Health Tips: ఆరోగ్యం కావాలా? అయితే ఇలా చేయండి..
మన జీవనశైలి, అలవాట్లే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందంటారు నిపుణులు. తెలిసో, తెలియకో తీసుకునే ఆహార పదార్థాలు, ఆచరించే పద్ధతులు శరీరాన్ని గుల్ల చేస్తుంటాయట. అవి తెలుసుకోకపోతే ఆరోగ్యాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నట్టే అంటారు వైద్యులు. అది జరగకుండా ఉండాలంటే ముఖ్యమైన ఈ సూచనలు పాటించాలంటారు.
మన జీవనశైలి, అలవాట్లే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయని అంటారు నిపుణులు. తెలిసో, తెలియకో తీసుకునే ఆహార పదార్థాలు, ఆచరించే పద్ధతులు శరీరాన్ని గుల్ల చేస్తుంటాయి. అవి తెలుసుకోకపోతే ఆరోగ్యాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నట్టే అంటారు వైద్యులు. అది జరగకుండా ఉండాలంటే ముఖ్యమైన ఈ సూచనలు పాటించాలని చెబుతున్నారు..
💡 సరిపోయినంత నిద్ర
మీరెప్పుడైనా గమనించారా? సరిగా నిద్రపోకపోతే తర్వాత ఏమవుతుందో? ఆ రోజంతా చిరాగ్గా ఉంటుంది. కొందరికి తల పోటు మొదలవుతుంది. కునికిపాట్లు వస్తుంటే సరిగా పని చేయలేం. ఏకాగ్రత కుదరదు. ఇవేకాదు.. తరచూ కనీసం ఆరు గంటల పాటు నిద్ర పోకుండా ఉంటే కలిగే దుష్ఫలితాలు చాలా ఎక్కువే ఉంటాయంటారు వైద్య నిపుణులు. వాళ్లు చెబుతున్న దాని ప్రకారం మన శరీరం ప్రతిరోజూ నిద్ర తర్వాత కొత్తగా ఉత్తేజితమవుతుంది. కొత్త పనులు చేయడానికి శరీరంలోని అన్ని అవయవాలు సిద్ధమవుతాయి. కానీ నిద్రలేమి కారణంగా సహజంగా సాగాల్సిన ఈ ప్రక్రియ దెబ్బతింటుంది. అవయవాల పనితీరులో వేగం తగ్గుతుంది. అయినా ఆ అలవాటు అలాగే కొనసాగిస్తుంటే చివరికి రోగ నిరోధక వ్యవస్థ దెబ్బ తింటుంది. శ్వాసకోశ, జీర్ణ వ్యవస్థల్లో లోపాలు ఏర్పడతాయి.
💡 విపరీతమైన ప్రొటీన్లు
శరీరానికి పోషక పదార్థాలు అవసరమే. కానీ అత్యధిక ప్రొటీన్లు హానికారకం. ముఖ్యంగా జంతు ఉత్పత్తుల ద్వారా వచ్చే ప్రొటీన్లు అత్యంత ప్రమాదకరం. మాంసాహారం, పాల ఉత్పత్తుల్లో ఐజీఎఫ్1 అనే క్యాన్సర్ కారక హార్మోన్లు ఉంటాయి. అందుకే వీటిని ఒక పరిమితి మించి తీసుకోవద్దు. వీటికి బదులు మొక్కల నుంచి లభించే బీన్స్, క్వినోవా, చిక్కుడులాంటి ప్రొటీన్లకు ఆహారంలో అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
💡 అదేపనిగా కూర్చోవడం
ఎంత ముఖ్యమైన పని ఉన్నా ఒకేచోట గంటలకొద్దీ కూర్చోవద్దు. కుర్చీకే అతుక్కుపోయి పని చేయడం పొగ తాగే అలవాటుకన్నా ప్రమాదం. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తులు, వక్షోజ, పెద్దపేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చాలా అధ్యయనాల్లో తేలింది. గంటలకొద్దీ డ్రైవింగ్ చేయడం కూడా ముప్పుగానే పరిణమిస్తుంది. దీన్ని నివారించాలంటే కనీసం రెండు గంటలకోసారైనా లేచి కాసేపు తిరగాలి. శరీరాన్ని కాస్త అటు ఇటూ వంచాలి.
💡 ఏకాంతం వద్దు
మనిషి ప్రశాంతంగా గడపడానికి కాసేపు ఒంటరిగా ఉండాలనుకోవడం తప్పు కాదు. కానీ రోజంతా ఏకాంతంగా ఉండాలి, నా దరిదాపుల్లోకి ఎవరూ రావొద్దు అనుకోవడం మానసిక సమస్యలకు దారి తీస్తుంది. కరోనా పుణ్యమాని మనుషుల మధ్య ఇప్పటికే దూరం పెరిగిపోయింది. ఇది భౌతికానికి మాత్రమే పరిమితం కావాలి. రోజులో ఎక్కువసేపు ఏకాంతంగా గడిపేవాళ్లకి గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. మానసిక ఒత్తిడి, భావోద్వేగపరంగా చికాకులూ ఏర్పడతాయి. ఈ ఒంటరితనం నుంచి తప్పించుకోవడానికి కొందరు హానికరమైన వ్యసనాలకు బానిసలవుతారు. ఈ ప్రమాదం తప్పాలంటే నలుగురితో స్నేహం చేయాలి. ఇష్టపడే వ్యక్తులకు దగ్గరలో ఉండటానికి ప్రయత్నించాలి.
💡 గడప దాటండి
ఈతరం ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య విటమిన్ డి లోపం. ఉద్యోగం, జీవనశైలి కారణంగా ఎక్కువమంది ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇలా చేయడం వల్ల మనలోని రోగ నిరోధకశక్తి మందగిస్తుంది. ఈ ముప్పు తప్పాలంటే శరీరానికి కాసేపైనా సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. విటమిన్ డి లోపంతో పిల్లల్లో ఆస్తమా, పెద్దల్లో కార్డియోవ్యాస్కులర్ డిసీజ్, మధుమేహం, క్యాన్సర్లాంటివి వచ్చే ప్రమాదం పొంచి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
జపాన్లోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఆచరించే ఓ సంప్రదాయం గురించిన విషయాలు ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి. -
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్