‘సెల్ఫీ’ సాయంతో హృద్రోగం కనిపెట్టొచ్చా..?
ప్రస్తుతం కాలంలో సెల్ఫీ (ముఖ చిత్రం) గురించి తెలియని వారుండరు. స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక సెల్ఫీలు తీసుకోవడం మరీ ఎక్కువై పోయిందనే చెప్పాలి...
పరిశోధనలు జరుగుతున్నట్లు ఓ అధ్యయనం వెల్లడి
ప్రస్తుతం కాలంలో సెల్ఫీ (స్వీయ చిత్రం) గురించి తెలియని వారుండరు. స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక సెల్ఫీలు తీసుకోవడం మరీ ఎక్కువై పోయిందనే చెప్పాలి. సన్నిహితులు, స్నేహితులను ఎవరినైనా కలిసినప్పుడు, కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు సహజంగానే సెల్ఫీలు దిగుతుంటాం. అయితే ఇదే వైద్య రంగంలో నూతన విధానానికి నాంది పలుకుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ)... ఎన్నో అద్భుత ఆవిష్క్రణలకు వేదికగా నిలుస్తోంది. గుండె సంబంధిత వ్యాధులను అంచనా వేయడానికి సెల్ఫీలతో డేటా రూపొందేలా కృత్రిమ మేధతో అభివృద్ధి చేస్తున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది.
హృద్రోగ చికిత్స నిపుణుడి (కార్డియాలజిస్టు) దగ్గరకు వెళ్తే తప్పనిసరిగా గత వైద్య నివేదికలను తీసుకెళ్తాం.. రాబోయే కాలంలో రికార్డులకు బదులు మీ సెల్ఫీని ఒకటి పంపండని వైద్యులు అడిగితే ఎలా ఉంటుందో ఓ సారి ఊహించుకోండి.. ఇప్పటి వరకు ఇలాంటిది వైద్య రంగానికి వింతగానే ఉండొచ్చుగాని.. భవిష్యత్తులో ఓ వ్యక్తిలోని గుండె జబ్బులను కనిపెట్టేందుకు ‘సెల్ఫీ’ అడిగే విధానమే రాబోతుందని ఓ అధ్యయనం పేర్కొంది. సాధారణ, అధిక ప్రమాదం కలిగిన ప్రజల హృద్రోగాలను గుర్తించి తదుపరి వైద్యపరమైన చర్యలు తీసుకునేందుకు ఈ అల్గారిథం స్క్రీనింగ్ సాధనంగా ఉపయోగపడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.
‘‘ముఖ చిత్రాలను విశ్లేషించి హృద్రోగాలను గుర్తించడానికి కృత్రిమ మేధ ఉపయోగపడుతుందని నిరూపించే మొదటి పని ఇది. క్లినిక్లలో సొంతంగా స్క్రీనింగ్ చేసేందుకు, రోగుల సెల్ఫీల ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడే సాధనం అభివృద్ధికి తొలి అడుగు’’ అని ప్రొఫెసర్ జీ జెంగ్ అభిప్రాయపడ్డారు. క్లినిక్కు రాకముందే గుండె జబ్బుల ప్రమాదాన్ని అంచనా వేయడానికి స్వీయ నివేదిక అప్లికేషన్ను అభివృద్ధి చేయడమే లక్ష్యమని పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ జెంగ్ తెలిపారు. తదుపరి పరిశోధన అవసరమయ్యే రోగులను గుర్తించడానికి ఇది చౌకగా, సరళంగా, ప్రభావవంతంగా ఉండాలని యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ వెబ్సైట్ అధికారిక పేజీలో జెంగ్ వివరించారు. ముఖ కవళికల ద్వారా హృద్రోగం ప్రమాదం ఎంత మేరకు ఉందో తెలుసుకోవచ్చు. సన్నబడటం, జుట్టు, చెవి, ముడతలు, చర్మం కింద కొవ్వు శాతం వంటి లక్షణాలను సెల్ఫీ ద్వారా గుర్తించి పరిస్థితిని అంచనా వేయవచ్చని చెప్పారు. అయితే ఇలాంటి లక్షణాలను విశ్లేషించి గుండె జబ్బుల ప్రమాదాన్ని అంచనా వేసేందుకు ఉపయోగించడం కష్టతరమేనని వ్యాఖ్యానించారు.
పరిశోధన కోసం జెంగ్ బృందం ఎనిమిది చైనా ఆసుపత్రుల నుంచి 5,796 మంది రోగులను ఎంచుకున్నారు. జులై 2017 నుంచి మార్చి 2019 మధ్య వారిపై అధ్యయనం చేశారు. రోగులందరి రక్తనాళాలను పరిశోధించడానికి కరోనరీ యాంజియోగ్రఫీ, కరోనరీ కంప్యూటెడ్ టోమోగ్రఫీ యాంజియోగ్రఫీ వంటి ఇమేజింగ్ విధానాలను వినియోగించారు. వ్యాధిగ్రస్తుల ఛాయాచిత్రాలను తీయడానికి డిజిటల్ కెమెరాలను ఉపయోగించారు. రేడియాలజిస్టులు యాంజియోగ్రామ్లను విశ్లేషించి రోగుల్లోని గుండె జబ్బుల స్థాయిని అంచనా వేశారు. ఈ సమాచారం సేకరణ అంతా కంప్యూటర్ అల్గారిథంకు శిక్షణ ఇవ్వడానికి, ధ్రువీకరించేందుకు వినియోగించారు. అల్గారిథం సిద్ధమైన తర్వాత గతేడాది ఏప్రిల్-జులై మధ్య మరో 1,013 మంది రోగులపై పరీక్షలు నిర్వహించారు. గుండె జబ్బుల ప్రమాదాన్ని అంచనా వేసే రెండు ప్రస్తుత పద్ధతులు డైమండ్-ఫారెస్టర్ మోడల్, CAD కన్సార్టియం క్లినికల్ స్కోరు విధానాలను అల్గారిథం ప్రదర్శించిందని పరిశోధకులు గుర్తించారు. ‘రోగుల ధ్రువీకరణ సమూహంలో, అల్గారిథం 80% కేసులలో గుండె జబ్బులను సరిగ్గా గుర్తించింది. 61% కేసులలో గుండె జబ్బులు లేవని గుర్తించినట్లు పరిశోధకులు పేర్కొన్నారు.
ఇప్పటి వరకు విజయం సాధించినా అల్గారిథంను ఇంకా అభివృద్ధి పరచాల్సి ఉందని పరిశోధకులు తెలిపారు. అల్గారిథం అభివృద్ధి చేసినా వ్యక్తిగత సమాచారం, ముఖ్యంగా ముఖ కవళికలకు సంబంధించిన డేటా దుర్వినియోగంపై కొన్ని ప్రశ్నలు సమాజం నుంచి వస్తున్నాయి. అధ్యయనంపై నెలకొన్న ఆందోళనలను ఆక్స్ఫర్డ్ వర్సిటీలోని సహ పరిశోధకులు సంపాదకీయంలో లేవనెత్తారు. అటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో నైతికపరమైన సమస్యలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని జెంగ్ అంగీకరించారు. క్లినికల్ సాధనాలపై భవిష్యత్ పరిశోధనలకు అల్గారిథం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గోప్యత, బీమా, ఇతర సామాజిక సమస్యలపై దృష్టి పెట్టాలని చెప్పారు. వైద్య ప్రయోజనాల కోసం మాత్రమే ఈ సాంకేతికతను వినియోగించాల్సి ఉంటుందని ప్రొఫెసర్ జంగ్ స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?