ఐటీనా.. అదెక్కడుంది..!
యువతకు అత్యధిక ఉద్యోగాలు కల్పించే ఐటీ రంగం జగన్ పాలనలో కుదేలైంది. చంద్రబాబు హయాంలో విశాఖలోని ఐటీ హిల్స్పై నెలకొల్పిన సంస్థలు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయో తెలియని పరిస్థితి.
విశాఖలో సాంకేతిక రంగాన్ని అటకెక్కించిన జగన్
ఇంజినీరింగ్ చేసిన యువతను వాలంటీర్లుగా మార్చిన వైకాపా
యువతకు అత్యధిక ఉద్యోగాలు కల్పించే ఐటీ రంగం జగన్ పాలనలో కుదేలైంది. చంద్రబాబు హయాంలో విశాఖలోని ఐటీ హిల్స్పై నెలకొల్పిన సంస్థలు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయో తెలియని పరిస్థితి. వైకాపా పాలనలో విశాఖలోని పలు ఐటీ సంస్థలు ఇక్కడి నుంచి పారిపోయే దుస్థితికి తీసుకొచ్చారు. ఐటీ టెక్నాలజీలో ఇంజినీరింగ్ చదువులు పూర్తి చేసిన విద్యార్థులకు ఉపాధి లేక పొరుగు రాష్ట్రాలకు వలస పోతున్నారు. చివరికి ఇక్కడ ఉద్యోగాలు లేక రూ.5 వేల గౌరవ వేతనానికి వాలంటీర్లుగా కూడా పని చేస్తున్న ఇంజినీరింగ్ చేసిన పట్టభద్రులున్నారంటే ఐటీ రంగం దుస్థితిని అంచనా వేయొచ్చు.
న్యూస్టుడే, పెందుర్తి, వేపగుంట, పరవాడ, సబ్బవరం
- బీటెక్ పూర్తి చేసినా..: నేను బీటెక్ పూర్తి చేశాను. విశాఖలో ఎలాంటి ఉపాధి అవకాశాలు రాలేదు. ప్రాంగణ ఎంపికల్లో ఉద్యోగాలొచ్చినా ఎటూచాలని జీతాలతో పొరుగు రాష్ట్రాల్లో పని చేయడం చాలాకష్టం. చాలామంది యువత నైపుణ్యాలు లేక మంచి ఉద్యోగాలు సాధించలేకపోతున్నారు. నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా యువతకు మెరుగులు దిద్దితే మంచి ఉపాధి పొందే అవకాశం ఉంటుంది.
ఎ.ఉమామహేశ్వరరావు, పులగవానిపాలెం
ఐటీ మంత్రిది విశాఖే అయినా..
ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ విశాఖకు చెందిన వ్యక్తే అయినప్పటికీ జిల్లాకు ఒక్క పరిశ్రమ తెప్పించలేకపోయారు. ఐటీ రంగాన్ని ప్రోత్సహించినట్లయితే యువతకు ఎక్కువగా ఉద్యోగాలు వచ్చేవి. విద్యార్థులు కుటుంబ సభ్యులను వదిలిపెట్టి మరో గత్యంతరం లేక బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలకు వలస పోతున్నారు.
ఎస్.ఆర్.కృష్ణ, సబ్బవరం
ఐటీ హబ్ ఎక్కడుందో తెలీదు..:
జిల్లాలోనే ఐటీ మంత్రి ఉన్నప్పటికీ ఒక్కటంటే ఒక్క ఐటీ కంపెనీని ప్రారంభించలేకపోయారు. నగరంలో ఐటీ హబ్ను ఏర్పాటు చేస్తామని గత ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. అది ఎక్కడ ఏర్పాటు చేశారన్నది ఆయనకే తెలియాలి. ఐటీ రంగం అభివృద్ధి చేయకపోవడంతో విద్యార్థులంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
సంధ్య, సింహాద్రినగర్
- యువతను మోసం చేసిన జగన్..: సీఎం జగన్మోహన్రెడ్డి ఐటీ రంగాన్ని నిర్వీర్యం చేశారు. ఆయన హయాంలో ఎటువంటి పరిశ్రమలు రాలేదు. ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని గొప్పగా ప్రచారం చేసుకుని దాన్నీ గాలికొదిలేశారు. చంద్రబాబు హయాంలో ఐటీ రంగం అభివృద్ధి చెందడంతో ఎంతోమంది దేశ, విదేశాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.
