మంచినీళ్లనుకుని శానిటైజర్ తాగి వీఆర్ఏ మృతి
విశాఖపట్నం జిల్లాలో వీఆర్ఏ సారిపల్లి సత్యనారాయణ(55) మంచి నీళ్లు అనుకొని శానిటైజర్ తాగడంతో ప్రాణాలు కోల్పోయారు. నక్కపల్లి ఎస్సై
నక్కపల్లి, న్యూస్టుడే: విశాఖపట్నం జిల్లాలో వీఆర్ఏ సారిపల్లి సత్యనారాయణ(55) మంచి నీళ్లు అనుకొని శానిటైజర్ తాగడంతో ప్రాణాలు కోల్పోయారు. నక్కపల్లి ఎస్సై రామకృష్ణ కథనం ప్రకారం.. సారిపల్లిపాలేనికి చెందిన సత్యనారాయణ ఉపమాకలో వీఆర్ఏగా పనిచేస్తున్నారు. శనివారం సాయంత్రం కార్యాలయానికి తాళాలు వేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో.. అక్కడ బల్లపై సీసాలో ఉన్న శానిటైజర్ను మంచినీరనుకుని తాగేశారు. వెంటనే ఆ విషయాన్ని గుర్తించి సర్వేయర్కు తెలపడంతో అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అరగంట తర్వాత ఆరోగ్యం నిలకడగా ఉండటంతో వైద్యులు ఇంటికి పంపేశారు. రాత్రి 8 గంటల సమయంలో సత్యనారాయణకు వాంతులు, విరేచనాలు కావడంతో కుటుంబసభ్యులు నక్కపల్లి ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి అనకాపల్లి ప్రాంతీయాసుపత్రికి తీసుకెళుతుండగా మార్గం మధ్యలో మరణించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన చిరుత
ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. ఐదు రోజులుగా చిరుత కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. -
ఆరున్నరేళ్ల పరుగు.. 50 కోట్ల ప్రయాణికులు
హైదరాబాద్ మెట్రోరైలు 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని చేరుకుంది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
-
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