Aided college: విద్యార్థులపై విరిగిన లాఠీ
ఎయిడెడ్ కళాశాల విలీన నిర్ణయాన్ని విరమించుకోవాలని విద్యార్థుల ఆందోళన.. వారిని అరెస్టు చేసేందుకు పోలీసుల ప్రయత్నం.. విద్యార్థుల ప్రతిఘటన.. పోలీసులు లాఠీలు ఝుళిపించడంతో అనంతపురంలోని ఎస్ఎస్బీఎన్ కళాశాల ఆవరణ రణరంగమైంది.
ఎయిడెడ్ విలీనంపై అనంతపురంలో కళాశాల విద్యార్థుల నిరసన
తరిమికొట్టిన పోలీసులు
విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టు
అనంతపురంలోని ఎస్ఎస్బీఎన్ కళాశాల వద్ద పోలీసు వాహనాన్ని అడ్డుకుంటున్న విద్యార్థులు
అనంతపురం విద్య, నేరవార్తలు, న్యూస్టుడే: ఎయిడెడ్ కళాశాల విలీన నిర్ణయాన్ని విరమించుకోవాలని విద్యార్థుల ఆందోళన.. వారిని అరెస్టు చేసేందుకు పోలీసుల ప్రయత్నం.. విద్యార్థుల ప్రతిఘటన.. పోలీసులు లాఠీలు ఝుళిపించడంతో అనంతపురంలోని ఎస్ఎస్బీఎన్ కళాశాల ఆవరణ రణరంగమైంది. ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాల నాయకులు, వందల మంది విద్యార్థులు అనంతపురంలోని ఎస్ఎస్బీఎన్ (శ్రీసాయిబాబా నేషనల్) కళాశాల వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. కళాశాలను ప్రైవేటీకరించకుండా ఎయిడెడ్గానే కొనసాగించాలని నినాదాలు చేశారు. పోలీసులు వచ్చి ఆందోళన చేస్తున్న ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. నాయకులను అరెస్టు చేసి తీసుకెళ్లకుండా విద్యార్థులు కళాశాల ప్రధాన ద్వారాన్ని మూసివేశారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. అడ్డుకున్నవారిని లాగిపడేశారు. జెండా కర్రలు తీసుకొని చితక్కొట్టారు. దీంతో కొందరు విద్యార్థులు గుంపులో నుంచి రాళ్లు విసిరారు. ఈ ఘటనలో జయలక్ష్మి అనే విద్యార్థిని గాయపడింది. విద్యార్థులు ప్రతిఘటించడంతో ఆగ్రహించిన పోలీసులు వారిని చొక్కాలు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. విద్యార్థినులనూ పురుష కానిస్టేబుళ్లే పక్కకు నెట్టేశారు. ఎట్టకేలకు విద్యార్థిసంఘాల నాయకులను అరెస్టు చేసి స్టేషనుకు తరలించడంతో పరిస్థితి అదుపులోకొచ్చింది.
విద్యార్థిని లాక్కెళ్తున్న పోలీసులు
విద్యార్థులపై లాఠీఛార్జి చేయలేదు
అనంతపురంలోని ఎస్ఎస్బీఎన్ కళాశాల వద్ద పోలీసులు విద్యార్థులపై లాఠీఛార్జీ చేయలేదని జిల్లా పోలీసు కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ‘విద్యార్థులను కళాశాలలోకి వెళ్లకుండా ఆటంకపరుస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసులపై విద్యార్థులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఓ విద్యార్థిని గాయపడింది. ఆమెను పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు’ అని ఆ ప్రకటనలో వెల్లడించింది.
గాయపడిన విద్యార్థిని
లోకేశ్ పరామర్శ
ఆందోళనలో గాయపడిన విద్యార్థులు జయలక్ష్మి, నవీన్, పవన్లతో తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ వీడియోకాల్ చేసి మాట్లాడారు. విద్యార్థుల పెడరెక్కలు విరిచి, జీపుల్లో కుక్కి లాక్కెళ్లారని గాయపడిన జయలక్ష్మి లోకేశ్కు వివరించింది. ఎయిడెడ్ విద్యాసంస్థలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకొనే వరకూ తెదేపా, అనుబంధ సంఘాలు విద్యార్థులకు అండగా నిలుస్తాయన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్ధులపై లాఠీఛార్జి చేయించడం, తలలు పగిలేలా కొట్టించడం అహంకార ధోరణికి నిదర్శనమన్నారు. లాఠీఛార్జి చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. లోకేశ్ బుధవారం అనంతపురం వెళ్లి పోలీసుల దాడిలో గాయపడిన విద్యార్ధులను పరామర్శిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
బాధితురాలితో ఫోన్లో మాట్లాడుతున్న తెదేపా నేత నారా లోకేశ్
విద్యార్థులపై లాఠీలా?: నాదెండ్ల మనోహర్
అనంతపురంలోని ఎస్ఎస్బీఎన్ కళాశాలను ఎయిడెడ్గానే కొనసాగించాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీలు ఝులిపించి భయభ్రాంతులకు గురిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులను పోలీసుల ద్వారా ఆపాలని చూడటం అప్రజాస్వామికమన్నారు.
చదువుల తల్లుల రక్తాన్ని కళ్లజూస్తారా?: చంద్రబాబు
‘మీ బిడ్డలు కూడా తమ విద్యాసంస్థను కాపాడుకునేందుకు ఆందోళన చేస్తే.. ఇలాగే దాడులు చేస్తారా? నిలదీసే విద్యార్ధులకు లాఠీ దెబ్బలే జవాబులా? ఇది ప్రజాస్వామ్యమా? రాక్షస రాజ్యమా?’ అని తెదేపా అధినేత చంద్రబాబు పోలీసుల్ని ప్రశ్నించారు. అనంతపురంలో విద్యార్థులపై పోలీసుల దాడిని ఖండిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. ‘విద్యార్ధినుల పట్ల కనీస మానవత్వం చూపకుండా.. కొంతమంది పోలీసులు రౌడీమూకల్లా మారి.. చదువుల తల్లుల రక్తం కళ్లజూడటం వారి పైశాచికత్వానికి పరాకాష్ఠ. మేనమామ అంటే బతుకు కోరేవాడు.. ఇలా బడులు, కళాశాలల్ని మూసేసేవారు, అడిగితే అరాచకంగా దాడి చేసేవారు కాదు’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..?
తాజా వార్తలు (Latest News)
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!