జె-బ్రాండ్లతో ప్రజారోగ్యం గుల్ల
రాష్ట్రంలో జె-బ్రాండ్ల మద్యం తాగి 30 వేల మంది కిడ్నీ, లివర్ వ్యాధుల బారిన పడ్డారు.. అనారోగ్యాలు బయటపడని వారు ఎంతమంది ఉన్నారో అంచనాలకు అందని పరిస్థితి ఉందని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణ రాజు పేర్కొన్నారు.
వైకాపాకు 25 అసెంబ్లీ స్థానాలు కూడా రావు
రఘురామకృష్ణరాజు వెల్లడి
మాట్లాడుతున్న ఎంపీ, చిత్రంలో రామరాజు, నాగరాజు తదితరులు
ఉండి, న్యూస్టుడే: రాష్ట్రంలో జె-బ్రాండ్ల మద్యం తాగి 30 వేల మంది కిడ్నీ, లివర్ వ్యాధుల బారిన పడ్డారు.. అనారోగ్యాలు బయటపడని వారు ఎంతమంది ఉన్నారో అంచనాలకు అందని పరిస్థితి ఉందని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణ రాజు పేర్కొన్నారు. ఉండిలో ఆదివారం జరిగిన తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత ఎన్నికలకు జగన్ రూ.10 వేల కోట్లు తీసినా ఆశ్చర్యపోవాల్సి అవసరం లేదన్నారు. ఉండిలో తన నామినేషన్ తిరస్కరణకు గురయ్యేలా చేసేందుకు ముగ్గురు న్యాయవాదులను పంపి రకరకాల ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో కుప్పం, మంగళగిరి, పిఠాపురం, ఉండి అసెంబ్లీ స్థానాలపై జగన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టి కుట్రలకు రంగం సిద్ధం చేశారన్నారు. మనమంతా కలిసికట్టుగా ముందుకెళ్లి శత్రువును మట్టి కరిపించాలని పిలుపునిచ్చారు. తాను చేయించిన వేర్వేరు సర్వేల ఆధారంగా జగన్కు 20-25 అసెంబ్లీ సీˆట్లు కూడా రావని తేలిందని పేర్కొన్నారు.
జగన్ కోవర్టులా శివరామరాజు
ఉండి నియోజకవర్గంలో తెదేపాకు 55- 56 శాతం ఓట్లు పడతాయని సర్వేలో తేలిందన్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే శివరామరాజు జగన్ కోవర్టులా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైకాపా ఓట్లనే నరసింహరాజు, శివరామరాజు పంచుకొనే అవకాశం ఉందన్నారు. పార్టీ కోసం పదవిని త్యాగం చేసి నాయకుడు రామరాజు అని, పార్టీని అల్లరి చేస్తున్నది శివరామరాజు అనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నవ్యాంధ్రకు చంద్రుడు.. నవచరితకు ఆద్యుడు
[ 13-06-2024]
‘‘నవ్యాంధ్ర రథసారథిగా.. చంద్రన్న కొలువుదీరారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వేదికగా.. లక్షలాది అభిమానులు.. వేలాది ఆత్మీయులు.. వందలాది బంధుమిత్రులు తరలిరాగా.. ప్రధాని మోదీ సమక్షంలో.. బుధవారం ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. -
అపురూప ఘట్టం.. ఆనంద వీక్షణం
[ 13-06-2024]
జయజయ ధ్వానాల జోరు..బాణసంచా కాల్పుల హోరు..గ్రామగ్రామాన తెదేపా, జనసేన, భాజపా జెండాల రెపరెపలు..ఇదీ కూటమి మంత్రి వర్గ ప్రమాణస్వీకార మహోత్సవం నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమలో కనిపించిన దృశ్యాలు. -
అనుభవానికి అందలం
[ 13-06-2024]
ఏలూరు, పశ్చిమ జిల్లాల్లో మంత్రి పదవుల ఎంపికలో కూటమి ప్రభుత్వం అనుభవం..ఆలోచనల వైపు మొగ్గు చూపింది. ఏలూరు జిల్లా నుంచి నూజివీడు ఎమ్మెల్యే పార్థసారథి మూడోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, -
బడిబాటలో తడబాటు
[ 13-06-2024]
పాఠశాలలు గురువారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. గతంలో చేపట్టిన అదనపు గదులు, ఇతర నిర్మాణాలను వేసవి సెలవుల్లో పూర్తి చేయలేకపోవడంతో ఈ విద్యా సంవత్సరంలోనూ విద్యార్థులకు ఇబ్బందులు తప్పేలాలేవు. -
