అమ్మ, నాన్న వాళ్ల అమ్మాయి

కరోనా వ్యాధి.. ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. నివారణ ఔషధాలు లేని ఈ వ్యాధికి.. వైద్యులు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని రోగులకు చికిత్సలు అందించాల్సిన పరిస్థితి. ఈ వాతావరణంలో

Updated : 03 Apr 2020 07:52 IST

 కరోనా బాధితుల సేవలో వైద్యుల కుటుంబం

అమీర్‌పేట : కరోనా వ్యాధి.. ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. నివారణ ఔషధాలు లేని ఈ వ్యాధికి.. వైద్యులు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని రోగులకు చికిత్సలు అందించాల్సిన పరిస్థితి. ఈ వాతావరణంలో ఓ కుటుంబంలోని ముగ్గురు వైద్యులూ కరోనా బాధితుల సేవలోనే తరిస్తుండడం విశేషం. హైదరాబాద్‌లోని ఛాతీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా సేవలందిస్తున్నారు డా.మహబూబ్‌ఖాన్‌. శ్వాసకోశ వ్యాధుల నిపుణులైన ఖాన్‌.. ఛాతీ ఆసుపత్రిలో కరోనా రోగులకు చికిత్సలు అందిస్తున్నారు. ఇండోనేసియా దేశస్థులు 9 మంది ఈ వ్యాధి నుంచి కోలుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన భార్య షహనాఖాన్‌ గాంధీ ఆసుపత్రిలో చర్మవ్యాధుల నిపుణురాలు. ఆమె అక్కడ కరోనా వార్డ్‌లోనే విధులు నిర్వహిస్తున్నారు. వీరి కుమార్తె రషిఖాఖాన్‌ హౌస్‌సర్జన్‌. ఫీవర్‌ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఆమె.. కొవిడ్‌-19 రోగులు, అనుమానితుల నమూనాలు సేకరించడం తదితర విధుల్లో వైద్యులకు సహాయంగా పనిచేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని