ముఖ్యమంత్రితో విద్యార్థులు
రాష్ట్రంలో సోమవారం విడుదలైన 12వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన నగరానికి చెందిన ట్రాన్స్జెండర్ నివేద, నాంగునేరిలో కులవివక్షకు గురైన చిన్నదురై మంగళవారం ముఖ్యమంత్రి స్టాలిన్ను కలిశారు.
ముఖ్యమంత్రిని కలిసిన విద్యార్థులు
చెన్నై, న్యూస్టుడే: రాష్ట్రంలో సోమవారం విడుదలైన 12వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన నగరానికి చెందిన ట్రాన్స్జెండర్ నివేద, నాంగునేరిలో కులవివక్షకు గురైన చిన్నదురై మంగళవారం ముఖ్యమంత్రి స్టాలిన్ను కలిశారు. విద్యార్థులను అభినందించి తిరుక్కురళ్ పుస్తకాలు, పెన్నులను సీఎం కానుకగా అందించారు. వెంట పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేశ్ పొయ్యామొళి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శివ్దాస్ మీనా, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కుమరగురుభరన్, సంచాలకులు అరివొళి, తిరునెల్వేలి జిల్లా విద్యాధికారి ముత్తుసామి ఉన్నారు. సచివాలయం ప్రాంగణంలో విలేకర్లతో విద్యార్థి చిన్నదురై మాట్లాడుతూ.. ఎక్కువ మార్కులు పొందినందుకుగాను ముఖ్యమంత్రి పిలిపించి అభినందించారని తెలిపారు. మంత్రి అన్బిల్ మహేశ్ పొయ్యామొళి కూడా అభినందించారని పేర్కొన్నారు. సీఏ చదవాలన్నది ఆశయమని, సహాయం అందించనున్నట్టు ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారని తెలిపారు. కులవివక్షతో దాడికి పాల్పడిన విద్యార్థుల గురించి పాత్రికేయులు ప్రశ్నించగా... అందరూ ఐక్యతతో ఉండాలని, తనపై దాడికి పాల్పడిన విద్యార్థులూ బాగా చదివి వృద్ధిలోకి రావాలని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జయలలిత సిద్ధాంతాలపై జగడం.. తమిళనాట రాజకీయాల్లో తీవ్ర చర్చ
[ 02-06-2024]
జయలలిత హిందుత్వవాది అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయవర్గాల్లో పెనుదుమారం రేపుతున్నాయి. అన్నామలై ఇటీవల విలేకర్లతో మాట్లాడుతూ.. -
కాషాయ వస్త్రాలతో సూర్యారాధన
[ 02-06-2024]
కన్నియాకుమరిలోని వివేకానంద స్మారక మండపంలో ప్రధాని మోదీ ధ్యానం ముగిసింది. శనివారం ఉదయం 5.50కు కాషాయ వస్త్రాలతో బయటకొచ్చిన ప్రధాని సూర్యారాధన చేశారు. -
త్వరలో పిత్తల మాత్తి విడుదల
[ 02-06-2024]
మాణిక్క విద్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పిత్తల మాత్తి’. ఇందులో ఉమాపతి రామయ్య, సంస్కృతి, బాల శరవణన్, తంబి రామయ్య, దేవదర్శిని, విద్యుల్లేఖ రామన్, ‘ఆడుకళం’ నరేన్, ‘కాదల్’ సుకుమార్ తదితరులు నటించారు. -
‘కలైజ్ఞర్ 100’ ప్రదర్శన ప్రారంభం
[ 02-06-2024]
దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శతజయంతి ముగింపు వేడుకలు సందర్భంగా ప్యారిస్ కార్నర్లోని రాజా అన్నామలై హాలులో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను నటుడు ప్రకాశ్రాజ్ శనివారం ప్రారంభించారు. -
షరతులతో పర్యాటకులకు అనుమతి
[ 02-06-2024]
ప్రధాని మోదీ ధ్యానం సందర్భంగా గురువారం కన్నియాకుమరి వివేకానంద స్మారక మండపానికి పర్యాటకులను అనుమతించలేదు. శుక్రవారం అనుమతించారు. లగేజీ, సెల్ఫోన్లు తదితరాలను తీసుకెళ్లనివ్వలేదు. -
భాజపా రికార్డు సృష్టిస్తుంది
[ 02-06-2024]
లోక్సభ ఎన్నికల్లో భాజపా రికార్డు సృష్టించి ప్రధాని మోదీ మూడోసారి ప్రధాని అవుతారని కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్ ధీమా వ్యక్తం చేశారు. -
చెన్నైలో తల్లిపాల విక్రయంపై నిఘా
[ 02-06-2024]
చెన్నైలో తల్లిపాల విక్రయాలపై నిఘా పెట్టేందుకు 18 బృందాలు ఏర్పాటు చేసినట్లు ఆహారభద్రతాశాఖ అధికారులు తెలిపారు. చెన్నై మాధవరం ప్రాంతంలో చట్టవిరుద్ధంగా తల్లిపాలు సీసాల్లో పెట్టి విక్రయిస్తున్న ప్రైవేట్ మందుల దుకాణానికి
తాజా వార్తలు (Latest News)
-
ఎగ్జిట్ పోల్స్కి విలువ లేదు.. మమత రియాక్షన్ ఇదే!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
సినీ నటుడి బ్యాగులో 40 బుల్లెట్ల గుర్తింపు
-
అమిత్షాపై ఆరోపణలు.. జైరాం రమేష్కు ఈసీ నోటీసులు
-
ఫుడ్ పాయిజనింగ్.. 42 మంది బీటెక్ విద్యార్థులకు అస్వస్థత
-
రాహుల్జీ.. ఇప్పటికైనా పగటి కలలు కనడం మానండి: రవిశంకర్