మస్క్‌ సార్‌.. మీరే వచ్చి చూడండి

వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయటం అంతరిక్ష సంస్థ స్పేస్‌ ఎక్స్‌ సీఈఓ ఎలాన్‌ మస్క్‌కు పరిపాటి.

Published : 04 Aug 2020 00:53 IST

ఎలాన్‌ మస్క్‌కు ఆహ్వానం

ఇంటర్నెట్‌ డెస్క్‌: అతి ముఖ్యమైన విషయాలను గురించి సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయటం అంతరిక్ష సంస్థ స్పేస్‌ ఎక్స్‌ సీఈఓ ఎలాన్‌ మస్క్‌కు పరిపాటి.  కరోనా వైరస్‌ గురించి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని గతంలో ఆయన చేసిన ట్వీట్‌ చర్చనీయాంశమయింది. కాగా ఈయన ఇటీవల చేసిన ఓ ట్వీట్‌కు స్పందనగా.. ప్రపంచ ప్రఖ్యాత పిరమిడ్లను దర్శించాలని అనూహ్య ఆహ్వానం అందింది. వివరాలు ఇలా ఉన్నాయి...

49 ఏళ్ల సాంకేతిక దిగ్గజం మస్క్‌ హాస్యానికో, నిజంగా అవగాహన లేకనో గాని.. ‘‘పిరమిడ్లను గ్రహాంతర వాసులు నిర్మించారు...’’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ గొప్ప నిర్మాణాలు 3800 సంవత్సరాల నాటివని కూడా అయన అన్నారు. మూడు రోజుల క్రితం షేర్‌ చేసిన ఈ ట్వీట్‌కు 5.4 లక్షలకు పైగా లైక్‌లు, పలు రీట్వీట్‌లు లభించాయి. ఈ వ్యవహారంపై ఈజిప్టు  మంత్రి రనియా అల్‌ మషత్‌ స్పందించారు. తమ దేశానికి వచ్చి, పిరమిడ్లను నిర్మాతల సమాధులను చూసి విషయాన్ని రూఢి చేసుకోవాల్సిందిగా ఆమె మస్క్‌ను కోరారు. అయితే హాస్యానికైనా సరే, ఎలాన్‌ మస్క్‌ ఈ విధంగా వ్యాఖ్యానించడాన్ని పలువురు తప్పుపట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని