Brij Bhushan: బ్రిజ్ భూషణ్కు టికెట్ కట్..!
ఉత్తరప్రదేశ్ బాహుబలి నేతల్లో ఒకరైన బ్రిజ్భూషణ్కు ఈ సారి భాజపా టికెట్ కట్ చేసినట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్డెస్క్: వివాదాస్పద భాజపా నేత, ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan)కు ఈ సారి లోక్సభ ఎన్నికల్లో పార్టీ టికెట్ కట్ చేసినట్లు తెలుస్తోంది. కైసర్గంజ్ నుంచి అతడు ప్రస్తుతం ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా జాతీయ స్థాయి రెజ్లర్ల ఆందోళన ఫలితంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆ పార్టీ వర్గాలే ఓ ఆంగ్ల వార్తా ఛానెల్కు వెల్లడించాయి. కాకపోతే అతడి కుమారుడు కరణ్ భూషణ్ సింగ్కు టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు బ్రిజ్ భూషణ్ మాత్రం పార్టీ అభ్యర్థుల జాబితాలో స్థానం దక్కించుకొనేందుకు తీవ్రంగా యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఐదో విడతలో భాగంగా మే20వ తేదీన కైసర్గంజ్లో పోలింగ్ జరగనుంది. ఇక్కడ నామినేషన్ దాఖలు చేయడానికి తుదిగడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో భాజపా నేడు అభ్యర్థని ప్రకటించే అవకాశాలున్నాయి.
జాతీయ రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణ విషయంలో బ్రిజ్భూషణ్ దాదాపు రెండేళ్లుగా వార్తల్లో నానుతున్నారు. గతేడాది ఆయన రెజ్లింగ్ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. లోక్సభ ఎన్నికల దృష్ట్యా క్రీడా రాజకీయాలకు స్వస్తి చెప్పినట్లు ప్రకటించారు. తన స్థానంలో సన్నిహితుడైన సంజయ్సింగ్ను ఎంపికయ్యేందుకు కృషి చేశాడు.
బ్రిజ్భూషణ్ ఉత్తరప్రదేశ్లో అతిపెద్ద బాహుబలి నేతల్లో ఒకరిగా పేరున్న వ్యక్తి. ఎంపీగా ఏకంగా ఆరుసార్లు పార్లమెంట్లో అడుగుపెట్టిన నాయకుడు. భారీ సంఖ్యలో కేసులు ఉన్నా రకరకాల రాజ్యాంగ పదవులను అనుభవిస్తున్నాడు. భారీ ఎత్తున విద్యాసంస్థలు, అఖాడాలు నిర్వహిస్తూ యువతలో పాపులారిటీ సంపాదించాడు. యూపీలోని గోండా చుట్టుపక్కల అరడజను జిల్లాలో బ్రిజ్భూషణ్ హవా కనపడుతుంది. ఈ నేపథ్యంలో భాజపా ఇతడి విషయంలో తక్షణమే నిర్ణయం తీసుకోవడం లేదనే విమర్శలను ఎదుర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. -
స్వాతీ మాలీవాల్పై దాడి ఘటన.. కేజ్రీవాల్ ఇంటి ముందు భాజపా నిరసన
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతీ మాలీవాల్పై జరిగిన దాడికి వ్యతిరేకంగా భాజపా అరవింద్ కేజ్రీవాల్ నివాసం ముందు నిరసనకు దిగింది. -
నాలుగు దశలు దాటాక ఇండియా కూటమి బలపడింది: ఖర్గే
ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించనుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. నాలుగు దశల్లో ముగిసిన పోలింగ్లో బలంగా పుంజుకొందని తెలిపారు. -
ఆ రోజు ముస్లిం స్నేహితులే అన్నం పెట్టేవారు: మోదీ
తానెప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలు చేయనని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. తనకు ఎంతోమంది ముస్లిం స్నేహితులు ఉన్నారని చెప్పారు. -
కంగనా ఆస్తుల విలువ రూ.90 కోట్లు
మండీ లోక్సభ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తనకు రూ.90 కోట్లకుపైగా ఆస్తులున్నట్లు నామినేషన్ పత్రాల్లో ప్రకటించారు.
తాజా వార్తలు
-
ఉప్పల్ మ్యాచ్ వర్షార్పణం.. ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్.. చివరి బెర్తు ఎవరిదో?
-
భూముల మార్కెట్ విలువలు సవరించాలి: సీఎం రేవంత్
-
‘గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ’.. వీడియో వైరల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM