రాజంపేట
కడప జిల్లాలోని రాజంపేట లోక్సభ స్థానం (Rajampet Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. ఇది జనరల్ కేటగిరిలో ఉంది.
లోక్సభ నియోజకవర్గం
రాజంపేట నియోజకవర్గ పరిధి ఆధారంగా కొత్తగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేశారు. కడప, చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఈ లోక్సభ స్థానం ప్రత్యేకత కలిగి ఉంది. ఇంతకుముందు కడప జిల్లాలో నాలుగు సెగ్మెంట్లు, చిత్తూరు జిల్లాలో మూడు సెగ్మెంట్లు ఉండేవి. ఇక్కడి లక్కిరెడ్డిపల్లె రద్దవడంతో చిత్తూరు జిల్లాలోని నాలుగు సెగ్మెంట్లు చేరాయి. 1952లోనే నియోజకవర్గం ఏర్పాటైనప్పటికీ 1957 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి.
లోక్సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: ఈ లోక్సభ పరిధిలో 7 శాసనసభా నియోజకవర్గాలున్నాయి. రాజంపేట, రైల్వేకోడూరు (ఎస్సీ), రాయచోటి, చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు శాసనసభా నియోజకవర్గాలు దీని పరిధిలోకి వస్తాయి.
ఓటర్లు: తాజా గణాంకాల ప్రకారం 16,42,282 ఓటర్లు ఉండగా, పురుషులు 8,07,588... మహిళలు.. 8,34,550 ట్రాన్స్ జెండర్లు 144 ఉన్నారు.
2019 లోక్సభ ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేసిన మిథున్రెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెదేపా అభ్యర్థి డి.ఎ.సత్యప్రభపై విజయం సాధించారు.
2024 ఎన్నికల్లోనూ వైకాపా నుంచి మిథున్రెడ్డి బరిలో నిలిచారు. పొత్తులో భాగంగా ఈ స్థానం భాజపాకు వెళ్లింది. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డిని భాజపా బరిలో నిలిపింది. పార్లమెంటు పరిధిలో అన్ని ప్రాంతాలకు కిరణ్కుమార్రెడ్డి పరిచయమున్నారు. రాజకీయంగా చిరకాల అనుభవం ఉన్న నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ఈయన సోదరుడు నల్లారి కిశోర్కుమార్రెడ్డి రాజంపేట లోక్సభ పరిధిలోని పీలేరు శాసనసభా స్థానం నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేస్తుండటం గమనార్హం. కాంగ్రెస్ నుంచి ఎస్.కె.బషీద్ బరిలో నిలిచారు.
- ఇప్పటివరకూ గెలుపొందిన అభ్యర్థులు వీరే!
- 1957: టి.ఎన్.విశ్వనాథరెడ్డి (కాంగ్రెస్)
- 1962: సి.ఎల్.నరసింహా రెడ్డి (స్వతంత్ర)
- 1967: పి.పార్థసారథి (కాంగ్రెస్)
- 1971: పి.పార్థసారథి (కాంగ్రెస్)
- 1977: పి.పార్థసారథి (కాంగ్రెస్)
- 1980: పి.పార్థసారథి (కాంగ్రెస్)
- 1984: ఎస్.పాల కొండ్రాయుడు (తెదేపా)
- 1991: ఎ.సాయిప్రతాప్ (కాంగ్రెస్)
- 1996: ఎ.సాయిప్రతాప్ (కాంగ్రెస్)
- 1998: ఎ.సాయిప్రతాప్ (కాంగ్రెస్)
- 1999: గునిపాటి రామయ్య (తెదేపా)
- 2004: ఎ.సాయిప్రతాప్ (కాంగ్రెస్)
- 2009: ఎ.సాయిప్రతాప్ (కాంగ్రెస్)
- 2014: పెద్దిరెడ్డి మిథున్రెడ్డి (వైకాపా)
- 2019: పెద్దిరెడ్డి మిథున్రెడ్డి (వైకాపా)
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం 1952లో ఏర్పాటైంది. మొదటి నుంచి ఇది జనరల్ కేటగిరిలో ఉంది. -
తిరుపతి
చిత్తూరు జిల్లాలో ప్రతిష్టాత్మకమైన స్థానాల్లో తిరుపతి లోకసభ స్థానం ఒకటి -
కర్నూలు