మేడశెట్టి బాలాజీనాయుడు, ఈ.భోనంగి
- పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది..: ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఐటీ ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లిపోవాల్సి వస్తోంది. ఈ ఐదేళ్లలో నాకు తెలిసిన వారిలో చాలామందికి స్థానికంగా ఉపాధి అవకాశాలు లభించలేదు. ముఖ్యంగా మహిళలకు స్థానికంగా ఉపాధి అవకాశాలు లభిస్తే చాలా సౌలభ్యంగా ఉంటుంది. వారు కూడా ఇప్పుడు తప్పక ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేయాల్సి వస్తోంది.
ఉమామహేశ్వరి, ప్రహ్లాదపురం
- మౌలిక సదుపాయాలు లేవు..: పరిశ్రమలు రావాలంటే మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఎంటర్ప్రెన్యూర్స్కు కావాల్సిన భూమి, విద్యుత్తు, నీరు సదుపాయాలు కల్పిస్తే సంస్థలు ఏర్పాటు చేస్తారు. గతంలో స్కిల్ డవలప్మెంట్ కేంద్రాల్లో శిక్షణ ఇచ్చి మరీ ఉద్యోగాలు వచ్చేలా చేశారు. ఇలాంటి వాటిమీద ప్రస్తుత ప్రభుత్వానికి అవగాహన లేకపోవడం బాధాకరం.
ఎం.వర్థన్, సబ్బవరం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖలో జరిగిన ఆ కిడ్నాప్.. ఇప్పటికీ ఓ మిస్టరీ!
[ 18-06-2024]
విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఘటన రాష్ట్రంలోనే సంచలనం రేపింది. ఆ కిడ్నాప్ జరిగి ఏడాది పూర్తయింది. -
కేజీహెచ్ ఐసీయూలో పేలిన వెంటిలేటర్ బ్యాటరీ..
[ 18-06-2024]
విశాఖ కేజీహెచ్లో సోమవారం అర్ధరాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. హఠాత్తు ఘటనతో రోగులు, సహాయకులు భయాందోళన చెందారు. -
అంతా.. మా ఇష్టం!!
[ 18-06-2024]
విశాఖ జిల్లా క్రికెట్ సంఘం (వీడీసీఏ) కార్యవర్గంలో కొందరు ఏళ్ల తరబడి పదవులు అనుభవిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. -
వైకాపా రక్తం ప్రవహిస్తున్న పోలీసులు స్వచ్ఛందంగా వెళ్లిపోండి..
[ 18-06-2024]
‘గత ప్రభుత్వంలో కొంత మంది పోలీసులు వైకాపా తొత్తులుగా పని చేశారు. ఒంటిపై ఖాకీ చొక్కాను వదిలితే వైకాపా కండువా వేసుకోవడానికి కూడా సిద్ధపడిపోయారు. -
జగన్కు రాజమహళ్లు.. పేదలకు పునాదుల్లేని ఇళ్లు!!
[ 18-06-2024]
రుషికొండపై భవనాలకు నీళ్లలా చేసిన ఖర్చుతో సమకూర్చిన హంగులు బాహ్య ప్రపంచానికి తెలియడంతో ప్రతి ఒక్కరూ నివ్వెరపోతున్నారు. మరో వైపు... -
ప్రపంచ ర్యాంకింగ్లో విశాఖ పోర్టుకు 20వ స్థానం
[ 18-06-2024]
ప్రపంచ ర్యాంకింగ్లో విశాఖ పోర్టు అథారిటీ ఉత్తమ స్థానాలకు చేరుకుందని పోర్టు ఛైర్మన్ అంగముత్తు ఒక ప్రకటనలో తెలిపారు. -
ఉంటాయా.. కొట్టుకుపోతాయా?
[ 18-06-2024]
జగనన్న కాలనీల్లో నిర్మాణంలో ఉన్న గృహాలు వర్షాలకు కొట్టుకుపోయేలా ఉన్నాయి. ఒక సెంటు లేఅవుట్లలో విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) చేపట్టిన అభివృద్ధి పనులు విస్తుగొలుపుతున్నాయి. -
ఇక్కడేది ఆ వేగం ?
[ 18-06-2024]
గత వైకాపా ప్రభుత్వం నిర్వాకం కారణంగా రాష్ట్రానికి రైల్వేజోన్ రాకుండా పోయింది.. మరో పక్క విశాఖ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందాన ఉన్నాయి. -
పాఠ్యాంశాలపై పట్టు... కొలువు ఒడిసిపట్టు
[ 18-06-2024]
పట్టుమని పద్దెనిమిదేళ్ల ప్రాయంలోనే కంపెనీల్లో కొలువులు సాధించడంలో పాలిటెక్నిక్ విద్యార్థులు ముందుంటున్నారు. -
చేపలరేవు జెట్టీలో బోటు మునక
[ 18-06-2024]
చేపలవేటకు బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న బోటు (మరపడవ) సోమవారం తెల్లవారుజామున జెట్టీలో మునిగిపోయింది. -
దశలవారీగా హామీల అమలు
[ 18-06-2024]
ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నానని, దశల వారీగా అమలు చేస్తానని అనకాపల్లి ఎంపీగా ఎన్నికైన సీఎం రమేశ్ పేర్కొన్నారు. -
తప్పు చేసినా తప్పించేద్దాం
[ 18-06-2024]
అనకాపల్లిలో నకిలీ పొదుపు రుణాల కుంభకోణం నుంచి వెలుగు సిబ్బందిని బయట పడేయ డానికి డీఆర్డీఏ అధికారులు ఆరాటం చూపుతున్నారని తెలుస్తోంది. -
పాఠశాలల విలీనం జీవో రద్దు చేయాలి
[ 18-06-2024]
కూటమి ప్రభుత్వం జీవో నం. 117ను వెంటనే రద్దు చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ డిమాండు చేశారు. -
ముంపు సమస్య నివారణకు కృషి
[ 18-06-2024]
ఎలమంచిలిలో ముంపు సమస్యను సత్వరమే పరిష్కరిస్తానని కృషి చేస్తానని ఎమ్మెల్యేగా ఎన్నికైన సుందరపు విజయ్కుమార్ హామీ ఇచ్చారు. -
బాలలందరూ బడికెళ్లేలా
[ 18-06-2024]
సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే యోచనతో ‘నేను బడికి పోతా’ వినూత్న కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. -
గంజాయి రవాణాను అడ్డుకోవాలి
[ 18-06-2024]
గంజాయి రవాణా అడ్డుకోవాలని, విచ్చలవిడిగా అమ్మకాలు సాగించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖా మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. -
అమూల్.. ఢమాల్..!
[ 18-06-2024]
జగనన్న పాలవెల్లువ పేరుతో హెరిటేజ్, ఇతర సహకార డెయిరీలను దెబ్బకొట్టాలని గత ప్రభుత్వం తీసుకొచ్చిన అమూల్ డెయిరీల కథ ఢమాల్ అయ్యింది. వైకాపా సర్కారు అన్నీ తానై అమూల్కు మేళ్లు చేకూర్చినా పాలసేకరణలో ముందుకు వెళ్లలేకపోయింది. -
ఆంగ్లేయుల సమాధులకు రక్షణ: అయ్యన్న
[ 18-06-2024]
విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు చేతిలో హతమైన బ్రిటిష్ సైనికాధికారులు హైటర్, కవర్డ్ల సమాధుల ప్రాంత పరిరక్షణకు తనవంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.