తెలుగు రాష్ట్రాల్లో సోదాలపై ఐటీశాఖ ప్రకటన
తెలుగు రాష్ట్రాలు, దిల్లీ, పుణె సహా 40 చోట్ల జరిపిన సోదాలపై ఆదాయపన్ను (ఐటీ)శాఖ ప్రకటన చేసింది. ఏపీ, తెలంగాణలో సుమారు రూ.2వేల కోట్ల విలువైన అవకతవకలు జరిగినట్లు గుర్తించామని ఆ ప్రకటనలో ఐటీ శాఖ పేర్కొంది.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలు, దిల్లీ, పుణె సహా 40 చోట్ల జరిపిన సోదాలపై ఆదాయపన్ను (ఐటీ)శాఖ ప్రకటన చేసింది. ఏపీ, తెలంగాణలో సుమారు రూ.2వేల కోట్ల విలువైన అవకతవకలు జరిగినట్లు గుర్తించామని ఆ ప్రకటనలో ఐటీ శాఖ పేర్కొంది. హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖపట్నం, దిల్లీ, పుణె నగరాల్లో దాడులు జరిపామని వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో జరిపిన సోదాల్లో కీలక పత్రాలు లభించాయిని.. మూడు ఇన్ఫ్రా కంపెనీల్లో నకిలీ బిల్లులను గుర్తించామని ఐటీ శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. లెక్క చూపని రూ.85లక్షల నగదు, రూ.71లక్షల విలువైన ఆభరణాలు తమ సోదాల్లో లభ్యమైందని తెలిపింది. ఓ ప్రముఖుడి మాజీ వ్యక్తిగత కార్యదర్శి నివాసంలోనూ తనిఖీలు జరిపామని ఐటీశాఖ వెల్లడించింది. బోగస్ సబ్ కాంట్రాక్టర్లు నకిలీ బిల్లులు ద్వారా భారీగా నగదు చలామణి చేస్తున్నట్లు గుర్తించామని ఐటీ శాఖ వివరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే?
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు