icon icon icon
icon icon icon

Pawan kalyan: వైకాపా ఫ్యాన్‌ రెక్కలు ఊడిపోయాయి.. కూటమిదే విజయం: పవన్‌కల్యాణ్‌

వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వనని ముందు నుంచే చెబుతున్నానని జనసేన (Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు.

Published : 29 Apr 2024 12:48 IST

పిఠాపురం: వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వనని ముందు నుంచే చెబుతున్నానని జనసేన (Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో ఆయన రోడ్‌షో నిర్వహించారు. గొల్లప్రోలు మండలం చందుర్తి కూడలి నుంచి వన్నెపూడి కూడలి వరకు పవన్‌ ర్యాలీ కొనసాగింది. అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్రంలోని కొన్ని పనులకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. కేంద్రం సహకారం లేకుండా కొన్ని పనులు సాధ్యం కావు. వైకాపా ఫ్యాన్‌ రెక్కలు ఊడిపోయాయి. ఆ పార్టీ ఓటమి ఖాయం.. ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుంది. నీటి సమస్య లేకుండా ఉండాలంటే ప్రాజెక్టులు పూర్తి కావాలి’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున జనసేన, తెదేపా, భాజపా కార్యకర్తలు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img