ఏపీలో మరో రెండుసార్లు రేషన్‌ సరకులు

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ పరిస్థితుల రీత్యా ప్రతి బియ్యం కార్డుకూ ప్రభుత్వం ఉచితంగా బియ్యం, కేజీ కందిపప్పును ఆదివారం (మార్చి 29న) పంపిణీ చేయనుంది. ఇదే మాదిరిగా ఏప్రిల్ 15న ఓసారి, 29న మరోసారి కూడా ఉచిత రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Published : 28 Mar 2020 23:01 IST

అమరావతి: దేశవ్యాప్త లాక్‌డౌన్‌ పరిస్థితుల రీత్యా ప్రతి బియ్యం కార్డుకూ ప్రభుత్వం ఉచితంగా బియ్యం, కేజీ కందిపప్పును ఆదివారం (మార్చి 29న) పంపిణీ చేయనుంది. ఇదే మాదిరిగా ఏప్రిల్ 15న ఓసారి, 29న మరోసారి కూడా ఉచిత రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రతా పథకంలో లేని కార్డులకూ ఈ సాయాన్ని అందించాలని నిర్ణయించారు.

దీనికి అదనంగా ఏప్రిల్ 4న ప్రతి కార్డుదారుడికీ రూ.1000 ఆర్థిక సాయాన్ని కూడా అందించాలని సీఎం ఆదేశించారు. ఏప్రిల్ ఒకటో తేదీనే పింఛన్ల పంపిణీ కూడా పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈసారి బయోమెట్రిక్ వినియోగించొద్దని ప్రభుత్వం వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాలకు సూచనలు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని