BJP: లైంగిక వేధింపుల ఎఫెక్ట్.. బ్రిజ్భూషణ్ స్థానంలో కుమారుడికి టికెట్
BJP: లోక్సభ ఎన్నికలకు భాజపా మరో విడత జాబితా విడుదలైంది. ఎంపీ బ్రిజ్భూషణ్ స్థానంలో ఆయన కుమారుడికి టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ కంచుకోట రాయ్బరేలీలో అభ్యర్థిని ప్రకటించింది.
దిల్లీ: అనుకున్నట్లే జరిగింది. రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ బ్రిజ్భూషణ్ (Brij Bhushan)ను ఈ ఎన్నికల్లో (Lok Sabha Elections) భారతీయ జనతా పార్టీ (BJP) పక్కనబెట్టింది. అయితే ఆ స్థానంలో ఆయన కుమారుడికి టికెట్ కల్పించింది. ఉత్తరప్రదేశ్లోని కైసర్గంజ్ స్థానం నుంచి కరణ్ భూషణ్ సింగ్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక రాయబరేలీ (Raebareli) నుంచి దినేశ్ ప్రతాప్ సింగ్ను నిలబెట్టింది.
కైసర్గంజ్ లోక్సభ స్థానానికి వరుసగా మూడు పర్యాయాలుగా బ్రిజ్భూషణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో 2లక్షల మెజార్టీతో విజయం సాధించారు. అయితే లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ గతేడాది జనవరిలో అగ్రశ్రేణి రెజ్లర్లు ఆయనకు వ్యతిరేకంగా రోడ్డెక్కి ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బ్రిజ్భూషణ్ పేరు వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలోనే రెజ్లింగ్ సమాఖ్య నుంచి వైదొలిగిన ఆయన క్రీడారాజకీయాలకు స్వస్తి పలికారు. అయితే, జాతీయ స్థాయి రెజ్లర్ల ఆందోళన నేపథ్యంలో ఆయనపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ క్రమంలోనే తాజా ఎన్నికల్లో ఆయనను భాజపా హైకమాండ్ పక్కనబెట్టింది.
కానీ, ఉత్తరప్రదేశ్లో అతిపెద్ద బాహుబలి నేతల్లో ఒకరిగా బ్రిజ్భూషణ్కు పేరుంది. భారీ సంఖ్యలో కేసులు ఉన్నప్పటికీ.. ఎంపీగా ఏకంగా ఆరుసార్లు పార్లమెంట్కు ఎన్నికయ్యారు. విద్యాసంస్థలు, అఖాడాలు నిర్వహిస్తూ యువతలో పాపులారిటీ సంపాదించారు. యూపీలోని గోండా చుట్టుపక్కల అరడజను జిల్లాలో ఆయన హవా కనపడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే కైసర్గంజ్ స్థానంలో పార్టీ ఆయన కుమారుడికి అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.
బ్రిజ్భూషణ్ చిన్న కుమారుడైన కరణ్ ప్రస్తుతం యూపీ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. గోండాలోని కో-ఆపరేటివ్ విలేజ్ డెవలప్మెంట్ బ్యాంక్కు అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్నారు. బ్రిజ్భూషణ్ మరో కుమారుడు ప్రతీక్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు.
రాయ్బరేలీ బరిలో మంత్రి..
ఇక, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్బరేలీ స్థానంలో రాష్ట్ర మంత్రి దినేశ్ ప్రతాప్ సింగ్ను బరిలోకి దించింది. 2019 ఎన్నికల్లోనూ ఈయన సోనియాపై పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2022లో శాససమండలి నుంచి ఎన్నికై కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. తొలుత ఈ స్థానం నుంచి వరుణ్ గాంధీని నిలబెడతారని ప్రచారం జరిగింది. పార్టీ ప్రతిపాదనకు ఆయన తిరస్కరించినట్లు తెలిసింది.