కర్నూలు లోక్సభ నియోజకవర్గం (Kurnool Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. తొలి నుంచి జనరల్ కేటగిరీలోనే ఉంది. -
కాకినాడ
కాకినాడ లోక్సభ నియోజకవర్గం1952లో ఏర్పాటైంది. మొదటి నుంచి ఇది (Kakinada Lok Sabha constituency) జనరల్ కేటగిరిలోనే ఉంది. -
ఏలూరు
ఏలూరు లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇది (Eluru Lok Sabha constituency) జనరల్ కేటగిరిలో ఉంది. -
అరకు
అరకు లోక్సభ నియోజకవర్గం (Araku Lok Sabha constituency) 2008లో ఏర్పడింది. -
చిత్తూరు
చిత్తూరు లోక్సభ నియోజకవర్గం (Chittoor Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. -
అనకాపల్లి
అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం (Anakapalli Lok Sabha constituency) 1962లో ఏర్పాటైంది. మొదటి నుంచి ఇది జనరల్ కేటగిరిలో ఉంది. -
గుంటూరు
గుంటూరు లోక్సభ నియోజకవర్గం (Guntur Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. జనరల్ కేటగిరీలో ఉంది. -
మచిలీపట్నం
మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గం (Machilipatnam Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. తొలి నుంచి ఇది జనరల్ కేటగిరీలోనే ఉంది. -
అనంతపురం
అనంతపురం లోక్సభ నియోజక వర్గంలో (Anantapur Lok Sabha constituency) మొత్తం ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. -
విజయవాడ
విజయవాడ లోక్సభ నియోజకవర్గం (Vijayawada Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. మొదటి నుంచి ఇది జనరల్ కేటగిరిలో ఉంది. -
కడప
కడప లోక్సభ నియోజకవర్గం (Kadapa Lok Sabha constituency) 1952లో ఆవిర్భవించింది. ఇది మొదటి నుంచి జనరల్ కేటగిరిలోనే ఉంది. -
హిందూపురం
హిందూపురం లోక్సభ నియోజకవర్గం 1957లో ఏర్పడింది. -
విశాఖపట్నం
విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇది జనరల్ కేటగిరిలో ఉంది. -
విజయనగరం
విజయనగరం లోక్సభ నియోజకవర్గం 2008లో పునర్విభజన సమయంలో ఏర్పడింది. -
శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లాలోని ఏకైక లోక్సభ నియోజకవర్గం (Srikakulam Lok Sabha constituency) ఇది. 1952లో ఏర్పాటైన ఈ స్థానం జనరల్ కేటగిరిలో ఉంది. -
నరసాపురం
నరసాపురం లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. మొదటి నుంచి ఇది జనరల్ కేటగిరి స్థానం. -
అమలాపురం
అమలాపురం లోక్సభ నియోజకవర్గం (Amalapuram Lok Sabha constituency) 1952లో ఏర్పాటైంది. ఈ నియోజకవర్గాన్ని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించారు. -
ఒంగోలు
ఒంగోలు లోక్సభ నియోజకవర్గం (Ongole Lok Sabha constituency)1952లో ఏర్పడింది. ఇది జనరల్ కేటగిరి.
తాజా వార్తలు
-
ధోనీని ఔట్ చేయడమే టర్నింగ్ పాయింట్.. యశ్కే ఈ అవార్డు: డుప్లెసిస్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
మార్కెట్ కేంద్రంగా మొబైల్ దొంగతనాలు.. పిల్లలైతే అనుమానించరని..!
-
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
-
ఏపీ ఎన్నికల్లో విజయంపై రూ.1.75 కోట్ల పందెం
-
పెట్టుబడి అంటే పట్టుబడినట్టే.. లాభాల పేరుతో సైబర్ నేరగాళ్ల దందా