విశాఖలో సీఎస్‌ జవహర్‌రెడ్డి రహస్య పర్యటన?

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి గురువారం ఉదయం విశాఖకు వచ్చారు. సాయంత్రం విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు.

Published : 10 May 2024 05:33 IST

విశాఖపట్నం(వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి గురువారం ఉదయం విశాఖకు వచ్చారు. సాయంత్రం విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు. వ్యక్తిగత పర్యటన కావడంతో ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులెవరూ ఆయన్ను కలవలేదు. ఎన్నికలు జరుగుతున్న వేళ సీఎస్‌ రహస్యంగా విశాఖ రావడం చర్చనీయాంశమైంది. ఆయన ఎందుకోసం వచ్చారు.. ఎవరెవరిని కలిశారనే వివరాలు అధికారులకూ తెలియక పోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని