Meenesh singh: భారత్లో అమలుకు సిద్ధం
వ్యర్థ జలాల్లోని నైట్రేట్ నుంచి అమ్మోనియాను ఉత్పత్తి చేసే తమ పరిజ్ఞానాన్ని భారత్లో అమలు చేసేందుకు సిద్ధమని శాస్త్రవేత్త మీనేశ్ సింగ్ పేర్కొన్నారు. దీనివల్ల ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎరువులను తయారుచేయడానికి
వ్యర్థ జలాల నుంచి అమ్మోనియా ఉత్పత్తికి తోడ్పాటు
‘ఈనాడు’ ముఖాముఖిలో మీనేశ్ సింగ్
మీనేశ్ సింగ్
వ్యర్థ జలాల్లోని నైట్రేట్ నుంచి అమ్మోనియాను ఉత్పత్తి చేసే తమ పరిజ్ఞానాన్ని భారత్లో అమలు చేసేందుకు సిద్ధమని శాస్త్రవేత్త మీనేశ్ సింగ్ పేర్కొన్నారు. దీనివల్ల ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎరువులను తయారుచేయడానికి వీలవుతుందని చెప్పారు. యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినోయీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న భారత సంతతి పరిశోధకుడు మీనేశ్.. తన నేతృత్వంలోని బృందం అభివృద్ధి చేసిన నూతన పరిజ్ఞానంపై ‘ఈనాడు’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.
ఒకే బాణంతో మూడు పిట్టలను కొట్టినట్లున్నారు. (వ్యర్థ జలాల సమస్య, సౌరశక్తి సమర్థ వినియోగం, అమ్మోనియా ఉత్పత్తి). ఈ ప్రయోగంతో ముడిపడిన సాంకేతికత, దాని నేపథ్యం వివరించండి.
నైట్రోజన్, నీరు సాయంతో అమ్మోనియాను తయారుచేసేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. గతంలో మేం 20 శాతం ఉత్పాదకతను సాధించగలిగినా.. భారీ స్థాయిలో ఉత్పత్తికి అది అనువైంది కాదు. నైట్రోజన్లోని ట్రిపుల్ బాండ్ చాలా బలమైంది కావడం, దాన్ని విచ్ఛిన్నం చేయడానికి భారీగా శక్తి అవసరం కావడమే ఇందుకు కారణం. ప్రకృతి సిద్ధంగా తయారయ్యే అమ్మోనియా, కర్మాగారాల్లో ఉత్పత్తయ్యే ఎరువులు.. నైట్రిఫికేషన్ అనే ప్రక్రియ ద్వారా నైట్రేట్లు, నైట్రైట్లుగా మారిపోతుంటాయి. అవి సాధారణ, వ్యవసాయ వ్యర్థ జలాల్లో కలుస్తున్నాయి. నైట్రేట్లోని పరమాణువుల మధ్య బలమైన బంధం ఉండదు. అందువల్ల దాన్ని అమ్మోనియాగా మార్చడం చాలా సులువు. మా విధానంలో సూర్యకాంతి, నీరు ద్వారా నైట్రేట్ను అమ్మోనియాగా మారుస్తున్నాం. తద్వారా హైడ్రోజన్నూ నిల్వ చేయగలుగుతున్నాం. అమ్మోనియా అణువులో మూడు హైడ్రోజన్ పరమాణువులు ఉంటాయి. అమ్మోనియాను ‘అమ్మోనియా ఫ్యూయెల్ సెల్’లోకి పంపి, విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చు. ఇందులో నైట్రోజన్, నీరు ఉప ఉత్పత్తులుగా వెలువడతాయి. ఈ లెక్కన చూస్తే మేం ఒకే బాణంతో నాలుగు పిట్టలను కొట్టినట్లే. (వ్యర్థ జలాల వినియోగం, సౌరశక్తి సమర్థ వినియోగం, ఎరువుల ఉత్పత్తి, హైడ్రోజన్ నిల్వ)
భారత్లో వ్యర్థ జలాలూ పెద్ద సమస్యే. దీనివల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీన్ని అధిగమించడానికి మీ సాంకేతికత ఎలా సాయపడుతుంది?
నైట్రేట్తో భూగర్భజలాలు కలుషితం కావడం భారత్లో పెద్ద సమస్యే. తాగునీటిలో నైట్రేట్ పరిమాణం ఎక్కువగా ఉండటం వల్ల క్యాన్సర్, థైరాయిడ్ వ్యాధి, నెలలు నిండకుండానే కాన్పులు జరగడం, శిశువులు తక్కువ బరువుతో పుట్టడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వ్యర్థ జలాల్లోని నైట్రేట్ను అమ్మోనియాగా మార్చడానికి మా టెక్నాలజీ ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ నైట్రేట్ను ఒడిసిపట్టడమే ప్రధాన సవాల్. ఎలక్ట్రోడయాలసిస్ ప్రక్రియ సమర్థతపై ఇది ఆధారపడి ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా అధిక ఉత్పాదకత సాధించే అంశంలో ఇంకా అనేక సవాళ్లు ఉన్నాయి.
భారత్ వ్యవసాయాధార దేశం. ఇక్కడ అమ్మోనియాకు భారీ డిమాండ్ ఉంది. ఏటా భారీగా అమ్మోనియాను దిగుమతి చేసుకుంటున్నాం. మీ సాంకేతికతతో ఇక్కడి సమస్యలు ఎలా పరిష్కారమవుతాయి?
పునరుత్పాదక పద్ధతిలో అమ్మోనియా ఉత్పత్తికి సంబంధించి ప్రస్తుతమున్న విధానాల కన్నా ఇది ఆర్థికంగా చాలా మెరుగైంది. మరింత పర్యావరణహితమైంది. ఆచరణయోగ్యంగానూ ఉంటుంది. భారత్లో దాదాపు 600 మురుగునీటి శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. వాటిలోని నైట్రేట్ల ద్వారా ఏటా దాదాపు 240 టన్నుల అమ్మోనియాను ఉత్పత్తి చేయవచ్చు. భారత్ దిగుమతి చేసుకుంటున్న అమ్మోనియాలో అధిక భాగాన్ని బొగ్గు మైనింగ్కు అవసరమైన పేలుడు పదార్థాల తయారీకి వాడుతున్నట్లున్నారు. మా సాంకేతికతతో ఎరువులకు అవసరమైన అమ్మోనియా ఉత్పత్తికి అదనపు మార్గం ఏర్పడుతుంది. దీనికితోడు గాల్లోని నత్రజనిని ఆక్సిడైజ్ చేసి, నైట్రేట్ను తయారుచేస్తే.. భారత్లో ఏటా 20 లక్షల టన్నుల అమ్మోనియాను పర్యావరణ అనుకూల పద్ధతిలో ఉత్పత్తి చేయవచ్చు.
మీ సాంకేతికత ఆధారంగా పూర్తిస్థాయి వ్యవస్థల అభివృద్ధికి నగర పాలక సంస్థలు, వ్యర్థజలాల శుద్ధి కేంద్రాలు, పరిశ్రమలతో భాగస్వామ్యాలు ఏర్పర్చుకుంటున్నట్లు చెప్పారు. భారత్లోని ఏమైనా నగరాలు మిమ్మల్ని సంప్రదించాయా?
భారత్లో ఈ సాంకేతికతను అమలు చేయాలని గట్టిగా భావిస్తున్నాం. అయితే మాది విద్యా సంస్థ కావడం వల్ల టెక్నాలజీల అమలుకు పారిశ్రామిక భాగస్వాములపై ఆధారపడుతుంటాం. దీనిపై భారత్ నుంచి ఇంకా ఎవరూ మమ్మల్ని సంప్రదించలేదు. ఇప్పుడు మీడియాలో కథనాల వల్ల స్పందన రావొచ్చని భావిస్తున్నాం.
వ్యర్థ జలాల నుంచి అమ్మోనియాను ఉత్పత్తి చేసే కర్మాగారాన్ని పొలాల్లో ఏర్పాటు చేసుకోవచ్చా? తద్వారా అక్కడికక్కడే వినియోగానికి వీలవుతుంది కదా?
కచ్చితంగా! వ్యవసాయ క్షేత్రాల్లోని నైట్రేట్ ద్వారా వికేంద్రీకృత, మాడ్యులర్ పద్ధతిలో అమ్మోనియాను ఉత్పత్తి చేయడానికి ఈ సాంకేతికతను ఉపయోగించొచ్చు. తద్వారా రైతులు తమ పొలాలకు దీర్ఘకాలం పాటు పోషకాలను అందించొచ్చు.
వ్యర్థ జలాల నుంచి అమ్మోనియాను ఉత్పత్తి చేసే వ్యవస్థ (ఊహా చిత్రం)
తాజా సాంకేతికతను పూర్తిస్థాయిలో ఒడిసిపట్టాలంటే పారిశ్రామిక స్థాయిలో ఉత్పత్తి సామర్థ్యాన్ని చాటాలి. ఈ సాంకేతికతను ఏ స్థాయి వరకూ పెంచొచ్చు?
మా ప్రయత్నాన్ని ఇక్కడితో ఆపబోం. భారీ ప్రొటోటైప్ను సిద్ధం చేస్తాం. అందులో మరింత పెద్ద పరిమాణంలో ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తాం. ఇందుకోసం ‘వరల్డ్వైడ్ లిక్విడ్ సన్షైన్ ఎల్ఎల్సీ’తోపాటు మిన్నెసోటా రాష్ట్రంలోని లి సియుర్ నగరంలో ఉన్న ఒక నీటి శుద్ధి కర్మాగారంతో కలిసి పనిచేస్తున్నాం. తద్వారా వ్యర్థ జలాల నుంచి నిరంతరంగా నైట్రేట్ను ఒడిసిపట్టి, రోజుకు కిలో చొప్పున అమ్మోనియాను ఉత్పత్తి చేయాలనుకుంటున్నాం. మరిన్ని శుద్ధి కర్మాగారాల నుంచి వ్యర్థ జలాలను సేకరించి, రోజుకు 100 కిలోల వరకూ ఉత్పత్తిని సాధించొచ్చు. 2024 ప్రారంభం నాటికి మిన్నెసోటాలో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేయాలనుకుంటున్నాం.
ఈ సాంకేతికతతో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎరువులను ఉత్పత్తి చేయవచ్చని మీరు చెప్పారు. దీన్ని సాధించే మార్గాలేంటి?
ఇందుకోసం ఎలక్ట్రో డయాలసిస్ యూనిట్ అవసరం. ఇందులో వ్యవసాయ, సాధారణ వ్యర్థ జలాల్లోని నైట్రేట్ను కాన్సంట్రేట్ చేసి, దాన్ని మా సాంకేతికతతో అమ్మోనియాగా మార్చాలి. నైట్రేట్, కార్బన్ డైఆక్సైడ్లను నిర్దిష్ట ఉత్ప్రేరకంతో కలపడం ద్వారా కూడా యూరియాను తయారుచేయవచ్చు. దీనిపైనా పరిశోధనలు చేపట్టాం.
గాల్లోని నత్రజనిని నైట్రేట్గా మార్చే పరిజ్ఞానమేదైనా మీరు అభివృద్ధి చేస్తున్నారా?
ఔను! తదుపరి ఈ పరిజ్ఞానంపైనే దృష్టి పెట్టబోతున్నాం. అందులో రియాక్టర్లోకి గాలిని చొప్పిస్తాం. గాల్లోని నైట్రోజన్.. ఆక్సీకరణం చెంది తొలుత నైట్రేట్గా, ఆ తర్వాత అమ్మోనియాగా మారుతుంది. ఈ సాంకేతికతలో గాలి, నీరును మాత్రమే ఉపయోగిస్తాం.
ఈ సాంకేతికత ద్వారా శక్తి వినియోగం ఎక్కువగా ఉన్నట్లుంది?
సంప్రదాయ ‘హేబర్ బాష్ విధానం’లో కిలో అమ్మోనియా ఉత్పత్తికి దాదాపు 30 మెగాజోల్స్ మేర శక్తి వినియోగమవుతుంది. అయితే ప్రస్తుతం ఈ ప్రక్రియ వల్ల ఏటా దాదాపు 450 మెట్రిక్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తవుతోంది. ఇది భూతాపాన్ని పెంచుతుంది. మా సాంకేతికతలో శక్తి వినియోగం.. కిలోకు 75 మెగా జోల్స్ మేర ఉంటుంది. ఇక్కడ శక్తి వినియోగం ఎక్కువే అయినా.. అది సౌర ఆధారితం. హానికర వాయువులు వెలువడవు.
ఇంకా ఏమేం పరిశోధనలు చేస్తున్నారు?
రసాయనాల ఉత్పత్తి ప్రక్రియలను విద్యుత్ రసాయన టెక్నాలజీ సాయంతో కర్బనరహితం చేయాలనుకుంటున్నాం. పారిశ్రామిక రసాయనాల్లో.. కార్బన్ డైఆక్సైడ్ను అత్యధికంగా వెలువరించే వాటిలో.. అమ్మోనియా, ఇథలీన్, మిథనాల్ల ఉత్పత్తి ప్రక్రియలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. విద్యుత్ రసాయన చర్యల ద్వారా అమ్మోనియా ఉత్పత్తి, కార్బన్ డైఆక్సైడ్ను ఒడిసిపట్టి ఇథలీన్గా మార్చే ప్రక్రియలకు అవసరమైన టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాం. ఇదే తరహా చర్యలతో మీథేన్ను మిథనాల్గా మార్చడంపైనా దృష్టిపెట్టాం. కార్బన్ డైఆక్సైడ్ను ఒడిసిపట్టి.. మిథనాల్, గ్రాఫీన్, ఎసిటిక్ ఆమ్లం, యూరియా వంటి ప్రయోజనకర ఉత్పత్తులను తయారుచేసేందుకు ప్రయత్నిస్తున్నాం. నైట్రోజన్ను అమ్మోనియా, అమైడ్లు, నైట్రైల్స్గా మార్చేందుకు కసరత్తు చేస్తున్నాం
పారిశ్రామిక వ్యర్థాలు, పొలాల నుంచి వచ్చే వ్యర్థ జలాల సమస్యను పరిష్కరించడం, ప్రకృతిలో నత్రజని సైకిల్ను సమతౌల్యం చేయడం మా సాంకేతికతతో సాధ్యమవుతుంది. నైట్రేట్ సమస్య ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాలకు ఇది అనువైంది.
- ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్