Telangana assembly elections: నాన్న బాట.. గెలుపు వేట
వారు తండ్రిచాటు బిడ్డలు... కొందరు అనూహ్యంగా.. మరికొందరు వారసత్వంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.. నాన్నకు ప్రేమతో అంటూ.. ప్రజా జీవితంలోకి వచ్చారు. తండ్రుల ఆశయాల సాధనకు ప్రజామోదం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈనాడు, హైదరాబాద్ : వారు తండ్రిచాటు బిడ్డలు... కొందరు అనూహ్యంగా.. మరికొందరు వారసత్వంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.. నాన్నకు ప్రేమతో అంటూ.. ప్రజా జీవితంలోకి వచ్చారు. తండ్రుల ఆశయాల సాధనకు ప్రజామోదం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. వేర్వేరు పార్టీల నుంచి తలపడుతున్నారు. గెలుపు కోసం పరిశ్రమిస్తున్నారు. వారే విజయారెడ్డి, లాస్యనందిత, వెన్నెల.
పేదలకు పెద్ద దిక్కునైతా..: పి.విజయారెడ్డి
హైదరాబాద్ రాజకీయాల్లో సుదీర్ఘకాలంపాటు సేవలందించిన ప్రజా నాయకుడు పి.జనార్దన్రెడ్డి. ఖైరతాబాద్ నుంచి ఆయన కాంగ్రెస్ తరఫున 1978, 1985, 1989, 1994, 2004లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రిగా పనిచేశారు. 2007లో గుండెపోటుతో చనిపోయారు. ఆయన వారసుడిగా పి.విష్ణువర్ధన్రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 నుంచి పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి నాన్న రాజకీయ వారసత్వం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మొదటిసారి ఖైరతాబాద్ నుంచి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినా గెలుపు దక్కలేదు. ఆ తర్వాత ఆమె భారాసలో చేరి రెండుసార్లు కార్పొరేటర్గా గెలుపొందారు. ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యంతో కాంగ్రెస్లో చేరారు. ‘ప్రతి పేదవాడు సంతోషంగా ఉండాలనేది పీజేఆర్ ఆశయమని, ఆయన అడుగుజాడల్లో నేను కూడా పేదల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. అన్నారు.
పెండింగ్ పనులు పూర్తి చేయడం లక్ష్యం: లాస్యనందిత
కంటోన్మెంట్లో పిలిస్తే పలికే నేతగా సాయన్నకు గుర్తింపు. 1994 నుంచి మధ్యలో ఒకసారి మినహా 2018 వరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశంతో రాజకీయ ప్రస్థానం మొదలెట్టిన ఆయన 2015 తర్వాత భారాసలో చేరారు. అప్పుడే కుమార్తె లాస్యనందితను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఆమె కవాడిగూడ కార్పొరేటర్గా ఒకసారి గెలిచి, రెండోసారి ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. సాయన్న ఆరునెలల క్రితం అకాల మరణంతో భారాస ఈసారి టికెట్ లాస్యనందితకు కేటాయించింది. నాన్న బాటలోనే ఆమె నడుస్తున్నారు. ప్రజలందర్నీ కలుస్తున్నారు. మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో అందరివాడిగా గుర్తింపు పొందిన నాన్నమాదిరే తాను నడవాలనుకుంటున్నట్లు లాస్యనందిత చెబుతున్నారు. ‘నియోజకవర్గంలో సాయన్న మొదలెట్టిన అభివృద్ధి పనులు కొన్ని పెండింగ్లో ఉన్నాయి. వాటిని పూర్తి చేయడమే నా ముందున్న లక్ష్యం’ అని నందిత అన్నారు.
