icon icon icon
icon icon icon

YS Sharmila: ఐదేళ్లు జగన్‌.. గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా?: షర్మిల

రైతులను అన్యాయం చేసిన వ్యక్తి సీఎం జగన్‌ అని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.

Updated : 29 Apr 2024 22:26 IST

కొయ్యలగూడెం: రైతులను అన్యాయం చేసిన వ్యక్తి సీఎం జగన్‌ అని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. రైతుల కోసం జగన్‌ రూ.3 వేల కోట్ల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారా? అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో నిర్వహించిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. ఇప్పటి వరకు 2.25 లక్షల ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయని, ఐదేళ్లు పాలించిన జగన్‌.. వాటిని భర్తీ చేయకుండా గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా? అని నిలదీశారు. మద్యపానం నిషేధం కాలేదు సరికదా.. నాసిరకం మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం అమ్మిన బ్రాండ్‌ మద్యం వల్ల 25 శాతం మంది చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం నిర్వాసితులను జగన్‌ నట్టేట ముంచేశారని, పరిహారం ఇవ్వకుండా మొండి చేయి చూపించారని మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img