కాగా.. ఈ లోక్సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న సోనియా ఇటీవలే రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. కుమార్తె కోసమే ఆమె పోటీ నుంచి వైదొలిగినట్లు వార్తలు వచ్చాయి. రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తారని గత కొంతకాలంగా వినిపిస్తున్నా.. దీనిపై కాంగ్రెస్ ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు. అమేఠీ, రాయ్బరేలీ స్థానాలకు హస్తం పార్టీ ఈ రోజే అభ్యర్థులను ఖరారు చేసే అవకాశముంది.
కైసర్గంజ్, అమేఠీ, రాయ్బరేలీ స్థానాలకు ఐదో విడతలో భాగంగా మే 20వ తేదీన పోలింగ్ జరగనుంది. నామినేషన్ దాఖలు చేయడానికి తుదిగడువు రేపటి (మార్చి 3)తో ముగియనుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. -
స్వాతీ మాలీవాల్పై దాడి ఘటన.. కేజ్రీవాల్ ఇంటి ముందు భాజపా నిరసన
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతీ మాలీవాల్పై జరిగిన దాడికి వ్యతిరేకంగా భాజపా అరవింద్ కేజ్రీవాల్ నివాసం ముందు నిరసనకు దిగింది. -
నాలుగు దశలు దాటాక ఇండియా కూటమి బలపడింది: ఖర్గే
ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించనుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. నాలుగు దశల్లో ముగిసిన పోలింగ్లో బలంగా పుంజుకొందని తెలిపారు. -
ఆ రోజు ముస్లిం స్నేహితులే అన్నం పెట్టేవారు: మోదీ
తానెప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలు చేయనని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. తనకు ఎంతోమంది ముస్లిం స్నేహితులు ఉన్నారని చెప్పారు. -
కంగనా ఆస్తుల విలువ రూ.90 కోట్లు
మండీ లోక్సభ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తనకు రూ.90 కోట్లకుపైగా ఆస్తులున్నట్లు నామినేషన్ పత్రాల్లో ప్రకటించారు. -
యూపీలో కాంగ్రెస్కు ఎర్రటోపీ బాసట
ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామ్యపక్షమైన కాంగ్రెస్కు సమాజ్వాదీ పార్టీ శ్రేణులు అండగా నిలుస్తున్నాయి. సీట్ల పంపకంలో భాగంగా యూపీలో 17 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. -
ప్రచార తారలు ఆదర్శంగా ఉండాలి
సార్వత్రిక ఎన్నికల్లో మిగిలిన మూడు దశల్లో జాతీయ పార్టీల ప్రచార తారలు (స్టార్ క్యాంపెయినర్లు) ఇతరులకు ఆదర్శంగా మెలగాలని, సమాజంలో సున్నితమైన కూర్పును పాడుచేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. -
రాయ్బరేలీ, అమేఠీలు మా కర్మభూమి
ఉత్తర్ప్రదేశ్లోని అమేఠీ, రాయ్బరేలీ అంటే తమ దృష్టిలో కేవలం లోక్సభ నియోజకవర్గాలు మాత్రమే కావని, అవి తమ కర్మభూమి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పేర్కొన్నారు.
తాజా వార్తలు
-
ఆటకు దూరమైతే.. మీకు అస్సలు కనిపించను: విరాట్ కోహ్లీ
-
కంగనా ‘ఎమర్జెన్సీ’ మరోసారి వాయిదా.. కారణమిదే
-
హోర్డింగ్ కూలిన ఘటన: కారులోనే నలిగిన ప్రాణాలు.. రెండు రోజులకు గుర్తింపు
-
ఆ మాట చెబుతుంటే వారిద్దరు ఏడ్చారు: అంతర్జాతీయ కెరీర్కు సునీల్ ఛెత్రి వీడ్కోలు
-
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయ ముప్పు.. ఎవరీ రాబర్ట్ ఫికో?
-
ఏపీ పట్టణ ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యం