ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ పదవీకాలం పొడిగింపు 

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) డైరెక్టర్ సంజయ్‌ కుమార్‌ మిశ్రా పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ ఆధీనంలో ఉండే రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ శుక్రవారం

Published : 15 Nov 2020 02:56 IST

న్యూదిల్లీ : ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) డైరెక్టర్ సంజయ్‌ కుమార్‌ మిశ్రా పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ ఆధీనంలో ఉండే రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా ఈడీ డైరెక్టర్ రెండేళ్ల పదవీకాలం నిబంధనతో నియమితులవుతారు. వచ్చే వారంతో సంజయ్‌ కుమార్‌ పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన పదవిలో చేరినప్పటి ఉత్తర్వుల్లో రెండేళ్లుగా ఉన్న పదవీకాలం మూడేళ్లకు పొడిగిస్తూ మార్పులు చేశారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని