ఆ ఇంటి గోడపై ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా ‘జగన్ కోసం సిద్ధం’ స్టిక్కర్లు అతికిస్తున్నారు. స్లిప్పులను జాగ్రత్తగా దాచుకోవాలని, కొంత మంది రహస్యంగా వచ్చి అందులో ఉన్న ప్రకారం డబ్బులిస్తారని చెబుతున్నట్లు గ్రామంలో జోరుగా ప్రచారం సాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిడుగుల వాన
[ 02-06-2024]
జిల్లాలో పలుచోట్ల శుక్రవారం రాత్రి ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలాస డివిజన్లో అత్యధికంగా, శ్రీకాకుళంలో సాధారణ వర్షం కురిసింది. -
తవ్వకాలతో ముప్పు.. కలగదా కనువిప్పు..?
[ 02-06-2024]
ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట మందస మండలాలకు సంబంధించి 50 వేల ఎకరాలకు పైగా పంట పొలాలకు సాగునీరు అందించడానికి రెండు నదులపై వివిధ ప్రాజెక్టులు నిర్మించారు. -
ఎన్నికల ఫలితాల ప్రకటనలో అలసత్వం వద్దు
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ నెల 4న చేపట్టే ఓట్ల లెక్కింపు సమయంలో ఫలితాల ప్రకటన విషయంలో సంబంధిత అధికారులు ఎలాంటి అలసత్వం వహించవద్దని కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ ఆదేశించారు. -
ఈసారీ ఎదురుచూపులేనా..?
[ 02-06-2024]
ఇంటర్ విద్యార్థులు పాఠ్యపుస్తకాలు లేకుండా చదువు సాగిస్తున్నారు. గతంలో ప్రభుత్వ కళాశాలల్లో ఉచితంగా సరఫరా చేసేవారు. -
గంటలోనే ముగించేశారు..!
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికల నియమావళి అమలులో ఉండటం, ఓట్ల లెక్కింపు ప్రభావం జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశంపై పడింది. -
ఆంక్షలు ఇవీ.. గమనించండి..!
[ 02-06-2024]
జిల్లాలో ఈ నెల 4న జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో వాహనాల రాకపోకలకు సంబంధించి ఆంక్షలు విధించారు. -
ఆర్భాటమే మిగిలింది
[ 02-06-2024]
మండలం పరిధి బూర్జపాడులో పాలకేంద్రం నిర్మాణమిది. పునాదులు వేసి పిల్లర్ల నిర్మాణం చేపట్టి మధ్యలోనే ఆపేశారు. బిల్లుల మంజూరులో జాప్యం నెలకొంది. -
ఇచ్చేది గోరంత.. కోరేది కొండంత
[ 02-06-2024]
శిక్షణలో వంటల తయారీకి నూనె ఎంత వేయాలి, పప్పు దినుసులు, మసాలా ఎంత వాడాలో చెబుతున్నారు. మెలకువలు నేర్పిస్తున్నారు.