Delhi Metro: కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
కదులుతున్న మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై 28 ఏళ్ల వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. తనకు ఎదురైన ఘటనపై బాలుడు ఎక్స్ వేదికగా పోస్టులు చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
దిల్లీ: కదులుతున్న మెట్రో (Metro Train)లోనే బాలుడిపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు దిగాడు. ఈ సంఘటన దిల్లీ (Delhi)లో చోటుచేసుకుంది. గత శుక్రవారం మెట్రోలో ప్రయాణిస్తుండగా తోటి ప్రయాణికుడు తనని లైంగికంగా వేధించినట్లు 16 ఏళ్ల బాలుడు ఎక్స్ (ట్విటర్) వేదికగా వరుస పోస్టులు పెట్టాడు. తన ప్రైవేట్ భాగాలను తాకడానికి సదరు వ్యక్తి ప్రయత్నించాడని, మెట్రో రైళ్లు మారే క్రమంలోనూ తనను వెంబడించాడని తెలిపాడు. దిల్లీలోని రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పేర్కొన్నాడు. దీనికి సంబంధించి విచారణ చేపట్టిన పోలీసులు.. నిందితుడు 28 ఏళ్ల జితేందర్ గౌతమ్గా గుర్తించారు అరెస్టు చేశారు. డిగ్రీ పూర్తి చేసిన నిందితుడు.. ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడిని పట్టుకోవడానికి ఇద్దరు ఇన్స్పెక్టర్ల నేతృత్వంలో మెట్రో సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (మెట్రో) రామ్గోపాల్ నాయక్ తెలిపారు. రాజీవ్ చౌక్ నుంచి జహంగీర్ పురి స్టేషన్ల మధ్య ఉన్న 15 మెట్రో స్టేషన్లలోని పలు సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. ఈ క్రమంలో జహంగీర్ పురి స్టేషన్లో నిందితుడు దిగిపోయినట్లు గుర్తించారు. అనంతరం నిందితుడి ట్రావెల్ హిస్టరీని పరిశీలించగా, అతడు కౌశాంబి మెట్రో స్టేషన్లో ఎక్కినట్లు గుర్తించారు. రెండు బృందాలుగా విడిపోయిన పోలీసులు.. వాయువ్య దిల్లీలోని ఓ ప్రాంతంలో గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడికి ఎలాంటి నేరచరిత్ర లేదని, పలు కోణాల్లో విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐపీసీ సెక్షన్ 355, పోక్సో సెక్షన్ 8 కింద కేసులు నమోదుచేసినట్లు రాజీవ్ చౌక్ మెట్రో పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు పట్టుబడ్డారు. ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్ హౌస్లో బర్త్ డే పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాడి చేశారు. -
ఆస్తి తగాదాను మనసులో పెట్టుకొని.. తాతను కొట్టి చంపిన మనవళ్లు
ఆస్తి తగాదాను మనసులో పెట్టుకొని నల్లా నీరు విషయంలో జరిగిన గొడవను సాకుగా తీసుకొని తాతపై మనవళ్లు దాడిచేసి చంపిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. -
అమ్మానాన్నలే హంతకులయ్యారు
అల్లారుముద్దుగా పెంచిన అమ్మానాన్నలే కుమార్తెను హతమార్చారు. మానసిక స్థితి సరిగా లేదని ఆసుపత్రులు, దేవాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదని ఆవేదన చెందిన తల్లిదండ్రులు 13 నెలల మనవడికి తల్లిని దూరం చేశారు. -
పిడుగుపాటుకు ముగ్గురు రైతుల దుర్మరణం
వికారాబాద్ జిల్లా యాలాల మండలం జుంటుపల్లి, బెన్నూరు గ్రామాల్లో పిడుగుపాటుతో ఆదివారం ముగ్గురు రైతులు దుర్మరణం చెందారు. -
రూ.105 కోట్ల హెరాయిన్ పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న హెరాయిన్ను అసోం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. -
గోవును అక్రమ రవాణా చేస్తున్నాడని.. వృద్ధుడిని బైక్తో ఈడ్చుకెళ్లిన దుండగులు
ఝార్ఖండ్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. అక్రమంగా గోవును రవాణా చేస్తున్నాడన్న అనుమానంతో 60 ఏళ్ల వృద్ధుడిని ముగ్గురు వ్యక్తులు తమ ద్విచక్ర వాహనానికి కట్టి ఈడ్చుకెళ్లారు. -
విద్యుదాఘాతంతో దంపతుల దుర్మరణం
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో విద్యుదాఘాతానికి గురై దంపతులు మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రాసిక్యూటర్ టు ప్రెసిడెంట్: ఎవరీ ఇబ్రహీం రైసీ..?
-
పల్నాడు హింసపై వైకాపా దుష్ప్రచారం: లావు శ్రీకృష్ణదేవరాయలు
-
పీఎఫ్ విత్డ్రా.. ఈ క్లెయిమ్స్పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!
-
ఇప్పటి వరకు ధోనీ మాకేం చెప్పలేదు: రిటైర్మెంట్పై చెన్నై ఫ్రాంచైజీ!
-
హెలికాప్టర్ ప్రమాదానికి ముందు.. రైసీ చివరి ఫొటో ఇదే..!
-
మరి కాసేపట్లో తెలంగాణ ఈసెట్ ఫలితాలు.. మీ eenadu.netలో