సేవ చేయడానికి..: డాక్టర్ వెన్నెల
ప్రజల్ని తన పాటలతో మేల్కొలిపిన ప్రజాగాయకుడు గద్దర్.. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా వ్యవహరించారు. తన గళంతో లక్షలాది గొంతుకల్ని ఏకం చేశారు. చాలా ఏళ్లపాటు బ్యాలెట్ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. తీరా పోటీ చేద్దామనుకునే సమయంలో ఆయనే దూరం అయ్యారు. గద్దర్ అకాలమరణంతో ఆయన కూతురు డాక్టర్ వెన్నెలకు కాంగ్రెస్ కంటోన్మెంట్ టికెట్ ఇచ్చింది. సమాజం కోసం నాన్న తపించిన తీరుగానే తానూ నడుస్తానంటూ ఎన్నికల్లో గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ప్రజలు మార్పు కోరుతున్నారని.. తన గెలుపు ఖాయం అని వెన్నెల విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
TS Elections: అభ్యర్థులు 2,290.. ఓటర్లు 3,26,02,799 ఎన్నికల విశేషాలివే..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (TS Elections) ప్రచారం ముగియడంతో పోలింగ్కు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. -
Telangana Elections: ఎన్నికలు ముగిసే వరకు మద్యం, కల్లు దుకాణాలు బంద్: సీపీ శాండిల్య
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ముగియడంతో హైదరాబాద్లో 144 సెక్షన్ అమల్లోకి వచ్చినట్లు సీపీ సందీప్ శాండిల్య వెల్లడించారు. -
KTR: తెలంగాణ ఇప్పుడెట్లుందో ఆలోచించండి.. ఆగం కాకండి: కేటీఆర్
తెలంగాణ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సిరిసిల్లలో మీడియాతో మాట్లాడారు. ప్రజలే కేంద్రంగా, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గత తొమ్మిదిన్నరేళ్ల ప్రయాణం కొత్త పంథాలో కొనసాగిందన్నారు. -
Vikasraj: సోషల్ మీడియాలోనూ ఎన్నికల ప్రచారం నిషిద్ధం: సీఈవో
ప్రచార గడువు ముగియడంతో సోషల్ మీడియాలోనూ ఎన్నికల ప్రచారం నిషిద్ధమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ (CEO Vikasraj) తెలిపారు. -
Telangana Elections: ప్రచారం పరిసమాప్తం.. పోలింగ్పైనే రాజకీయ పార్టీల గురి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు తుది అంకానికి చేరాయి. మంగళవారం సాయంత్రం 5గంటలకు మైకులు మూగబోయాయి. -
Karnataka govt: ‘ఉల్లంఘన కానే కాదు’.. పత్రికల్లో ప్రకటనలపై డీకే శివకుమార్
ఎన్నికళ వేళ తెలంగాణలోని పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం ఎన్నికల ప్రవర్తన నియామావళి కానేకాదని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఇదే విషయాన్ని ఈసీకి తెలియజేస్తామన్నారు. -
CM Kcr: గజ్వేల్ నా గౌరవాన్ని పెంచింది.. మరింత అభివృద్ధి చేస్తా: సీఎం కేసీఆర్
గత 24 సంవత్సరాలుగా తెలంగాణనే ఆశగా.. శ్వాసగా బతుకుతున్నానని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్ లో నిర్వహించిన సభలో సీఎం పాల్గొన్నారు. (Telangana Elections) -
Sonia gandhi: ‘మీరు నా మనసుకు దగ్గరగా ఉంటారు..’ తెలంగాణ ప్రజలకు సోనియా సందేశం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చారు. -
Telangana Elections: పోలింగ్ రోజు విధిగా సెలవు ప్రకటించాలి: వికాస్ రాజ్
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Telangana elections) రోజున రాష్ట్రంలోని ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు విధిగా సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ (Vikas raj) తెలిపారు. -
Eatala Rajender: కేసీఆర్.. పేదలను కొట్టి పెద్దలకు ఇస్తున్నారు: ఈటల రాజేందర్
దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని కేసీఆర్ మోసం చేశారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eatala Rajender) అన్నారు. -
