AP Employees: 160 డిమాండ్లతో ఏపీ సీఎస్‌కు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వినతిపత్రం

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు ఇవాళ సీఎస్‌ జవహర్‌రెడ్డిని కలిశారు. మరోమారు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సీఎస్‌కు అందించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు సూర్యనారాయణ, ఆస్కార్‌ రావు కలిసి 160 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సీఎస్‌కు అందించారు.

Published : 29 May 2023 21:39 IST

అమరావతి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు ఇవాళ సీఎస్‌ జవహర్‌రెడ్డిని కలిశారు. మరోమారు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సీఎస్‌కు అందించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు సూర్యనారాయణ, ఆస్కార్‌ రావు కలిసి 160 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సీఎస్‌కు అందించారు. మే 22 నుంచి చేయాలని తలపెట్టిన దశలవారీ ఆందోళనల వివరాలను సీఎస్‌కు వివరించారు. సివిల్‌ సర్వీసెస్‌ జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ భేటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయని సీఎస్‌కు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని