మార్పు దిశగా నంద్యాల తీర్పు!
నందుల కోట నంద్యాల లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఓటర్ల ఆలోచనా విధానంలో మార్పు వచ్చిందా? అధికార వైకాపా కోటలు బీటలు వారనున్నాయా? అయిదేళ్ల నుంచి ప్రభుత్వ నిరంకుశ విధానాలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేల అరాచకత్వం, ఆక్రమణలు, దౌర్జన్యాలు, బెదిరింపులు సామాన్యులనూ ఆత్మరక్షణలోకి నెట్టేశాయి.
వైకాపా దమనకాండపై రగులుతున్న పౌరులు
ఓటుతో సమాధానం చెప్పేందుకు సిద్ధం
అయిదేళ్లలో దాడులు, దౌర్జన్యాలు, కబ్జాలే
డోన్లో ఆర్థిక మంత్రికి ఎదురుగాలి!
బనగానపల్లిలో కాటసాని కబ్జా కోటకు బీటలు
కలిసి నడిస్తే కూటమిదే నందికొట్కూరు
నంద్యాల, పాణ్యం, ఆళ్లగడ్డ, ఆత్మకూరులలో దూసుకెళుతున్న కూటమి అభ్యర్థులు
నంద్యాల లోక్సభ నియోజకవర్గం నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి
నందుల కోట నంద్యాల లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఓటర్ల ఆలోచనా విధానంలో మార్పు వచ్చిందా? అధికార వైకాపా కోటలు బీటలు వారనున్నాయా? అయిదేళ్ల నుంచి ప్రభుత్వ నిరంకుశ విధానాలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేల అరాచకత్వం, ఆక్రమణలు, దౌర్జన్యాలు, బెదిరింపులు సామాన్యులనూ ఆత్మరక్షణలోకి నెట్టేశాయి. ఎన్నికల్లో తగిన తీర్పునిచ్చేందుకు వారు సిద్ధమవుతున్నారు. తమ అసహనాన్ని ఓట్ల రూపంలో నిక్షిప్తం చేసేందుకు దృఢమైన నిర్ణయానికి వస్తున్నారు. పాణ్యం, నందికొట్కూరు, ఆత్మకూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్, బనగానపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో ‘ఈనాడు’ ప్రతినిధి పర్యటించారు. ఓటర్లు కోరుకుంటున్న మేలిమార్పు ఈ పర్యటనలో కనిపించింది. మనసులోని మాటను నలుగురిలో నిర్భయంగా చెప్పేందుకు వెనకంజ వేసిన వారు.. కాస్త దూరంగా ఒక్కరుగా వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ అయిదేళ్లు తామెంతగా వెనకబడ్డామో ప్రస్తావిస్తూనే తగిన తీర్పునిస్తామని వెల్లడించారు. వారి అభిప్రాయాల ప్రకారం ఆయా నియోజకవర్గాల రాజకీయ పరిస్థితులిలా ఉన్నాయి.
‘సండే’ ఎమ్మెల్యే.. డబ్బు వెదజల్లడంపైనే దృష్టి
నంద్యాలలో వైకాపా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డిని స్థానికులు ‘సండే’ ఎమ్మెల్యేగా పిలుచుకుంటారు. ఆదివారం తప్ప మిగిలిన రోజులు వ్యాపారాల కోసం ఇతర ప్రాంతాల్లో ఉంటారు. నియోజకవర్గంలోని బలమైన రెండు సామాజికవర్గాలు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయి. రియల్ఎస్టేట్ వ్యాపారాన్ని లాభసాటి చేసుకునేందుకు జనాభిప్రాయంతో సంబంధం లేకుండా కల్వకుర్తి-జమ్మలమడుగు జాతీయ రహదారి ఎలైన్మెంట్ మార్పు చేయించి రైతుల్లో వ్యతిరేకత మూటగట్టుకున్నారు. నగరంలో ప్రజల తాగునీటి సమస్యను తీర్చేందుకు తెదేపా హయాంలో అమలుచేసిన ‘అమృత్’ పథకంలో మిగిలిన 30 శాతం పనులనూ పూర్తి చేయించలేకపోయారు. నియోజకవర్గంలో భూకబ్జాల వంటివి ఎమ్మెల్యేకు ప్రతికూలమయ్యాయి. మధ్యలో ఒక ఉపఎన్నికలో తప్పిస్తే 2004 నుంచి శిల్పా కుటుంబం గెలుస్తుండడం, ఆర్థికంగా బలంగా ఉండడంతోపాటు వడ్డీ లేని రుణాలు, ఉచితంగా రక్షిత మంచినీటి సరఫరా, శిల్పా సూపర్మార్కెట్లో పది శాతం రాయితీతో సరకుల విక్రయాలవంటి వాటితో ఓటు బ్యాంకును పదిలం చేసుకునే ప్రయత్నాలను ఆయన కొనసాగించారు. ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు మున్సిపల్ ఛైర్పర్సన్, మార్కెట్ ఛైర్మన్ స్థానాలతోపాటు వారి వర్గానికి చెందిన ఇసాక్కు ఎమ్మెల్సీగా అవకాశం ఇప్పించుకున్నారు. అయితే ఇక్కడ కూటమి అభ్యర్థిగా పోటీలో ఉన్న ముస్లిం సామాజికవర్గానికి చెందిన స్థానికుడు, వివాదరహితుడు తెదేపా మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్కు ఆయన సామాజికవర్గంతోపాటు మరో బలమైన సామాజికవర్గం, బీసీ కులాలు మద్దతుగా నిలిచాయి. ఎమ్మెల్యే వర్గం డబ్బుతోనే రాజకీయం చేస్తుండగా, ఫరూక్ తనకున్న రాజకీయ అనుభవంతో పోరాడుతున్నారు. ఆయనకు మాజీ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి సహకరిస్తున్నారు. ఎమ్మెల్యే వర్గం పంచే డబ్బులు ప్రభావం చూపనట్లయితే ఫరూక్కు సానుకూలత ఏర్పడనుంది. నగరంలో అబ్దుల్సలాం కుటుంబం ఆత్మహత్య ఉదంతమూ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచింది.
బనగానపల్లిలో ఫ్యాన్కు ఎదురుగాలి
బనగానపల్లిలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి ఈసారి ఆయన సొంత మండలం అవుకులోనే మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. అవుకుకు చెందిన బలమైన నేతలు చల్లా రామకృష్ణారెడ్డి, బిజ్జం పార్థసారథిరెడ్డి గత ఎన్నికల్లో మద్దతివ్వడం రామిరెడ్డికి కలిసి వచ్చింది. ఈ అయిదేళ్లలో బనగానపల్లిలో వంద పడకల ఆసుపత్రి, 4 వరుసల రహదారి ఏర్పాటవడం సానుకూలాంశం. 2014-19 మధ్య ఎమ్మెల్యేగా ఉన్న బీసీ జనార్దనరెడ్డి గ్రామీణ రహదారులను నిర్మించడం, తాగునీటి సరఫరాతోపాటు మినరల్ వాటర్ ప్లాంట్లను విరివిగా ఏర్పాటు చేయించడాన్ని గ్రామీణులు గుర్తు చేసుకుంటున్నారు. కాటసానికి ఉన్నట్లు బీసీ జనార్దనరెడ్డికి ఫ్యాక్షన్ ముద్ర లేకపోవడం కలిసి వస్తోంది. ఆయా గ్రామాల్లోని బలమైన నాయకత్వమూ ప్రస్తుతం తెదేపాలో చేరుతోంది. తన వర్గం దౌర్జన్యాలు కాటసానికి ప్రతికూలమయ్యాయి. బీసీ జనార్దనరెడ్డికి అవకాశాలు పెరిగాయి.
పాణ్యంలో కబ్జా కథ కంచికి చేరేనా?
ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఏలుబడిలో పాణ్యం భూకబ్జాలకు పెట్టింది పేరుగా మారింది. గడివేముల, ఓర్వకల్లు మండలాల్లో ఎమ్మెల్యేకు ఎదురుగాలి వీస్తోంది. నియోజకవర్గంలో కీలకమైన కల్లూరు పట్టణం, గ్రామీణంలో లక్షన్నరకుపైగా ఓట్లున్నాయి. ఇక్కడి తెదేపా నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించారు. తెదేపాలో ఇటీవల చేరిన మాజీ మంత్రి బైరెడ్డి రాజశేఖరరెడ్డి కల్లూరులోనే నివసిస్తూ క్రియాశీలమవడంతో క్షేత్రస్థాయిలో పార్టీ మళ్లీ పుంజుకుంటోంది. వ్యతిరేకతను అధిగమించేందుకు రాంభూపాల్రెడ్డి భారీగా ఖర్చుపెడుతున్నారు. ఈ నియోజకవర్గంలోనే పెద్దసంఖ్యలో బోగస్ ఓట్లను నమోదు చేయించారని వెల్లడైంది. అయితే ఇక్కడ తెదేపా కూటమి అభ్యర్థి గౌరు చరితకు మహిళగా సానుకూలత ఉంది. బైరెడ్డి, గౌరుచరితల సమష్టి కృషితోపాటు ప్రభుత్వ వ్యతిరేకత కాటసానికి కష్టకాలం తెచ్చిపెట్టిందన్న వ్యాఖ్యలు వినిపించాయి.
నంది కొట్కూరు.. సమష్టిగా పోరాడితే తెదేపాదే!
‘వైకాపా నుంచి పోటీకి అవకాశం దక్కక కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన సిటింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ చీల్చే ప్రతి ఓటూ నిర్ణయాత్మకం కానుంది. తెదేపాలోకి బైరెడ్డి రాజశేఖరరెడ్డి పునరాగమనంతో తిరిగి ఆయన వైపు పార్టీ శ్రేణులు వెళుతున్నాయి. వైకాపా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న బైరెడ్డి సిద్దార్థరెడ్డి వర్గంలో చీలిక వచ్చింది. వైకాపా అభ్యర్థి సుధీర్ దారా స్థానికుడు కాకపోవడం పార్టీకి ప్రతికూలాంశం. పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పోరాడుతుండటంతో వైకాపా నామమాత్రపు మెజారిటీతోనైనా బయటపడే అవకాశం ఉందన్న చర్చ కొద్ది రోజుల వరకు నడిచింది. తాజాగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కూటమి అభ్యర్థి జయసూర్య (తెదేపా), ఎంపీ అభ్యర్థి శబరి, సీనియర్ నేతలు మాండ్ర శివానందరెడ్డి, బైరెడ్డి రాజశేఖరరెడ్డి, గౌరు వెంకటరెడ్డిలు కలిసి నియోజకవర్గంలో పర్యటిస్తే పరిస్థితులు మరింత సానుకూలమవుతాయి.
డోన్లో బుగ్గన అణచివేత రాజకీయం
డోన్లో బుగ్గన రాజేంద్రనాథరెడ్డి రణనీతికి కోట్ల జయసూర్యప్రకాశ రెడ్డి పెద్దరికం చెక్ పెడుతోంది. ‘అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి జగన్ జైలుకు వెళితే రాజానే ముఖ్యమంత్రి’ అని ఆయన వర్గం డోన్లో కొంతకాలం ప్రాభవాన్ని చాటింది. ‘నియోజకవర్గంలో రాజా గుత్తాధిపత్యం చూపారు. ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు’ అని ఆయన దగ్గరి బంధువైన మహిళ తెలిపారు. ‘ఇన్నాళ్లూ పార్టీని ఉపయోగించుకుని ఇప్పుడు తెదేపా జెండా కప్పుకొనే వారికి తిరిగి అధికారంలోకొచ్చాక తప్పనిసరిగా గిఫ్ట్ ఇస్తా’ అని ఈ మధ్య బుగ్గన హెచ్చరించారు. తన బంధువులైనా సరే లొంగి ఉండకపోతే అణచివేస్తారని, స్వప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తారని, ప్రశ్నిస్తే ఎంతటివారినైనా ఆర్థికంగా దెబ్బకొడతారని బుగ్గన గురించి స్థానికులు చెబుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి జయసూర్యప్రకాశ రెడ్డిని ఇక్కడ కూటమి అభ్యర్థిగా బరిలోకి దింపాక డోన్, ప్యాపిలి, బేతంచెర్లలో తెదేపాలోకి వలసలు పెరిగాయి. గతంలో కోట్ల కుటుంబం చేసిన అభివృద్ధినీ స్థానికులు గుర్తు చేస్తున్నారు. కూటమిలో జనసేన ఉన్నందున ఆ పార్టీకి సంబంధించి బలమైన సామాజికవర్గ మద్దతూ కోట్లకు లభిస్తోంది. డోన్ మార్కెట్ ఛైర్మన్ మూర్తయ్య, మున్సిపల్ వైస్ఛైర్మన్ హరికిషన్, కౌన్సిలర్ సుబ్బలక్ష్మి, మున్సిపల్ ఛైర్మన్ రాజేశ్ పెదనాన్న సప్తశైల వెంకటేశ్, సర్పంచులు మనోహరమ్మ, అర్జున్రెడ్డి తదితరులు ఇప్పటికే వైకాపాను వీడి తెదేపాలో చేరారు. తనను మంత్రి నమ్మించి మోసం చేశారంటూ బుగ్గనకు వరుస సోదరుడు బుగ్గన ప్రభాకర్రెడ్డి వైకాపాను వీడారు.
ఆళ్లగడ్డలో హోరాహోరీ
ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డితో తెదేపా కూటమి అభ్యర్థి భూమా అఖిలప్రియ పోటీ పడుతున్నారు. చేరికలతో తెదేపా బలం పుంజుకుంటోంది. అఖిలప్రియతోపాటు ఆమె సోదరుడు విఖ్యాత్రెడ్డి భూమా కుటుంబ వారసుడిగా ప్రజాభిమానాన్ని చూరగొంటున్నారు. అఖిలప్రియ భర్త భార్గవరామ్ సామాజికవర్గం ఓట్లు ఇక్కడ నిర్ణయాత్మకమవడం కలిసొచ్చే అంశం. అఖిలప్రియ పెద్దనాన్న కుమారుడు భూమా కిశోర్రెడ్డి వైకాపాలో చేరడం, భూమా నాగిరెడ్డి స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డి అఖిలప్రియపై యుద్ధం ప్రకటించడం వంటివన్నీ ఆమె పట్ల సానుభూతి పెంచాయి. సమస్యలపై పోరాడే తత్వం, కార్యకర్తలకు అండగా నిలుస్తున్న తీరు అఖిలప్రియ నాయకత్వంపై నమ్మకాన్ని పెంచుతున్నాయి. నియోజకవర్గంలో భూమా, గంగుల తర్వాత పేరున్న ఇరిగెల రాంపుల్లారెడ్డి ఇప్పుడు ఆమెకు మద్దతుగా నిలిచారు. బైరెడ్డి రాజశేఖరరెడ్డి అండ కలిసిరానుంది. ఎమ్మెల్యే బ్రిజేంద్రరెడ్డి 2019లో 35 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచినప్పటికీ.. అదంతా అప్పుడున్న రాజకీయ పరిస్థితుల వల్లనేనంటూ తెదేపా జనంలోకి తీసుకెళ్లగలిగింది. ‘తెదేపా విజయావకాశాలున్నాయి. కానీ.. భూమా- గంగుల కుటుంబాల పేరుతో ఎన్నికలైతే మాత్రం క్షేత్రస్థాయిలో అన్ని విధాలుగా బలంగా ఉన్న గంగుల (వైకాపా)దే పైచేయి అయ్యే అవకాశాలున్నాయి. భూమా కుటుంబసభ్యులందరినీ ఒక్కతాటిపైకి తెస్తే అఖిలప్రియ గెలుపు తథ్యం’ అని స్థానికులు చెబుతున్నారు.
శ్రీశైలంలో చేరికలతో తెదేపా జోరు
శ్రీశైలం నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మళ్లీ పోటీపడుతున్నారు. ఆత్మకూరులో వర్ధన్ బ్యాంకును ఆయన ప్రారంభించారు. ఇది రూ.కోట్ల డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసింది. దాని వెనుక ఎమ్మెల్యే ఉన్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత ఏర్పడింది. కేసులు పెట్టి వేధించడంతో అనేకమంది సొంత పార్టీ నేతలే బయటకు వెళ్లిపోయారు. ఎమ్మెల్యే సోదరుడి సెటిల్మెంట్లు, మహానంది మండలంలో ఎమ్మెల్యే అనుచరుల కబ్జాకాండ వంటివన్నీ ప్రతికూలాంశాలయ్యాయి. ఆత్మకూరులో నిర్ణయాత్మకమైన ముస్లిం ఓట్లలో వైకాపాకే గతంలో మెజారిటీ వచ్చేది. ఇప్పుడా పరిస్థితి మారింది. తెదేపా అభ్యర్థి బుడ్డా రాజశేఖరరెడ్డి ముస్లింలతో ఇటీవల నిర్వహించిన సమావేశం విజయవంతమవడం ప్రస్తావనార్హం. గతంలో వైకాపాకు మెజారిటీ వచ్చిన బండిఆత్మకూరు, మహానంది వంటి మండలాల్లోనూ పరిస్థితి మారింది. ఆత్మకూరు, వెలుగోడు మండలాల్లో మాత్రమే తెదేపా కూటమితో వైకాపా పోటీపడుతోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటమి ఖాయమని తెలిసే ప్లాన్ బీ అమలు చేశారు: వర్ల రామయ్య
ఎన్నికల్లో వైకాపా సృష్టించిన అరాచకాలపై కూటమి నేతలు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. -
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు ఖాయం: కిషన్రెడ్డి
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడుతుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
పోలీసుల అదుపులో తెదేపా నేత బాజీచౌదరి.. కుంకలగుంటలో ఉద్రిక్తత
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని కుంకులగుంటలో బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంల భద్రతపై తెదేపా ఆందోళన
స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంల భద్రతపై రాష్ట్ర ఎన్నిల ప్రధానాధికారి ఎంకే మీనాకు పొన్నూరు తెదేపా అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర ఫిర్యాదు చేశారు. -
ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం.. సీఎస్, డీజీపీకి సమన్లు
పల్నాడు, చంద్రగిరి సహా పలు హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఏపీలో 81.86 శాతం పోలింగ్: సీఈవో ముకేశ్కుమార్ మీనా
ఏపీ ఎన్నికల్లో (AP Elections 2024) 81.86 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ముగ్గురు వైకాపా ఎమ్మెల్యేలు హౌస్ అరెస్టు.. పల్నాడు జిల్లాలో భారీగా బలగాల మోహరింపు
పల్నాడు జిల్లాలో కలెక్టర్ 144 సెక్షన్ కొనసాగుతోంది. పోలింగ్ అనంతరం దాడుల నేపథ్యంలో 144 సెక్షన్ విధించారు. -
వైకాపా నేతలను ఓటమి భయం నరరూప రాక్షసులుగా మార్చింది: నారా లోకేశ్
ఓటమి భయం వైకాపా నేతలను నరరూప రాక్షసులుగా మార్చేసిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. -
తాడిపత్రిలో 144 సెక్షన్.. వేర్వేరు ప్రాంతాలకు జేసీ ప్రభాకర్, పెద్దారెడ్డి తరలింపు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు లాఠీఛార్జి చేశారు. గత రెండు రోజులుగా జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసాల వద్ద ఉన్న కార్యకర్తలను పోలీసులు లాఠీఛార్జి చేసి అదుపులోకి తీసుకున్నారు. -
వైకాపా నేతలకు తొత్తులుగా పోలీసులు: బీద రవిచంద్ర
ఐదేళ్లుగా వైకాపా పాలనలో అరాచకం కొనసాగిందని తెదేపా నేత బీద రవిచంద్ర యాదవ్ విమర్శించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా నాయకులకు అధికారులు, పోలీసులు తొత్తులయ్యారని ఆరోపించారు. -
‘రిగ్గింగ్ను అడ్డుకోవాలనే ఏజెంట్గా కూర్చున్నా’
‘మా ఊళ్లో ప్రతి ఎన్నికల్లో రిగ్గింగ్ సర్వసాధారణంగా మారింది. దీన్ని అడ్డుకోవాలనే ఏజెంట్గా ఉండాలని నిర్ణయించుకున్నా’ అని సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వేళ సోమవారం వైకాపా వర్గీయుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ పల్నాడు జిల్లా రెంటాలకు చెందిన చేరెడ్డి మంజుల తెలిపారు. -
పల్నాడు జిల్లాలో 144 సెక్షన్
పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసాత్మక సంఘటనలు రెండోరోజూ కొనసాగడంతో ఈసీ 144 సెక్షన్ అమలుకు ఆదేశించింది. ఈ మేరకు జిల్లా పాలనాధికారి శివశంకర్ పోలీసు శాఖకు ఉత్తర్వులిచ్చారు. -
150కి పైగా స్థానాల్లో కూటమిదే గెలుపు: రఘురామ
ప్రస్తుత ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి భారీ మెజారిటీలతో 150కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని.. పోలింగ్కు జనం పెద్ద ఎత్తున తరలిరావడమే దీనికి నిదర్శనమని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
వైకాపా మూకల రక్తదాహం
పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా వైకాపా రాక్షస మూకల రక్తదాహం తీరలేదు. మంగళవారం రెండో రోజూ రాష్ట్రంలో అనేక చోట్ల తీవ్ర స్థాయిలో హింసాకాండకు, విధ్వంసానికి పాల్పడ్డారు. -
నాని లక్ష్యంగా.. సమ్మెటతో వైకాపా మూకల వీరంగం
తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళ విశ్వవిద్యాలయం ఆవరణలో వైకాపా నాయకులు మారణాయుధాలతో రెచ్చిపోయారు. ఇక్కడ ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్రూమ్లను పరిశీలించేందుకు మంగళవారం మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో వచ్చిన చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం చేశారు. -
తాడిపత్రిలో పెద్దారెడ్డి అరాచకం
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎన్నికల ముందు అన్నట్లుగానే విధ్వంసకాండను సృష్టించారు. మంగళవారం తాడిపత్రిని యుద్ధభూమిగా మార్చారు. -
ఎమ్మెల్యే పిన్నెల్లి విధ్వంసకాండ
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడిలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన అనుచరులతో విధ్వంసం సృష్టించారు. తన కారుపై ఎవరో రాయి వేశారనే నెపంతో తెదేపా కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. -
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ 82.37%
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలట్తో కలిపి 82.37% మేర పోలింగ్ నమోదైనట్లు ప్రాథమిక అంచనా. రాష్ట్ర చరిత్రలో ఇంత భారీ ఎత్తున ఓటింగ్ జరగడం ఇదే తొలిసారి. -
యుద్ధప్రాతిపదికన కాలువల పనులు చేయాలి
రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం సాగునీటి కాలువల నిర్వహణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంగళవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. -
రాక్షస పాలనకు వ్యతిరేకంగా ఓటేసిన వారికి ధన్యవాదాలు
వైకాపా నాయకులు దాడులు చేసినా ప్రజలు భయపడకుండా ఓటేయడానికి ముందుకు వచ్చారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య హర్షం వ్యక్తం చేశారు. -
ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు
ఎన్నికల మహా యజ్ఞంలో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన ఓటర్లకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మంగళవారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
-
ఆ షూటింగ్లో రెండు భుజాలకు ఎన్నో గాయాలయ్యాయి: జాన్వీ కపూర్
-
‘కడుపులో పిండానికీ జీవించే హక్కు’ - సుప్రీంకోర్టు
-
‘మమ్ముట్టి’కి బాసటగా కేరళ నేతలు.. అసలు ఏం జరిగిందంటే?
-
గోల్ఫ్ ఆడడం, నచ్చింది తినడం.. మిస్టర్ కూల్ ‘ఫేవరెట్ ప్లేస్’ అదేనట!
-
డీజీపీ, ఇంటెలిజెన్స్ ఏడీజీలతో సీఎస్ జవహర్రెడ్డి అత్యవసర భేటీ
-
కార్చిచ్చుల వేళ.. అగ్నిమాపక సిబ్బందికి ఎన్నికల విధులా..?