KCR: తెలంగాణను అన్ని రకాలుగా గోస పెట్టింది కాంగ్రెస్సే: కేసీఆర్
50 ఏళ్ల కాంగ్రెస్ పాలన.. గత 10 ఏళ్ల భారాస పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలని ప్రజలను భారాస అధినేత, సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. -
Hyderabad: తెలంగాణ ఎన్నికలు.. విద్యాసంస్థలకు 2 రోజులు సెలవులు
తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బుధ, గురువారాల్లో విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. -
KTR: కేసీఆర్ తెలంగాణ మొత్తానికే లోకల్: కేటీఆర్
కేసీఆర్ రాకతో కామారెడ్డి పూర్తిగా మారిపోతుందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. -
Priyanka Gandhi: సాగునీటి ప్రాజెక్టుల్లో భారాస భారీగా అవినీతికి పాల్పడింది: ప్రియాంక గాంధీ
రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాద్లో నిర్వహించిన రోడ్షోలో ఆమె పాల్గొన్నారు. -
Rahul Gandhi: భాజపా చెప్పిన చోటే మజ్లిస్ పోటీ: రాహుల్ గాంధీ
ఎంఐఎం అభ్యర్థులు ఎక్కడ పోటీ చేయాలో భాజపా నిర్ణయిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అన్నారు. కాంగ్రెస్ను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే మజ్లిస్ పోటీ చేస్తోందని విమర్శించారు. -
MP Laxman: కాంగ్రెస్ బూటకపు హామీలతో మోసం చేస్తోంది: ఎంపీ లక్ష్మణ్
కాంగ్రెస్ పార్టీ పెయిడ్ సర్వేలతో ప్రజలను మోసం చేస్తోందని భాజపా ఎంపీ లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
Revanth Reddy: అధికారంలోకి వస్తే కామారెడ్డికి పెద్ద ఎత్తున పరిశ్రమలు: రేవంత్రెడ్డి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణకు చెందిన కార్మికులకు ఇతర దేశాల్లో అన్యాయం జరిగితే న్యాయం చేసేందుకు ప్రత్యేకం విభాగం ఏర్పాటు చేసి ఆదుకుంటామని చెప్పారు. -
Ashok Gehlot: భాజపా, భారాస కలిసే పనిచేస్తున్నాయ్: అశోక్ గహ్లోత్
తెలంగాణలో భాజపా, భారాస కలిసి పనిచేస్తున్నాయని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్(Ashok Gehlot) అన్నారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
Madhya Pradesh: కౌంటింగ్కి ముందే పోస్టల్ బ్యాలెట్లు చూశారు.. మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఆరోపణలు
మధ్యప్రదేశ్లో కౌంటింగ్కు ముందే పోస్టల్ బ్యాలెట్ బాక్సులు తెరిచారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. -
Rahul Gandhi: కాంగ్రెస్ గెలవగానే కార్మికులతో సీఎం సమావేశం: రాహుల్గాంధీ
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పారిశుద్ధ్య కార్మికులు సహా డెలివరీ బాయ్లు, డ్రైవర్ల సమస్యలను పరిష్కరిస్తామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ హామీ ఇచ్చారు. -
Kavitha: కాంగ్రెస్ మొసలి కన్నీరును నమ్మితే ప్రజలకు కన్నీళ్లే: ఎమ్మెల్సీ కవిత
కాంగ్రెస్ మొసలి కన్నీరును నమ్మితే ప్రజలకు కన్నీళ్లే మిగులుతాయని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ కాంగ్రెస్ నేతల సమావేశాలు మాత్రమే జరిగాయని ఎద్దేవా చేశారు.


తాజా వార్తలు (Latest News)
-
Salaar: అందుకు వారికి సారీ.. ‘సలార్’ రూమర్స్పై ప్రశాంత్ నీల్ క్లారిటీ
-
IND vs AUS: మ్యాక్స్వెల్ మెరుపు సెంచరీ.. భారత్కు షాక్
-
Uttarkashi tunnel: వారి మనోధైర్యానికి సెల్యూట్: ప్రధాని మోదీ
-
Vizag: విశాఖ కాపులుప్పాడలో డేటాసెంటర్కు భూకేటాయింపు.. ఎకరా ₹కోటి
-
Rishab Shetty: అది చాలా బాధాకరం: ఓటీటీ సంస్థలపై రిషబ్ శెట్టి
-
Digital Fraud: అనుమానాస్పద లావాదేవీలు.. 70 లక్షల మొబైల్ నంబర్లు బ్లాక్