బడిలో సవాళ్లు
[ 13-06-2024]
వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు గురువారం పునఃప్రారంభం కానున్నాయి. సర్కారు బడులు సమస్యలతో విద్యార్థులకు స్వాగతం పలకనున్నాయి. పలుచోట్ల నాడు- నేడు రెండో విడత పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. -
ప్రత్యేక చిన్నారుల భవితకు బాటలు
[ 13-06-2024]
సాధారణ విద్యను అభ్యసించలేని ప్రత్యేక అవసరాలున్న చిన్నారుల కోసం మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన భవిత కేంద్రాలకు బాలల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. మే 1 నుంచి నియోజకవర్గంలోని నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, -
తక్కువ సమయంలో అధిక రాబడి
[ 13-06-2024]
రసాయన ఎరువుల వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించి తక్కువ పెట్టుబడితో అధికోత్పత్తి సాధించడమే లక్ష్యంగా ఖరీఫ్ ప్రణాళిక అమలుకు వ్యవసాయశాఖ సన్నద్ధమైంది. -
అభిమానంతో.. ఉచితంగా అల్పాహారం
[ 13-06-2024]
ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకొని జంగారెడ్డిగూడేనికి చెందిన ఆయన అభిమాని, టీ స్టాల్ యజమాని ఎం.రాజు, ఆయన కుమారుడు బుధవారం ఉదయం -
ఉసురు తీసిన గుట్టలు
[ 13-06-2024]
జాతీయ రహదారి 165 విస్తరణ పనుల్లో గుత్తేదారు నిర్లక్ష్యంతో వాహనదారుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మండవల్లి భైరవపట్నం బస్టాండ్ సమీపంలో నిర్మాణం పూర్తైన రోడ్డుపై రాత్రికి రాత్రే తారు చిప్స్ కలిపిన గుట్టలు పోయడం.. -
జీవో 117ను రద్దు చేయాలి
[ 13-06-2024]
ఉపాధ్యాయులపై పనిభారం తగ్గించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.సాయిశ్రీనివాస్ కోరారు. భీమవరంలో బుధవారం జరిగిన సంఘం జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
ఆకివీడులో ‘అన్న క్యాంటీన్’
[ 13-06-2024]
కూటమి ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు సూచనల మేరకు కూటమి నాయకులు ఆకివీడు గాంధీ విగ్రహం -
కలెక్టరేట్ వెలవెల!
[ 13-06-2024]
నూతన ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా బుధవారం రాష్ట్రమంతా సందడి వాతావరణం నెలకొంది. కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయ భవనాలను సుందరంగా ముస్తాబు చేశారు. -
ఇదేంది గురూ!
[ 13-06-2024]
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పురపాలక కార్యాలయంలో వైకాపా నాయకులు బుధవారం ఉదయం రాజకీయ సమావేశం నిర్వహించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. -
అధినేతను సీఎంగా చూసి.. అనంతలోకాలకు.!
[ 13-06-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న క్రమంలో ఆయన్ను చూసేందుకు వచ్చిన ఓ అభిమాని గుండెపోటుతో మరణించడం విషాదం నింపింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రూ.15లక్షలకు ఒప్పందం.. 3లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీసీఎస్ ఇన్స్పెక్టర్
-
అమెరికా విద్యార్థి వీసా ప్రక్రియ షురూ.. గతేడాది కంటే ఎక్కువ!
-
దివంగత రామోజీరావుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాళి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
సిమెంట్ వ్యాపారంలో అదానీ దూకుడు.. అంబుజా చేతికి పెన్నా సిమెంట్
-
ఇటలీకి పయనమైన ప్రధాని మోదీ.. మూడో హయాంలో తొలి విదేశీ పర్యటన